Quoteఒక లక్షా ఇరవై అయిదు వేల పిఎమ్ కిసాన్ సమృద్ధికేంద్రాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
Quoteపిఎమ్-కిసాన్ లో భాగం గా సుమారు 17,000 కోట్ల రూపాయల విలువైన పధ్నాలుగో వాయిదా సొమ్ము నుఆయన విడుదల చేశారు
Quoteఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) తో 1600 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ ను జతపరచారు
Quoteగంధకం పూత పూసినటువంటి యూరియా - ‘యూరియా గోల్డ్’ ను ఆయన ప్రవేశపెట్టారు
Quoteఅయిదు నూతన వైద్య కళాశాల లను ప్రారంభించడం తో పాటు ఏడు వైద్యకళాశాలల కు శంకుస్థాపన కూడా చేశారు
Quote‘‘కేంద్రం లో ఉన్నప్రభుత్వం రైతుల బాధల ను మరియు అవసరాల ను అర్థం చేసుకొంటున్నది’’
Quote‘‘యూరియా యొక్క ధరల తో రైతులు ఇబ్బందిపడేటట్టు ప్రభుత్వం చేయదు. ఒక రైతు యూరియా ను కొనుగోలు చేసేటందుకు వెళ్ళినప్పుడు, ఆయనకు మోదీ హామీ ఒకటి ఉంది అనే నమ్మకం కలుగుతుంది’’
Quote‘‘పల్లె లువికసిస్తేనే భారతదేశం అభివృద్ధి చెందగలుగుతుంది’’
Quote‘‘రాజస్థాన్ లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన మా ప్రాధాన్యం గా ఉంది’’
Quote‘‘మనమందరం కలసి రాజస్థాన్ యొక్క అభిమానాని కి మరియు వారసత్వాని కి యావత్తుప్రపంచం లో ఒక క్రొత్త గుర్తింపు ను కట్టబెడదాం’’

రాజస్తాన్  గవర్నర్  శ్రీ కల్  రాజ్ మిశ్రాజీ, కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్  తోమర్  జీ, మంత్రులు, పార్లమెంటులో నా  సహచరులు, శాసన సభ్యులు, ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమంలో మాతో పాల్గొంటున్న దేశానికి చెందిన కోట్లాది మంది రైతులు అందరికీ నమస్కారం. రాజస్తాన్  భూభాగం నుంచి దేశానికి చెందిన కోట్లాది మంది రైతులకు అభివాదం చేస్తున్నాను. నేడు రాజస్తాన్  కు చెందిన నా సోదర సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చారు. 

ఖతు శ్యామ్ జీకు చెందిన ఈ భూమి దేశవ్యాప్తంగా భక్తులందరిలోనూ విశ్వాసం, ఆశ నింపుతుంది. పోరాటయోధుల భూమి అయిన షెఖావతి నుంచి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే భాగ్యం నాకు కలిగింది. పిఎం కిసాన్  సమ్మాన్  నిధి పథకం ద్వారా నేడు సుమారు రూ.18,000 కోట్ల సొమ్ము కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఆ సొమ్మును నేరుగానే రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. 

నేడు దేశవ్యాప్తంగా 1.25 లక్షల పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ, బ్లాక్  స్థాయిలో ఏర్పాటైన ఈ కేంద్రాలు నేరుగా కోట్లాది మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలిగిస్తోంది. అలాగే 1500 పైగా వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్  పిఓ), మన రైతుల కోసం ‘‘ఓపెన్  నెట్  వర్క్  ఫర్  డిజిటల్ కామర్స్’’ (ఓఎన్ డిసి) ప్రారంభించడం జరిగింది. దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోని రైతు అయినా ఇంట్లోనే  కూచుని దేశంలోని ఏ ప్రాంతంలోని మార్కెట్  లో అయినా తేలిగ్గా తమ ఉత్పత్తిని విక్రయించవచ్చు. 

