Quote* ఈరోజు పీఏం-కిసాన్ పథకం 19వ విడత నిధులను విడుదల చేసే అవకాశం కలిగింది... మన సన్నకారు రైతులకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉండటం సంతృప్తిని కలిగిస్తోం ది : ప్రధానమంత్రి
Quote* మఖానా వికాస్ బోర్డు ఏర్పాటు వల్ల ఆ పంట సాగు చేసే బీహార్ రైతులకు గొప్ప లబ్ధి చేకూరుతుంది.. మఖానా పంట సాగు, శుద్ధి, విలువ పెంపు, మార్కెటింగుల్లో బోర్డు సహాయకారిగా ఉంటుందన్న ప్రధానమంత్రి
Quote* ఎన్డీఏ ప్రభత్వం లేనిదే బీహార్ సహా దేశంలోని రైతులెవరికీ పీఏం కిసాన్ సమ్మాన్ నిధి ఫలాలు దక్కేవి కావు .. గత 6 ఏళ్ళలో పథకానికి చెందిన ప్రతి పైసా నేరుగా అన్నదాతల ఖాతాల్లోకి చేరిందన్న ప్రధానమంత్రి
Quote* సూపర్ ఫుడ్ మఖానా కానివ్వండి, భాగల్పూర్ పట్టు కానివ్వండి, బీహార్ కే ప్రత్యేకమైన ఉత్పత్తులను ప్రపంచ విపణులకు చేర్చడమే లక్ష్యమన్న ప్రధానమంత్రి
Quote* పీఏం ధన-ధాన్య యోజన, వ్యవసాయంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో పంట దిగుబడిని పెంచడమే కాక రైతులను సాధికారులను చేస్తుందన్న ప్రధానమంత్రి
Quote* ఈరోజు ఎఫ్పీఓ 10,000వ కేంద్రం ప్రారంభానికి బీహార్ సాక్షిగా నిలిచింది... దేశవ్యాప్తంగా గల రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులకు అభినందనలు... అన్న ప్రధానమంత్రి

భారత్ మాతాకీ జై!

ప్రపంచ ప్రఖ్యాత విక్రమశిల మహావిహారం ఉన్న, వసుపూజయ మహర్షి తపస్సు చేసిన, బాబా బుధనాథుని పవిత్ర భూమి, అంగ రాజు దాన వీర శూర కర్ణుడికి చెందిన ఈ ప్రాంత సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు!

గౌరవనీయ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు, బిహార్ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తూ ప్రశంసలందుకుంటోన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌గారు వేదికపై ఉన్నారు. నా మంత్రివర్గ సహచరులు గౌరవ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, జితన్ రామ్ మాంఝీ గారు, లల్లన్ సింగ్ గారు, గిరిరాజ్ సింగ్ గారు, చిరాగ్ పాశ్వాన్ గారు, బిహార్ ఉప ముఖ్యమంత్రి రామ్ నాథ్ ఠాకూర్ గారు, సామ్రాట్ చౌదరి గారు, విజయ్ సిన్హా గారు, ఇతర సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, బిహార్‌కు చెందిన నా ప్రియమైన సోదరసోదరీమణులు కూడా ఇక్కడ ఉన్నారు.

దేశవ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కోట్లాది మంది రైతులు ఇవాళ జరుగుతోన్న కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు. వారందరికీ నా గౌరవ నమస్కారాలు.
 

|

మిత్రులారా,


పవిత్రమైన మహా కుంభమేళా సమయంలో ఈ పవిత్రమైన మందాంచల్‌ను సందర్శించడం అపారమైన గౌరవంతో కూడుకున్న అంశం. ఈ ప్రాంతం విశ్వాసం, వారసత్వం, వికసిత్ భారత్(అభివృద్ధి చెందిన భారతదేశం) వాగ్దానానికి సంబంధించిన సంగమం. వీరమరణం పొందిన తిల్కా మాంఝీకి  చెందిన ఈ ప్రాంతాన్ని సిల్క్ సిటీ అని కూడా పిలుస్తారు. బాబా అజ్గైబినాథ్‌‌కు చెందిన ఈ పవిత్ర భూమిలో ప్రస్తుతం మహాశివరాత్రికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇలాంటి శుభ సమయంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో మరో విడతను దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు పంపించే గౌరవం నాకు దక్కింది. ఒక్క క్లిక్‌తో దేశవ్యాప్తంగా దాదాపు రూ.22 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. బటన్ నొక్కగానే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యక్ష ప్రసార దృశ్యాలు కనిపించాయి. ఇక్కడ కూడా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఆసక్తిగా చూసుకుంటూ డబ్బు రావటాన్ని ధ్రువీకరించడం నేను చూశాను. వారి కళ్లలో అప్పుడు కనిపించిన మెరుపు వారి ఆనందాన్ని, ఉపశమనాన్ని తెలియజేసింది.

మిత్రులారా,


నేటి కిసాన్ సమ్మాన్ నిధి  విడతలో బిహార్‌లోని 75 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి. దాదాపు రూ.1,600 కోట్లు బిహార్ రైతుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. యావత్ దేశ, బిహార్‌కు చెందిన రైతు కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,


పేదలు, రైతులు, మన యువత, మన దేశంలోని మహిళలు అనే నాలుగు బలమైన స్తంభాలపై వికసిత్ భారత్ నిలబడి ఉంటుందని నేను ఎర్రకోటపై నుంచి చెప్పాను. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అయినా, బిహార్‌లోని నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వం అయినా రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గత దశాబ్ద కాలంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సవాలును పరిష్కరించడానికి అవిశ్రాంతంగా పనిచేశాం. వారికి నాణ్యమైన విత్తనాలు, అందుబాటు ధరలో తగినంత ఎరువులు, సరైన నీటి పారుదల సౌకర్యాలు.. తమ పశువులకు వ్యాధుల నుంచి  రక్షణ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ అవసరం. గతంలో ఇక్కడ రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. పశువులకు ఉద్దేశించిన పశుగ్రాసాన్ని తినే వారు ఎప్పటికీ మార్పు తీసుకురాలేరు. అయితే ఎన్డీయే ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేసింది. రైతుల కోసం ఇటీవలి కాలంలో వందలాది ఆధునిక విత్తన వంగడాలను ప్రవేశపెట్టాం. ఒకప్పుడు యూరియా కొరత విషయంలో రైతులు లాఠీచార్జీని ఎదుర్కోవాల్సి వచ్చేది. యూరియా బ్లాక్ మార్కెటింగ్ జరిగేది. నేడు, పరిస్థితి మారింది. రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కొవిడ్-19 సంక్షోభ సమయంలోనూ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూశాం. ఎన్డీయే ప్రభుత్వం లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి.
 

|

మిత్రులారా,


ఎన్డీయే ప్రభుత్వం లేకపోతే ఎరువుల కోసం మన రైతులు ఇంకా పోలీసుల లాఠీచార్జీలు ఎదుర్కోవాల్సి వచ్చేది. బరౌనీ ఎరువుల కర్మాగారం ఇప్పటికీ పనిచేయకపోయేది. చాలా దేశాల్లో ఒక ఎరువు బస్తా ధర రూ. 3,000 ఉండగా.. మన రైతులకు రూ.300‌లోపే అందిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వం లేకుంటే రైతులు యూరియా బస్తాకు రూ.3‌వేలు చెల్లించాల్సి వచ్చేది. తమ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యమిచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తోంది. అందుకే యూరియా, డీఏపీల ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. గత దశాబ్ద కాలంలో సుమారు రూ.12 లక్షల కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాం. ఈ కేటాయింపులు లేకుంటే ఎరువుల కోసం రైతులు ఇంత మొత్తం తమ జేబుల నుంచి ఖర్చు చేసే వాళ్లు. అంటే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల చేతుల్లో రూ.12 లక్షల కోట్లు ప్రత్యక్షంగా ఆదా అయ్యాయి.

మిత్రులారా,

ఎన్డీయే ప్రభుత్వం లేకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఉండేది కాదు. ఈ పథకం దాదాపు ఆరేళ్లుగా అమలులో ఉంది. ఇప్పటివరకు సుమారు రూ.3.7 లక్షల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాం.  దళారులు లేరు, కమీషన్ కోతలు లేవు. దిల్లీ నుంచి పంపే ప్రతి రూపాయి రైతులకు పూర్తిగా చేరుతోంది. మధ్యవర్తులు తమ వాటాను పక్కదారి పట్టించడం వల్ల గతంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు దూరమైన చిన్న రైతులు ఇప్పుడు నేరుగా లబ్ధి పొందుతున్నారు. ఇది మోదీ ప్రభుత్వం, ఇది నితీష్ ప్రభుత్వం. మేం రైతుల హక్కులను హరించడానికి  ఎవరినీ అనుమతించం. మేం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన మొత్తంలో పోల్చితే చాలా తక్కువ మాత్రమే కాంగ్రెస్, జంగిల్ రాజ్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కేటాయించాయి. అవినీతి ప్రభుత్వం ఎప్పటికీ దీన్ని సాధించలేదు. రైతు సంక్షేమానికి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాత్రమే ఇలాంటి వాటిని సాధించగలదు.

మిత్రులారా,

అది కాంగ్రెస్ అయినా, జంగిల్ రాజ్ పాలన అయినా రైతుల కష్టాలు ఏనాడూ వారికి పట్టలేదు. గతంలో వరదలు, కరువులు, వడగండ్ల వానలు వచ్చినప్పుడల్లా రైతులను వదిలేశారు. కానీ మీరు 2014లో ఎన్డీయేపై విశ్వాసం ఉంచినప్పుడు.. ఈ నిర్లక్ష్యం కొనసాగదని నేను స్పష్టం చేశాను. ఎన్డీయే ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టింది. దీని కింద ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు పరిహారంగా రైతులకు దాదాపు రూ .2 లక్షల కోట్లు చెల్లించింది.


మిత్రులారా,

భూమిలేని, చిన్న తరహా రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఎన్డీయే ప్రభుత్వం పశుపోషణను చురుకుగా ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లోని మన సోదరీమణులను 'లాఖ్ పతి దీదీ'లుగా మార్చడంలో కూడా ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 1.25 కోట్ల మంది మహిళలు ఈ మైలురాయిని సాధించారు. వీరిలో బిహార్‌కు చెందిన వేలాది మంది జీవికా దీదీలు కూడా ఉన్నారు. గత దశాబ్ద కాలంలో, భారతదేశ పాల ఉత్పత్తి  14 కోట్ల టన్నుల నుంచి  24 కోట్ల టన్నులకు పెరిగి గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. కేవలం పదేళ్లలో పాల ఉత్పత్తి చాలా పెరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసింది. ఈ విజయంలో బిహార్ గణనీయమైన పాత్ర పోషించింది. ప్రస్తుతం బీహార్ సహకార పాల సంఘాలు రోజుకు 30 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. ఫలితంగా ఏటా రూ.3,000 కోట్లకు పైగా నేరుగా బిహార్‌లోని పశు పోషణ చేపడుతోన్న రైతుల ఖాతాల్లోకి.. ముఖ్యంగా మన తల్లులు, సోదరీమణుల ఖాతాల్లోకి జమ అవుతోంది.
 