నేడు దేశంలో రైతుల కోసం ‘‘యూరియా గోల్డ్’’ విడుదల చేశారు. దీనికి తోడు రాజస్తాన్ లోని విభిన్న నగరాలు కొత్త వైద్య కళాశాలలు, ఏకలవ్య మోడల్  పాఠశాలలు బహుమతిగా అందుకుంటున్నాయి. దేశ ప్రజలు ప్రత్యేకించి రాజస్తాన్  ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

 

|

మిత్రులారా, 
రాజస్తాన్  లోని సికార్, షెఖావతి ప్రాంతాలు రైతులకు అత్యంత బలమైన ప్రదేశాలు. కష్టించి పని చేసే విషయంలో తమ బాటలో ఏ అవరోధం ఉండబోదని రైతులు ఎల్లప్పుడూ నిరూపిస్తున్నారు. నీటి కొరత ఉన్న సమయాల్లో కూడా రైతులు తమ భూముల్లో అద్భుతమైన దిగుబడులు రాబట్టగలుగుతున్నారు. రైతుల సామర్థ్యం, కష్టించి  పని చేసే  స్వభావం భూమి నుంచి బంగారం పండిస్తోంది. అందుకే మా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. 

మిత్రులారా,
దేశానికి  స్వాతంత్ర్యం సిద్ధించిన దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకి రైతుల కష్టాలు, బాధలు అర్ధం చేసుకునే ప్రభుత్వం మనకుంది. ఈ కారణంగానే కేంద్రప్రభుత్వం గత తొమ్మిది  సంవత్సరాలుగా రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. మేం రైతుల కోసం విత్తనం నుంచి మార్కెట్ల పేరిట ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు చేశాం. 2015 సంవత్సరంలో రాజస్తాన్  లోని సూరత్  ఘర్  నుంచి సాయిల్  హెల్త్  కార్డుల పథకం ప్రారంభించాం. ఈ పథకం కింద దేశంలోని రైతులందరికీ కోట్లాది సాయిల్  హెల్త్  కార్డులు అందచేశారు. ఈ కార్డుల సహాయంతోనే  నేడు రైతులు తమ భూమి స్వస్థతకు సంబంధించిన  సమాచారం తెలుసుకుని అందుకు తగినంత ఎరువులే వాడుతున్నారు. 
రాజస్తాన్  భూభాగం నుంచే రైతుల కోసం మరో ప్రధాన పథకం ప్రారంభిస్తున్నామని తెలియచేయడానికి నేను ఆనందిస్తున్నాను. దేశవ్యాప్తంగా నేడు 1.25 లక్షలకు పైగా ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. ఈ కేంద్రాలన్నీ రైతుల సుసంపన్నతకు మార్గం సుగమం చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అవి రైతులకు వన్ స్టాప్  సెంటర్లుగా వ్యవహరిస్తాయి. 

తమకు కావలసిన వ్యవసాయ ఉపకరణాల కొనుగోలు కోసం వ్యవసాయ రంగానికి చెందిన సోదర సోదరీమణులు విభిన్న ప్రాంతాలకు వెళ్లవలసివచ్చేది. ఇక మీకు ఆ కష్టాలు ఉండనే ఉండవు. ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాలే మీకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తాయి. దీనికి తోడు ఆ కేంద్రాలు మీకు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, యంత్రాలు కూడా అందచేస్తాయి. ప్రభుత్వ పథకాల గురించి సరైన సమాచారం లేని కారణంగా వ్యవసాయ సోదర సోదరీమణులు తీవ్రంగా నష్టపోతున్నట్టు నేను గుర్తించాను. నేడు ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాలు మీకు కావలసిన విలువైన సమాచారం అంతా సకాలంలో అందచేస్తాయి. 