|

మిత్రులారా,

రాజీవ్ రంజన్ గారు (లల్లన్ సింగ్) పాడి పరిశ్రమ బలోపేతానికి తీసుకుంటోన్న కార్యక్రమాలను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఆయన అంకితభావానికి కృతజ్ఞతలు. బిహార్‌లోని రెండు ప్రధాన ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. మొదటిది మోతీహరిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది ఉత్తమ స్వదేశీ ఆవు జాతుల అభివృద్ధికి తోడ్పడుతుంది. రెండోది బరౌనీలో పాల ప్రాసెసింగ్ కేంద్రం. ఇది ఈ ప్రాంతంలోని మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

మిత్రులారా,

చాలాకాలంగా పడవల ద్వారా ఉపాధి పొందే మన కార్మికులు, మత్స్యకారులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. వారికి ఎటువంటి సహాయం లేదా ప్రయోజనాలు లభించలేదు. తొలిసారిగా కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని చేపలు పెంచే రైతులకు అందించాం. ఇటువంటి కార్యక్రమాల ఫలితంగా బిహార్ చేపల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించింది. ముఖ్యమంత్రి సరిగ్గా చెప్పారు. ఆయన అన్నట్లు బిహార్ ఒకప్పుడు చేపల దిగుమతిపై ఆధారపడింది.. కానీ నేడు స్వయం సమృద్ధి సాధించింది. 2013లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను పర్యటించినప్పుడు.. ఇంత సమృద్ధిగా నీటి వనరులున్న రాష్ట్రం చేపల దిగుమతులపై ఎలా ఆధారపడుతోంది? అని నేను ఆశ్చర్యపోయాను. ఇవాళ బిహార్ చేపల డిమాండ్‌ను రాష్ట్రమే తీర్చుతున్నందుకు నేను గర్విస్తున్నాను. దశాబ్దం క్రితం భారత్‌లో చేపలు ఉత్పత్తి చేసే మొదటి పది రాష్ట్రాల్లో బీహార్ ఒకటిగా ఉండేది. నేడు మొదటి 5 అగ్రస్థానాల్లో చోటు దక్కించుకుంది. మత్స్య రంగంపై దృష్టి సారించిన మా విధానం చిన్న రైతులు, మత్స్యకారులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చింది. గంగానది డాల్ఫిన్లకు ప్రసిద్ధి చెందిన భాగల్పూర్ కూడా నమామి గంగా కార్యక్రమం కింద గొప్ప విజయాన్ని సాధించింది.

మిత్రులారా,

ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారతదేశ వ్యవసాయ ఎగుమతులలో గణనీయమైన వృద్ధికి దారితీశాలు. దీంతో రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించింది. అనేక వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు మొదటిసారి ఎగుమతి అవుతున్నాయి. వాటిలో బిహార్‌లోని మఖానా ఒకటి. మఖానా దేశవ్యాప్తంగా పట్టణ గృహాలలో అల్పాహారంలో ఒక ప్రధాన భాగంగా మారింది. వ్యక్తిగతంగా, నేను సంవత్సరానికి కనీసం 300 రోజులు మఖానా తింటాను. ఇది ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయాల్సిన సూపర్ ఫుడ్. మఖానా రైతులను ఆదుకునేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో మఖానా బోర్డు ఏర్పాటును ప్రకటించాం. ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ వంటి ప్రతి అంశంలో బిహార్ రైతులకు ఈ బోర్డు సహాయపడుతుంది. ఇది ప్రపంచ స్థాయిలో  మఖానాకు ఉన్న పూర్తి సామర్థ్యాన్ని నిరూపించేలా చేస్తుంది.
 

|

మిత్రులారా,

బిహార్ రైతులు, యువతకు ఈ బడ్జెట్ మరో కీలక ప్రకటనను తీసుకొచ్చింది. తూర్పు భారతదేశంలో ఆహార శుద్ధి పరిశ్రమకు బిహార్ కీలక కేంద్రంగా మారనుంది. రాష్ట్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌ను ఏర్పాటు చేయనున్నాం. అదనంగా వ్యవసాయానికి సంబంధించి మూడు కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను బిహార్‌లో రానున్నాయి. వీటిలో ఒకటి భాగల్పూర్‌లో ఉండనుంది. ఇది ప్రసిద్ధ మామిడి రకం- జర్దాలుపై దృష్టి పెడుతుంది. టమోటా, ఉల్లి, బంగాళదుంప రైతులను ఆదుకునేందుకు ముంగేర్, బక్సర్‌లలో మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో మా అచంచల నిబద్ధతకు ఇది నిదర్శనం.

మిత్రులారా,

వస్త్రాల ప్రధాన ఎగుమతిదారుగా భారత్ శరవేగంగా ఎదుగుతోంది. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. భాగల్పూర్‌లో ఒక సామెత ఉంది. ఇక్కడి చెట్లు కూడా బంగారాన్ని ఉమ్ముతాయని అని ఇక్కడ అంటారు. పట్టు ఉత్పత్తిలో ఈ ప్రాంతం గొప్పతనానికి ఇది నిదర్శనం. భాగల్పురి పట్టు, తుస్సార్ పట్టు భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచ మార్కెట్లలో వీటికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు వస్త్రాలు, యార్న్‌డైయింగ్ యూనిట్లు, వస్త్రాలపై ప్రింటింగ్ యూనిట్లు, వస్త్రాల ప్రాసెసింగ్ కేంద్రాలను అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విషయంలో చేపట్టిన కార్యక్రమాలు భాగల్పూర్ నేత కార్మికులకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించటమే కాకుండా వారి ఉత్పత్తులు ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి చేరేలా చేస్తాయి.