మిత్రులారా, 
ఇది కేవలం ప్రారంభమే. మీకు వ్యవసాయ అవసరాల కోసం ఏదీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకపోయినా మీ పట్టణంలోని ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాన్ని సందర్శించడం అలవాటుగా చేసుకోండి. అక్కడ ఏం జరుగుతోందో వీక్షించండి. మన తల్లులు, సోదరీమణులు కూరగాయల కోసం మార్కెట్  కు వెళ్లినప్పటికీ కొన్నా, కొనకపోయినా తరచు అక్కడ ఉన్న వస్ర్త దుకాణాన్ని సందర్శిస్తూ ఉండడం మీరు గమనించే ఉంటారు. అక్కడ కొత్తవి ఏవి వచ్చాయి, ఏ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి తెలుసుకునేందుకే వారు ఈ పని చేస్తారు. రైతు సోదరసోదరీమణులు కూడా ఇలాంటి  అలవాటు చేసుకోవాలి. పట్టణానికి వెళ్లినప్పుడల్లా ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాన్ని సందర్శించి అక్కడ కొత్తగా ఏవి అందుబాటులో ఉన్నాయి పరిశీలిస్తూ ఉండాలి. దీని ద్వారా మీరు పలు ప్రయోజనాలు అందుకోగలుగుతారు. మిత్రులారా, ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 1.75 లక్షల ప్రధానమంత్రి కిసాన్  సమృద్ధి కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. 

 

|

మిత్రులారా, 
రైతుల సొమ్మును ఆదా చేయడానికి మా ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో తెలియచేసే మరో ఉదాహరణ యూరియా ధరలు. కరోనా మహమ్మారి, ఆ తర్వాత ఏర్పడిన రష్యా-ఉక్రెయిన్  యుద్ధం మార్కెట్లను అతలాకుతలం చేశాయి. అది ఎరువులు సహా అన్నింటిలోనూ తీవ్ర అవాంతరాలకు కారణమయింది. కాని ఆ ప్రభావం రైతులపై పడకుండా మా ప్రభుత్వం చూసింది. 

ఎరువుల ధరల గురించిన సమాచారం నా సోదర రైతులతో పంచుకోవాలని నేను బావిస్తున్నాను. నేడు మన దేశంలో యూరియా బస్తా కేవలం ర .266కే అందిస్తున్నాం. అదే మన పొరుగుదేశం పాకిస్తాన్  లో రూ.800 పలుకుతోంది. బంగ్లాదేశ్  లో రూ.720, చైనాలో రూ.2100కి సరఫరా చేస్తున్నారు. అమెరికాలో ఎంత ధర పలుకుతోందో మీరెవరైనా ఊహించగలరా...మనకి రూ.300 కన్నా తక్కువ ధరకు అందిస్తున్న బస్తా అక్కడ రూ.3000 పలుకుతోంది. రూ.300కి, రూ.3000కి మధ్యన తేడా ఎంత ఉందో పరిశీలించండి. 

యూరియా ధరల వల్ల భారతరైతాంగం ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది మా లక్ష్యం. మన దేశానికి చెందిన రైతులు నిత్యం ఆ అనుభవం పొందుతున్నారు. వారు ఎప్పుడు యూరియా  కొనేందుకు వెళ్లినా ఈ మోదీ గ్యారంటీపై పూర్తి విశ్వాసం పొందుతున్నారు. మీకు భరోసా ఏమిటని ఏ రైతునైనా అడిగితే మీకు అదే తెలుస్తుంది.  

మిత్రులారా, 
రాజస్తాన్  లో మీరందరూ జొన్నల వంటి చిరుధాన్యాలు పండిస్తూ ఉంటారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల చిరుధాన్యాలు పండుతూ ఉంటాయి. ఇప్పుడు మా  ప్రభుత్వం చిరుధాన్యాలకు ‘‘శ్రీ అన్న’’ పేరిట ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. చిరుధాన్యాలన్నింటినీ ఇప్పుడు ‘‘శ్రీ అన్న’’గానే వ్యవహరిస్తున్నారు. మా ప్రభుత్వం ఈ చిరుధాన్యాలను ప్రపంచంలోని పెద్ద మార్కెట్లకు చేర్చుతోంది. ప్రభుత్వ ప్రయత్నాల వలెనే దేశంలో ‘‘శ్రీ అన్న’’ ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతి కూడా  పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్ష భవనం వైట్  హౌస్  సందర్శించే అవకాశం నాకు కలిగింది. అక్కడ అధ్యక్షుడు బైడెన్  ఏర్పాటు చేసిన విందులో చిరుధాన్యాల వంటకం కూడా ప్లేటులో ఉండడం నాకు ఆనందం కలిగించింది. 

 

|

మిత్రులారా, 
ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలన్నీ మన దేశానికి, చిరుధాన్యాలు - ‘‘శ్రీ అన్న’’  పంటలు పండించే రాజస్తాన్  రైతులకు అద్భుత ప్రయోజనాలు అందిస్తున్నాయి. అలాంటి పలు చొరవలు రైతుల జీవితాల్లో సానుకూల మార్పును తెస్తున్నాయి. 

రైతు సోదరులారా, 
గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అప్పుడే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అందుకే నేడు మా ప్రభుత్వం నగరాల్లో ఉన్న ప్రతీ ఒక్క సదుపాయం గ్రామాలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దేశ జనాభాలో అధిక శాతం ఆరోగ్య వసతుల నిరాకరణకు గురైన విషయం మీ అందరికీ తెలుసు. ఫలితంగా కోట్లాది మంది ప్రజలు విధిని నమ్ముకుని జీవించాల్సి వచ్చేది. ఢిల్లీ, జైపూర్  వంటి  పెద్ద నగరాలకే మంచి ఆస్పత్రులు పరిమితం అనే భావన కూడా ఉండేది. మేం ఆ పరిస్థితిని మారుస్తున్నాం. నేడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కొత్త ఎయిమ్స్  (అఖిల భారత వైద్య శాస్ర్తాల సంస్థ), కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి.  

ఈ ప్రయత్నాల ఫలితంగా నేడు దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 700 దాటింది. 8-9 సంవత్సరాల క్రితం రాజస్తాన్  లో 10 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. నేడు వాటి సంఖ్య 35కి పెరిగింది. ఇవి మన చుట్టుపక్కల ప్రాంతాలకు వైద్య వసతులు అందుబాటులోకి తేవడమే కాకుండా పెద్ద  సంఖ్యలో వైద్యులను తయారుచేస్తున్నాయి. ఈ వైద్యులందరూ చిన్న పట్టణాలు, గ్రామాల్లో వైద్య సేవలకు పునాదిగా మారుతున్నారు.

ఉదాహరణకి ఈ కొత్త వైద్య  కళాశాలలు బరన్, బుండి, టాంక్, సవాయ్ మధోపూర్, కరౌలి, జున్ ఝును, జైసల్మీర్, ధోల్పూర్, చిత్తోర్  గఢ్, సిరోహి, సికార్  వంటి ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. వైద్య చికిత్సల కోసం ప్రజలిక ఏ మాత్రం జైపూర్ లేదా ఢిల్లీ వెళ్లాల్సిన పని లేదు. పేద కుటుంబాల్లోని మీ కుమారులు, కుమార్తెలు కూడా ఈ వైద్య కళాశాలల్లో చదివే అవకాశం పొందడం వల్ల మీ ఇళ్ల సమీపానికే మంచి ఆస్పత్రులు వస్తున్నాయి. అంతే కాదు, వైద్య విద్యను మాతృ భాషలోనే బోధించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇంగ్లీష్  రాని కారణంగా పేద కుటుంబాల్లోని ఏ కుమారుడు లేదా కుమార్తె విద్యకు అనర్హత పొందడానికి అవకాశం లేనే లేదు. ఇది కూడా మోదీ అందిస్తున్న హామీయే. 