మిత్రులారా,

బిహార్‌లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల్లో ఒకటైన చాలా నదులపై వంతెనల కొరతను ఎన్డీయే ప్రభుత్వం పరిష్కరిస్తోంది. సరిపడిన వంతెనలు లేకపోవడం రవాణా, అనుసంధానత విషయంలో చాలా కాలంగా ఇబ్బందులను సృష్టించింది. దీనిని పరిష్కరించడానికి మేం బీహార్ అంతటా పలు వంతెనలను వేగంగా నిర్మిస్తున్నాం. అలాంటి ప్రధాన ప్రాజెక్టుల్లో గంగానదిపై నిర్మిస్తోన్న నాలుగు వరుసల వంతెన. రూ.1,100 కోట్ల వ్యయంతో చేపడుతోన్న ఈ వంతెన నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

మిత్రులారా,

బిహార్‌లో ఎల్లప్పుడూ తీవ్రమైన సమస్యగా ఉన్న వరదలు ప్రతి సంవత్సరానికి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు మా ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. పశ్చిమ కోసి కెనాల్ ఈఆర్ఎం ప్రాజెక్టుకు ఈ ఏడాది బడ్జెట్‌ ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మిథిలా ప్రాంతంలోని 50,000 హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకురావడంతో పాటు లక్షలాది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చి.. వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
 

|

మిత్రులారా,

రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఎన్డీయే ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోంది. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి, పప్పుధాన్యాలు, నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధించడానికి.. ఆహార శుద్ధి పరిశ్రమలను విస్తరించడానికి..  భారతీయ రైతుల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరేలా చూసేందుకు వరుసగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రపంచంలోని ప్రతి వంటగదిలో భారత రైతులు పండించే కనీసం ఒక ఉత్పత్తి ఉండాలన్నది నా లక్ష్యం. ప్రతిష్టాత్మక పీఎం ధన్య యోజన ప్రకటనతో ఈ ఏడాది బడ్జెట్ ఈ విజన్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అతి తక్కువ పంట ఉత్పత్తి ఉన్న 100 జిల్లాలను గుర్తించి ఈ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదనంగా, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు, కనీస మద్దతు ధరతో సేకరించే పప్పుధాన్యాలను పెంచుతూ రైతులు మరింత వృద్ధి సాదించేలా ప్రోత్సహించేందుకు లక్షిత చర్యలు తీసుకుంటున్నాం.

మిత్రులారా,

ఈ రోజు ఇంకో కారణం వల్ల  కూడా ముఖ్యమైన రోజు. దేశవ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓ) ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మేం ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించామని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. మొక్కజొన్న, అరటి, వరి సాగుపై దృష్టి సారించే ఖగారియా జిల్లాలో నమోదైన 10,000వ ఎఫ్పీఓకు ఉన్న ఘనత బిహార్‌కు దక్కింది. ఎఫ్‌పీఓ అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. ఇది పెద్ద మార్కెట్లను ప్రత్యక్షంగా అందుబాటులో తీసుకురావటం ద్వారా రైతుల ఆదాయాలను పెంచే ఒక పరివర్తన శక్తి. ఎఫ్పీఓల ద్వారా మన రైతు సోదర సోదరీమణులకు గతంలో అందుబాటులో లేని అవకాశాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 30 లక్షల మంది రైతులు ఎఫ్పీఓలతో అనుసంధానమై ఉండగా.. వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ సంస్థలు ఇప్పుడు వేల కోట్ల రూపాయల వ్యవసాయ వ్యాపారాన్ని చేపడుతున్నాయి. 10,000 ఎఫ్పీఓల సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

బిహార్ పారిశ్రామికాభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిహార్ ప్రభుత్వం భాగల్పూర్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ విద్యుతుత్పత్తి కేంద్రానికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతుంది. ఇందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు లింకేజీకి ఆమోదం తెలిపింది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ బిహార్ వృద్ధికి దోహదపడుతూ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.



మిత్రులారా,

పూర్వోదయ ద్వారా అభివృద్ధి చెందిన భారత్‌ ఆవిర్భవిస్తుంది. తూర్పు భారతానికి బిహార్ ‌అత్యంత ముఖ్యమైన స్తంభంగా నిలుస్తుంది. బిహార్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు. ఇది దేశానికి సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. అయితే కాంగ్రెస్-ఆర్జేడీల సుదీర్ఘ దుష్పరిపాలన బిహార్‌ను శిథిలావస్థకు చేర్చి, దాని ప్రతిష్ఠను దెబ్బతీసింది. కానీ ప్రాచీన సుసంపన్న భారత్‌లో పాటలీపుత్రానికి ప్రాముఖ్యత ఉన్నట్లే ఇప్పుడు అభివృద్ధి చెందిన భారతదేశంలో బిహార్ తన సముచిత స్థానాన్ని తిరిగి పొందుతుంది. ఈ లక్ష్యసాధనకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం.