సోదర  సోదరీమణులారా, 
దశాబ్దాలుగా మన గ్రామాలు, నిరాదరణకు గురవుతున్న వర్గాలకు మంచి  పాఠశాలలు లేవు. వెనుకబడిన తరగతులు, గిరిజన తెగలకు చెందిన బాలబాలికలకు పెద్ద కలలున్నప్పటికీ వాటిని సాకారం చేసుకునే మార్గం కొరవడింది. మేం విద్యారంగానికి చెందిన బడ్జెట్  ను పెంచి వనరులు మెరుగుపరచడంతో పాటు ఏకలవ్య మోడల్  గిరిజన పాఠశాలలు ప్రారంభించింది. ఇవి గిరిజన బాలబాలికలకు ఎన్నో ప్రయోజనాలు అందుబాటులోకి తెచ్చింది.

 

|

మిత్రులారా, 
మన కలలు ఆకాంక్షాపూరితంగా ఉన్నట్టయితే విజయం చేకూరుతుంది.  ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచం అంతటినీ తన వైభవంతో ఆశ్చర్యపరిచిన రాష్ర్టం రాజస్తాన్. వారసత్వాన్ని కాపాడి రాజస్తాన్  ను అభివృద్ధిపథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిదీ. ఇటీవలే ఢిల్లీ-ముంబై ఎక్స్  ప్రెస్  వే, అమృతసర్-జామ్  నగర్  ఎక్స్  ప్రెస్ వేలపై రాజస్తాన్  లోని కీలకమైన  సెక్షన్లలో రెండు ఎక్స్  ప్రెస్ మార్గాలు ప్రారంభమయ్యాయి. ఇవి రెండూ రాజస్తాన్  అభివృద్ధిలో కొత్త శకం రచిస్తాయి. రాజస్తాన్  ప్రజలకు వందే భారత్  రైలు కూడా బహుమతిగా అందింది. 

నేడు కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి మౌలిక వసతులు, సదుపాయాలు నిర్మిస్తోంది. ఇది కూడా రాజస్తాన్  కు పలు ప్రయోజనాలు అందిస్తుంది. మీరు పర్యాటకులను ‘‘పధారో మహరే దేశ్’’ అని ఆహ్వనిస్తే ఎక్స్ ప్రెస్  వేలు, మంచి రైలు వసతులు వారికి ఆహ్వానం పలుకుతాయి. 

 

|

స్వదేశీ దర్శన్  యోజన కింద ఖతు శ్యామ్  జీ దేవాలయానికి కూడా సదుపాయాలను మా ప్రభుత్వం విస్తరించింది. శ్రీ ఖతు శ్యామ్  జీ ఆశీస్సులతో రాజస్తాన్  అభివృద్ధి వేగం అందుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను. మనందరం సంపూర్ణ మనస్సుతో రాజస్తాన్ ఆత్మగౌరవానికి, వారసత్వానికి కొత్త గుర్తింపు అందిద్దాం. 

మిత్రులారా, 
రాజస్తాన్  ముఖ్యమంత్రి శ్రీ అశోక్  గెహ్లాట్  జీ గత కొద్ది రోజులుగా కాలికి సంబంధించిన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కావలసి ఉన్నా ఆయన రాలేకపోయారు. ఆయనకు  సత్వరం స్వస్థత చేకూరాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ రాజస్తాన్  రైతులు, ప్రజలకు నేను అంకితం చేస్తున్నాను. మీ అందరికీ నా  హృద‌యపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. 

ధన్యవాదాలు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM’s address to the nation on Operation Sindoor: Path of peace, path of strength

Media Coverage

PM’s address to the nation on Operation Sindoor: Path of peace, path of strength
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

ప్రియమైన దేశ ప్రజలారా.. నమస్కారం

గత కొన్ని రోజులుగా మనమందరం దేశ సామర్థ్యం, సహనాన్ని రెండింటిని చూశాం

మొదటగా..భారత దేశ పరాక్రమ సేనకు, సరిహద్దు బలగాలకు, నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు, ప్రతి ఒక్క భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నాను.