బిహార్‌లో అనుసంధానతను ఆధునీకరించడానికి, రహదారి మార్గాలను విస్తరించడానికి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ముంగేర్ నుంచి భాగల్పూర్ మీదుగా మీర్జా చౌకీ వరకు రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో కొత్త రహదారి నిర్మాణం జరుగుతోంది. భాగల్పూర్ నుంచి అన్ష్‌దిహా వరకు నాలుగు వరుసల రహదారిని వెడల్పు చేసే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. విక్రమశిల నుంచి కటారియా వరకు కొత్త రైల్వే లైన్, రైలు వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 

|

మిత్రులారా,

భాగల్పూర్‌కు అపారమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. విక్రమశిల విశ్వవిద్యాలయం ఉన్న కాలంలో ఇది ప్రపంచ విద్యాకేంద్రంగా ఉండేది. నలంద విశ్వవిద్యాలయం ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించడానికి, ఆధునిక భారత్‌కు అనుసంధానించేందుకు మేం ఇప్పటికే ఒక మిషన్‌ను ప్రారంభించాం. ఇప్పుడు నలంద అడుగుజాడల్లో నడుస్తూ విక్రమశిలలో కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది. నితీష్ గారు, విజయ్ గారు, సామ్రాట్ గారు, పూర్తి బిహార్ ప్రభుత్వ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.



మిత్రులారా,

ఉజ్వల భవిష్యత్తును నిర్మిస్తూనే భారతదేశ ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే జంగిల్ రాజ్‌కు చెందిన వర్గం ‌మన వారసత్వం, విశ్వాసం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో అందరికి ఐక్యం చేసే మహా కుంభమేళా జరుగుతోంది. ఇది భారత్‌ విశ్వాసం, ఐక్యత, సామరస్యానికి సంబంధించిన అతిపెద్ద వేడుక. ఐరోపాలోని మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ఇప్పటికే పవిత్ర స్నానాలు చేయటం ద్వారా ఈ మహత్తర కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. బిహార్‌లోని ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు ఈ పవిత్ర ఘట్టానికి తరలివస్తున్నారు.


అయినా జంగిల్ రాజ్ నాయకులు సిగ్గులేకుండా మహా కుంభమేళాను అగౌరవపరుస్తూ ఈ పవిత్ర వేడుకను అవమానిస్తున్నారు. రామ మందిర నిర్మాణంతో ఆగ్రహించిన వారే ఇప్పుడు మహా కుంభమేళాను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పవిత్ర సంప్రదాయాన్ని అవమానించే వారిని బిహార్ ఎప్పటికీ క్షమించదని నేను కచ్చితంగా చెప్పగలను.


మిత్రులారా,

బిహార్‌ను నూతన సౌభాగ్యం దిశగా నడిపించాలన్న మా నిబద్ధతకు మేం కట్టుబడి ఉన్నాం. దేశంలోని రైతులకు, బిహార్ ప్రజలకు మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను.


నాతో చెప్పండి-

భారత్ మాతా కీ జై !

భారత్ మాతా కీ జై !

ధన్యవాదాలు!

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Media Coverage

"Huge opportunity": Japan delegation meets PM Modi, expressing their eagerness to invest in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM Modi in TV9 Summit
March 28, 2025
QuoteToday, the world's eyes are on India: PM
QuoteIndia's youth is rapidly becoming skilled and driving innovation forward: PM
Quote"India First" has become the mantra of India's foreign policy: PM
QuoteToday, India is not just participating in the world order but also contributing to shaping and securing the future: PM
QuoteIndia has given Priority to humanity over monopoly: PM
QuoteToday, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM

श्रीमान रामेश्वर गारु जी, रामू जी, बरुन दास जी, TV9 की पूरी टीम, मैं आपके नेटवर्क के सभी दर्शकों का, यहां उपस्थित सभी महानुभावों का अभिनंदन करता हूं, इस समिट के लिए बधाई देता हूं।

TV9 नेटवर्क का विशाल रीजनल ऑडियंस है। और अब तो TV9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है। इस समिट में अनेक देशों से इंडियन डायस्पोरा के लोग विशेष तौर पर लाइव जुड़े हुए हैं। कई देशों के लोगों को मैं यहां से देख भी रहा हूं, वे लोग वहां से वेव कर रहे हैं, हो सकता है, मैं सभी को शुभकामनाएं देता हूं। मैं यहां नीचे स्क्रीन पर हिंदुस्तान के अनेक शहरों में बैठे हुए सब दर्शकों को भी उतने ही उत्साह, उमंग से देख रहा हूं, मेरी तरफ से उनका भी स्वागत है।

साथियों,

आज विश्व की दृष्टि भारत पर है, हमारे देश पर है। दुनिया में आप किसी भी देश में जाएं, वहां के लोग भारत को लेकर एक नई जिज्ञासा से भरे हुए हैं। आखिर ऐसा क्या हुआ कि जो देश 70 साल में ग्यारहवें नंबर की इकोनॉमी बना, वो महज 7-8 साल में पांचवे नंबर की इकोनॉमी बन गया? अभी IMF के नए आंकड़े सामने आए हैं। वो आंकड़े कहते हैं कि भारत, दुनिया की एकमात्र मेजर इकोनॉमी है, जिसने 10 वर्षों में अपने GDP को डबल किया है। बीते दशक में भारत ने दो लाख करोड़ डॉलर, अपनी इकोनॉमी में जोड़े हैं। GDP का डबल होना सिर्फ आंकड़ों का बदलना मात्र नहीं है। इसका impact देखिए, 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं, और ये 25 करोड़ लोग एक नियो मिडिल क्लास का हिस्सा बने हैं। ये नियो मिडिल क्लास, एक प्रकार से नई ज़िंदगी शुरु कर रहा है। ये नए सपनों के साथ आगे बढ़ रहा है, हमारी इकोनॉमी में कंट्रीब्यूट कर रहा है, और उसको वाइब्रेंट बना रहा है। आज दुनिया की सबसे बड़ी युवा आबादी हमारे भारत में है। ये युवा, तेज़ी से स्किल्ड हो रहा है, इनोवेशन को गति दे रहा है। और इन सबके बीच, भारत की फॉरेन पॉलिसी का मंत्र बन गया है- India First, एक जमाने में भारत की पॉलिसी थी, सबसे समान रूप से दूरी बनाकर चलो, Equi-Distance की पॉलिसी, आज के भारत की पॉलिसी है, सबके समान रूप से करीब होकर चलो, Equi-Closeness की पॉलिसी। दुनिया के देश भारत की ओपिनियन को, भारत के इनोवेशन को, भारत के एफर्ट्स को, जैसा महत्व आज दे रहे हैं, वैसा पहले कभी नहीं हुआ। आज दुनिया की नजर भारत पर है, आज दुनिया जानना चाहती है, What India Thinks Today.