మన వీర సైనికులు ఆపరేషన్ సిందూర్‌లో కచ్చితత్వంతో అసమాన శౌర్యాన్ని చూపిస్తూ లక్ష్యాలను ఛేదించారు

వారి వీరత్వం, పరాక్రమానికి, వారి సాహసానికి సెల్యూట్ చేస్తున్నాను

 

మన దేశ ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి కూతురుకు ఈ పరాక్రమాన్ని అంకితం చేస్తాం

 

మిత్రులారా...ఏప్రిల్ 22న పెహల్గామ్ లో ఉగ్రవాదులు క్రూరత్వాన్ని చూపించారు

ఈ ఘటన దేశాన్ని, ప్రపంచాన్ని వణికించింది.

సెలవులు గడపడానికి వెళ్లిన అమాయాక పౌరులను వారి మతం అడిగి...వారి కుటుంబం ముందే, వారి పిల్లల ముందే దయలేకుండా హతమార్చారు. ఇది ఉగ్రవాదానికి బీభత్సానికి, క్రూరత్వానికి ప్రతీక.

 

దేశంలోని సౌభ్రాత్రుత్వాన్ని విడగొట్టడానికి ఘోరమైన ప్రయత్నం. వ్యక్తిగతంగా నాకు ఇది ఎంతో బాధను కలిగించింది. ఈ ఉగ్రవాద దాడి తర్వాత దేశమంతా, ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వర్గం, ప్రతి రాజకీయ పార్టీ ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏకమయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టేంచేందుకు భారతీయ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం.

 

మన చెల్లెల్లు, కూతుళ్ల నుదిటి సింధూరాన్ని చేరిపేస్తే..దాని సమాధానం ఎలా ఉంటుందో ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థ తెలుసుకుంది.

మిత్రులారా..ఆపరేషన్ సిందూర్ ఇదొక పేరు కాదు.

ఇది దేశంలోని కోటానుకోట్ల ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది

ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసం ఒక అఖండ ప్రతిజ్ఞ.

మే 6 రాత్రి, మే7 తెల్లవారుజామున ఈ ప్రతిజ్ఞ ఫలితాలను ప్రపంచం మొత్తం చూసింది.

భారత సైన్యం పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై...వారి శిక్షణ కేంద్రాలపై కచ్చితమైన దాడి చేసింది. ఉగ్రవాదులు కలలో కూడా అనుకొని ఉండకపోవచ్చు...భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని..కానీ ఎప్పుడైతే దేశం ఏకమవుతుందో..నేషన్ ఫస్ట్ అనే భావన ఉంటుందో.. దేశ హితమే ముఖ్యమని అనుకుంటున్నామో అప్పుడే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ ఫలితాలను సాధించి చూపిస్తాం

 

పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మిసైల్ దాడులు చేసినప్పుడు, డ్రోన్ల దాడులు చేసినప్పుడు, ఉగ్రవాద సంస్థల భవనాలే కాకుండా వారి ధైర్యం కూడా ధ్వంసం అయ్యాయి. బవహల్ పూర్, మురిద్కేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు...ఒక రకంగా ప్రపంచ ఉగ్రవాదానికి విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి.

ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగినా, 9/11, లండన్ బాంబ్ బ్లాస్టింగ్ లేదా, భారత్ లో జరిగిన పెద్ద ఉగ్రవాద దాడులు, వాటి మూలాలు ఈ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలతో ముడిపడి ఉన్నాయి.

ఉగ్రవాదులు మన అక్కాచెల్లెల్ల సిందూరాన్ని తుడిచేశారు. అందుకే భారత్ ఉగ్రవాద ముఖ్య కేంద్రాలను సర్వనాశనం చేసింది. భారత్ దాడిలో వంద మందికిపైగా అతి భయంకరమైన ఉగ్రవాదులు హతం అయ్యారు.

గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి సూత్రధారులు బహిరంగంగా తిరుగుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. భారత్ ఒక్కదాడితో వారందరినీ అంతమొందించింది. మిత్రులారా.. భారత దేశ ఈ చర్యతో పాకిస్తాన్ ఎంతో నిరాశ, నిస్పృహకు, గాభరపాటుకు లోనయ్యింది. ఈ గాభరపాటులోనే పాకిస్తాన్ మరొక దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరులో భారత్ కు మద్దతుగా నిలవాల్సింది పోయి పాకిస్తాన్ భారత్ పై దాడిని ప్రారంభించింది. పాకిస్థాన్ మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, సామాన్య పౌరుల నివాసాలే లక్ష్యంగా దాడులు చేసింది. పాక్ మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ..దీంతో పాకిస్తాన్ నిజస్వరూపం బయటపడింది. అలాగే పాకిస్తాన్ కుట్రలు కూడా బయటపడ్డాయి..

ప్రపంచం మొత్తం పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ ఎలా ముక్కలుముక్కలు చేసిందో చూశాయి. భారత దేశ సమర్ధమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలోనే నాశనం చేశాయి. పాకిస్తాన్ సరిహద్దు వద్ద యుద్దానికి సిద్దమైంది..ఐతే భారత వాయుసేన పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీలక స్థావరాలపై దాడి చేసింది.

భారత డ్రోన్లు, మిస్సైళ్లు కచ్చితమైన లక్ష్యాలపై దాడి చేశాయి.

పాకిస్థాన్ వాయు సేన ఎయిర్ బేస్‌ను నష్టం కలిగించాం. ఈ ఎయిర్ బేస్ పై పాకిస్థాన్‌కు గర్వం ఉండేది. భారత్ మొదటి మూడు రోజుల్లోనే పాకిస్థాన్‌లో చేసిన నష్టం, వాళ్ల ఊహకు కూడా అందలేదు. అందుకే భారత ప్రతి దాడి తర్వాత పాకిస్థాన్ తనను తాను రక్షించుకునేందుకు అనేక మార్గాలను వెతకడం ప్రారంభించింది.

ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ వినతులు చేసింది. ఇంత ఘోరంగా దెబ్బతినడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మే 10 మధ్యాహ్నానికి పాక్ సైన్యం మన డీజీఎంవోను సంప్రదించారు. అప్పటికే..ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున నాశనం చేశాం. అనేక ఉగ్రవాదులను హతం చేశాం. పాకిస్థాన్‌లో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఉగ్ర స్థావరాలను శ్మశానంలా మార్చేశాం. అందుకే పాకిస్థాన్ నుంచి ఇలాంటి వినతులను వచ్చాయి. పాకిస్థాన్ తరఫు నుంచి ఇలా అన్నారు...తమ నుంచి భవిష్యత్‌లో ఉగ్రవాద చర్యలు, సైనిక దుస్సాహసం జరగదని హామీ ఇచ్చారు. దానిపై ఆలోచిస్తుందని...దీన్ని మరోసారి నేను చెప్తున్నాను. మనం పాకిస్తాన్ ఉగ్రవాద సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేశాం, ప్రతిదాడిని ప్రస్తుతానికి ఆపేశాం. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ తీసుకునే ప్రతి అడుగును ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వారి వైఖరి ఎలా ఉంటుందో చూస్తాం. మిత్రులారా భారత్, త్రివిధ దళాలు మన ఎయిర్ ఫోర్స్, మన సైన్యం, మన నౌకా దళం, బీఎస్ఎఫ్, భారత అర్థ సైనిక బలాలు ప్రతిక్షణం అలర్ట్‌గా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సిందూర్ వంటివి ఉగ్రవాదుల వ్యతిరేకంగా భారత విధానంగా చూడాలి. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. దాడుల స్థాయిని పెంచి న్యూ నార్మల్‌ని నిర్దేశించాం. అందులో మొదటగా భారత్ మీద ఉగ్రదాడులు జరిగితే దానికి ధీటైన జవాబు ఇస్తాం.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రపంచం పాకిస్తాన్ అసహ్యకరమైన సత్యాన్ని మరోసారి చూసింది. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల సమయంలో పాక్ సైన్యంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి. భారత్, తన పౌరుల రక్షణ కోసం నిరంతరంగా నిర్ణయాక చర్యలు తీసుకుంటుంది.