|

साथियों,

भारत आज, वर्ल्ड ऑर्डर में सिर्फ पार्टिसिपेट ही नहीं कर रहा, बल्कि फ्यूचर को शेप और सेक्योर करने में योगदान दे रहा है। दुनिया ने ये कोरोना काल में अच्छे से अनुभव किया है। दुनिया को लगता था कि हर भारतीय तक वैक्सीन पहुंचने में ही, कई-कई साल लग जाएंगे। लेकिन भारत ने हर आशंका को गलत साबित किया। हमने अपनी वैक्सीन बनाई, हमने अपने नागरिकों का तेज़ी से वैक्सीनेशन कराया, और दुनिया के 150 से अधिक देशों तक दवाएं और वैक्सीन्स भी पहुंचाईं। आज दुनिया, और जब दुनिया संकट में थी, तब भारत की ये भावना दुनिया के कोने-कोने तक पहुंची कि हमारे संस्कार क्या हैं, हमारा तौर-तरीका क्या है।

साथियों,

अतीत में दुनिया ने देखा है कि दूसरे विश्व युद्ध के बाद जब भी कोई वैश्विक संगठन बना, उसमें कुछ देशों की ही मोनोपोली रही। भारत ने मोनोपोली नहीं बल्कि मानवता को सर्वोपरि रखा। भारत ने, 21वीं सदी के ग्लोबल इंस्टीट्यूशन्स के गठन का रास्ता बनाया, और हमने ये ध्यान रखा कि सबकी भागीदारी हो, सबका योगदान हो। जैसे प्राकृतिक आपदाओं की चुनौती है। देश कोई भी हो, इन आपदाओं से इंफ्रास्ट्रक्चर को भारी नुकसान होता है। आज ही म्यांमार में जो भूकंप आया है, आप टीवी पर देखें तो बहुत बड़ी-बड़ी इमारतें ध्वस्त हो रही हैं, ब्रिज टूट रहे हैं। और इसलिए भारत ने Coalition for Disaster Resilient Infrastructure - CDRI नाम से एक वैश्विक नया संगठन बनाने की पहल की। ये सिर्फ एक संगठन नहीं, बल्कि दुनिया को प्राकृतिक आपदाओं के लिए तैयार करने का संकल्प है। भारत का प्रयास है, प्राकृतिक आपदा से, पुल, सड़कें, बिल्डिंग्स, पावर ग्रिड, ऐसा हर इंफ्रास्ट्रक्चर सुरक्षित रहे, सुरक्षित निर्माण हो।

साथियों,

भविष्य की चुनौतियों से निपटने के लिए हर देश का मिलकर काम करना बहुत जरूरी है। ऐसी ही एक चुनौती है, हमारे एनर्जी रिसोर्सेस की। इसलिए पूरी दुनिया की चिंता करते हुए भारत ने International Solar Alliance (ISA) का समाधान दिया है। ताकि छोटे से छोटा देश भी सस्टेनबल एनर्जी का लाभ उठा सके। इससे क्लाइमेट पर तो पॉजिटिव असर होगा ही, ये ग्लोबल साउथ के देशों की एनर्जी नीड्स को भी सिक्योर करेगा। और आप सबको ये जानकर गर्व होगा कि भारत के इस प्रयास के साथ, आज दुनिया के सौ से अधिक देश जुड़ चुके हैं।

साथियों,

बीते कुछ समय से दुनिया, ग्लोबल ट्रेड में असंतुलन और लॉजिस्टिक्स से जुड़ी challenges का सामना कर रही है। इन चुनौतियों से निपटने के लिए भी भारत ने दुनिया के साथ मिलकर नए प्रयास शुरु किए हैं। India–Middle East–Europe Economic Corridor (IMEC), ऐसा ही एक महत्वाकांक्षी प्रोजेक्ट है। ये प्रोजेक्ट, कॉमर्स और कनेक्टिविटी के माध्यम से एशिया, यूरोप और मिडिल ईस्ट को जोड़ेगा। इससे आर्थिक संभावनाएं तो बढ़ेंगी ही, दुनिया को अल्टरनेटिव ट्रेड रूट्स भी मिलेंगे। इससे ग्लोबल सप्लाई चेन भी और मजबूत होगी।