మిత్రులారా...యుద్ధ క్షేత్రంలో మనం ప్రతిసారి పాకిస్థాన్ ను ఓడించాం. ఈ సారి కూడా ఆపరేషన్ సిందూర్ కొత్త శిఖరాలకు చేర్చింది.

మన సైన్యం ఎడారి, కొండల్లో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. అలాగే..కొత్త తరం యుద్ధ తంత్రంలో కూడా మనం శ్రేష్ఠత సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. ఈ ఆపరేషన్ లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల సామర్ధ్యం కూడా నిరూపితమైంది. ఈ రోజు ప్రపంచమంతా చూస్తోంది. 21వ శతాబ్ద యుద్ధంలో భారత్ లో తయారైన రక్షణ ఉత్పత్తుల వినియోగానికి సమయం వచ్చింది.

మిత్రులారా..ఏరకమైన ఉగ్రవాదానికైనా వ్యతిరేకంగా మనం అందరం ఏకంగా ఉండటం అదే మన బలం.

కచ్చితంగా ఇప్పుడు ఇది యుద్ధ యుగం కాదు. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం....ఒక సురక్షిత ప్రపంచానికి గ్యారంటీ..

మిత్రులారా పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాగైతే ఉగ్రవాదానికి మద్దతుగా ఉందో..అదే ఉగ్రవాదం భవిష్యత్తులో పాకిస్తాన్‌నే అంతం చేస్తుంది. పాకిస్థాన్ తనను తాను కాపాడుకోవాలంటే..తన భూభాగంలో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ను అంతం చేయాల్సిందే..

దీనికి మించి శాంతికి మరేదారి లేదు. భారత దేశ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. టెర్రర్ అండ్ టాక్...ఉగ్రవాదం ఒకే పడవ మీద ప్రయాణం చేయలేవు. ఉగ్రవాదం వ్యాపారం ఒకే దగ్గర ఇమిడి ఉండవు. నీరు రక్తం కూడా ఒకే దగ్గర ఉండవు. నేను ఈ రోజు ప్రపంచానికి చెప్తున్నానను..ఇది మా ప్రకటిత విధానం. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అది కేవలం ఉగ్రవాదంపైనే...పాకిస్థాన్ తో చర్చలు జరిపితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే జరుగుతుంది. ప్రియమన దేశ ప్రజలారా ..ఈ రోజు బుద్ద పూర్ణిమ...భగవాన్ బుద్దుడు మనకు శాంతి మార్గాన్ని చూపించారు. శాంతి మార్గమే శక్తిగా ఉంటుంది. మానవాళి శాంతి, సమృద్ధి వైపు ముందుకు వెళుతోంది ప్రతి భారతీయుడు శాంతితో జీవించాలి. వికసిత్ భారత్ కలను పూర్తి చేయాలి. దీని కోసం భారత్, శాంతియుంతంగా ఉండాలి అవసరమైతే శక్తిని కూడా వాడాలి. గత కొన్ని రోజులుగా భారత్ ఇదే చేస్తోంది. నేను మరోసారి భారత సైన్యానికి, భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. భారతీయులందరి ధైర్యం, ఐక్యతకు నేను నమస్కరిస్తున్నాను.

ధన్యవాదాలు....

భారత్ మాతా కీ జై

​​​​​​​భారత్ మాతా కీ జై

​​​​​​​భారత్ మాతా కీ జై​​​​​​​....