|

साथियों,

ग्लोबल सिस्टम्स को, अधिक पार्टिसिपेटिव, अधिक डेमोक्रेटिक बनाने के लिए भी भारत ने अनेक कदम उठाए हैं। और यहीं, यहीं पर ही भारत मंडपम में जी-20 समिट हुई थी। उसमें अफ्रीकन यूनियन को जी-20 का परमानेंट मेंबर बनाया गया है। ये बहुत बड़ा ऐतिहासिक कदम था। इसकी मांग लंबे समय से हो रही थी, जो भारत की प्रेसीडेंसी में पूरी हुई। आज ग्लोबल डिसीजन मेकिंग इंस्टीट्यूशन्स में भारत, ग्लोबल साउथ के देशों की आवाज़ बन रहा है। International Yoga Day, WHO का ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, आर्टिफिशियल इंटेलीजेंस के लिए ग्लोबल फ्रेमवर्क, ऐसे कितने ही क्षेत्रों में भारत के प्रयासों ने नए वर्ल्ड ऑर्डर में अपनी मजबूत उपस्थिति दर्ज कराई है, और ये तो अभी शुरूआत है, ग्लोबल प्लेटफॉर्म पर भारत का सामर्थ्य नई ऊंचाई की तरफ बढ़ रहा है।

साथियों,

21वीं सदी के 25 साल बीत चुके हैं। इन 25 सालों में 11 साल हमारी सरकार ने देश की सेवा की है। और जब हम What India Thinks Today उससे जुड़ा सवाल उठाते हैं, तो हमें ये भी देखना होगा कि Past में क्या सवाल थे, क्या जवाब थे। इससे TV9 के विशाल दर्शक समूह को भी अंदाजा होगा कि कैसे हम, निर्भरता से आत्मनिर्भरता तक, Aspirations से Achievement तक, Desperation से Development तक पहुंचे हैं। आप याद करिए, एक दशक पहले, गांव में जब टॉयलेट का सवाल आता था, तो माताओं-बहनों के पास रात ढलने के बाद और भोर होने से पहले का ही जवाब होता था। आज उसी सवाल का जवाब स्वच्छ भारत मिशन से मिलता है। 2013 में जब कोई इलाज की बात करता था, तो महंगे इलाज की चर्चा होती थी। आज उसी सवाल का समाधान आयुष्मान भारत में नजर आता है। 2013 में किसी गरीब की रसोई की बात होती थी, तो धुएं की तस्वीर सामने आती थी। आज उसी समस्या का समाधान उज्ज्वला योजना में दिखता है। 2013 में महिलाओं से बैंक खाते के बारे में पूछा जाता था, तो वो चुप्पी साध लेती थीं। आज जनधन योजना के कारण, 30 करोड़ से ज्यादा बहनों का अपना बैंक अकाउंट है। 2013 में पीने के पानी के लिए कुएं और तालाबों तक जाने की मजबूरी थी। आज उसी मजबूरी का हल हर घर नल से जल योजना में मिल रहा है। यानि सिर्फ दशक नहीं बदला, बल्कि लोगों की ज़िंदगी बदली है। और दुनिया भी इस बात को नोट कर रही है, भारत के डेवलपमेंट मॉडल को स्वीकार रही है। आज भारत सिर्फ Nation of Dreams नहीं, बल्कि Nation That Delivers भी है।

साथियों,

जब कोई देश, अपने नागरिकों की सुविधा और समय को महत्व देता है, तब उस देश का समय भी बदलता है। यही आज हम भारत में अनुभव कर रहे हैं। मैं आपको एक उदाहरण देता हूं। पहले पासपोर्ट बनवाना कितना बड़ा काम था, ये आप जानते हैं। लंबी वेटिंग, बहुत सारे कॉम्प्लेक्स डॉक्यूमेंटेशन का प्रोसेस, अक्सर राज्यों की राजधानी में ही पासपोर्ट केंद्र होते थे, छोटे शहरों के लोगों को पासपोर्ट बनवाना होता था, तो वो एक-दो दिन कहीं ठहरने का इंतजाम करके चलते थे, अब वो हालात पूरी तरह बदल गया है, एक आंकड़े पर आप ध्यान दीजिए, पहले देश में सिर्फ 77 पासपोर्ट सेवा केंद्र थे, आज इनकी संख्या 550 से ज्यादा हो गई है। पहले पासपोर्ट बनवाने में, और मैं 2013 के पहले की बात कर रहा हूं, मैं पिछले शताब्दी की बात नहीं कर रहा हूं, पासपोर्ट बनवाने में जो वेटिंग टाइम 50 दिन तक होता था, वो अब 5-6 दिन तक सिमट गया है।

साथियों,

ऐसा ही ट्रांसफॉर्मेशन हमने बैंकिंग इंफ्रास्ट्रक्चर में भी देखा है। हमारे देश में 50-60 साल पहले बैंकों का नेशनलाइजेशन किया गया, ये कहकर कि इससे लोगों को बैंकिंग सुविधा सुलभ होगी। इस दावे की सच्चाई हम जानते हैं। हालत ये थी कि लाखों गांवों में बैंकिंग की कोई सुविधा ही नहीं थी। हमने इस स्थिति को भी बदला है। ऑनलाइन बैंकिंग तो हर घर में पहुंचाई है, आज देश के हर 5 किलोमीटर के दायरे में कोई न कोई बैंकिंग टच प्वाइंट जरूर है। और हमने सिर्फ बैंकिंग इंफ्रास्ट्रक्चर का ही दायरा नहीं बढ़ाया, बल्कि बैंकिंग सिस्टम को भी मजबूत किया। आज बैंकों का NPA बहुत कम हो गया है। आज बैंकों का प्रॉफिट, एक लाख 40 हज़ार करोड़ रुपए के नए रिकॉर्ड को पार कर चुका है। और इतना ही नहीं, जिन लोगों ने जनता को लूटा है, उनको भी अब लूटा हुआ धन लौटाना पड़ रहा है। जिस ED को दिन-रात गालियां दी जा रही है, ED ने 22 हज़ार करोड़ रुपए से अधिक वसूले हैं। ये पैसा, कानूनी तरीके से उन पीड़ितों तक वापिस पहुंचाया जा रहा है, जिनसे ये पैसा लूटा गया था।

साथियों,

Efficiency से गवर्नमेंट Effective होती है। कम समय में ज्यादा काम हो, कम रिसोर्सेज़ में अधिक काम हो, फिजूलखर्ची ना हो, रेड टेप के बजाय रेड कार्पेट पर बल हो, जब कोई सरकार ये करती है, तो समझिए कि वो देश के संसाधनों को रिस्पेक्ट दे रही है। और पिछले 11 साल से ये हमारी सरकार की बड़ी प्राथमिकता रहा है। मैं कुछ उदाहरणों के साथ अपनी बात बताऊंगा।

|

साथियों,

अतीत में हमने देखा है कि सरकारें कैसे ज्यादा से ज्यादा लोगों को मिनिस्ट्रीज में accommodate करने की कोशिश करती थीं। लेकिन हमारी सरकार ने अपने पहले कार्यकाल में ही कई मंत्रालयों का विलय कर दिया। आप सोचिए, Urban Development अलग मंत्रालय था और Housing and Urban Poverty Alleviation अलग मंत्रालय था, हमने दोनों को मर्ज करके Housing and Urban Affairs मंत्रालय बना दिया। इसी तरह, मिनिस्ट्री ऑफ ओवरसीज़ अफेयर्स अलग था, विदेश मंत्रालय अलग था, हमने इन दोनों को भी एक साथ जोड़ दिया, पहले जल संसाधन, नदी विकास मंत्रालय अलग था, और पेयजल मंत्रालय अलग था, हमने इन्हें भी जोड़कर जलशक्ति मंत्रालय बना दिया। हमने राजनीतिक मजबूरी के बजाय, देश की priorities और देश के resources को आगे रखा।

साथियों,

हमारी सरकार ने रूल्स और रेगुलेशन्स को भी कम किया, उन्हें आसान बनाया। करीब 1500 ऐसे कानून थे, जो समय के साथ अपना महत्व खो चुके थे। उनको हमारी सरकार ने खत्म किया। करीब 40 हज़ार, compliances को हटाया गया। ऐसे कदमों से दो फायदे हुए, एक तो जनता को harassment से मुक्ति मिली, और दूसरा, सरकारी मशीनरी की एनर्जी भी बची। एक और Example GST का है। 30 से ज्यादा टैक्सेज़ को मिलाकर एक टैक्स बना दिया गया है। इसको process के, documentation के हिसाब से देखें तो कितनी बड़ी बचत हुई है।

साथियों,

सरकारी खरीद में पहले कितनी फिजूलखर्ची होती थी, कितना करप्शन होता था, ये मीडिया के आप लोग आए दिन रिपोर्ट करते थे। हमने, GeM यानि गवर्नमेंट ई-मार्केटप्लेस प्लेटफॉर्म बनाया। अब सरकारी डिपार्टमेंट, इस प्लेटफॉर्म पर अपनी जरूरतें बताते हैं, इसी पर वेंडर बोली लगाते हैं और फिर ऑर्डर दिया जाता है। इसके कारण, भ्रष्टाचार की गुंजाइश कम हुई है, और सरकार को एक लाख करोड़ रुपए से अधिक की बचत भी हुई है। डायरेक्ट बेनिफिट ट्रांसफर- DBT की जो व्यवस्था भारत ने बनाई है, उसकी तो दुनिया में चर्चा है। DBT की वजह से टैक्स पेयर्स के 3 लाख करोड़ रुपए से ज्यादा, गलत हाथों में जाने से बचे हैं। 10 करोड़ से ज्यादा फर्ज़ी लाभार्थी, जिनका जन्म भी नहीं हुआ था, जो सरकारी योजनाओं का फायदा ले रहे थे, ऐसे फर्जी नामों को भी हमने कागजों से हटाया है।

साथियों,

 

हमारी सरकार टैक्स की पाई-पाई का ईमानदारी से उपयोग करती है, और टैक्सपेयर का भी सम्मान करती है, सरकार ने टैक्स सिस्टम को टैक्सपेयर फ्रेंडली बनाया है। आज ITR फाइलिंग का प्रोसेस पहले से कहीं ज्यादा सरल और तेज़ है। पहले सीए की मदद के बिना, ITR फाइल करना मुश्किल होता था। आज आप कुछ ही समय के भीतर खुद ही ऑनलाइन ITR फाइल कर पा रहे हैं। और रिटर्न फाइल करने के कुछ ही दिनों में रिफंड आपके अकाउंट में भी आ जाता है। फेसलेस असेसमेंट स्कीम भी टैक्सपेयर्स को परेशानियों से बचा रही है। गवर्नेंस में efficiency से जुड़े ऐसे अनेक रिफॉर्म्स ने दुनिया को एक नया गवर्नेंस मॉडल दिया है।

साथियों,

पिछले 10-11 साल में भारत हर सेक्टर में बदला है, हर क्षेत्र में आगे बढ़ा है। और एक बड़ा बदलाव सोच का आया है। आज़ादी के बाद के अनेक दशकों तक, भारत में ऐसी सोच को बढ़ावा दिया गया, जिसमें सिर्फ विदेशी को ही बेहतर माना गया। दुकान में भी कुछ खरीदने जाओ, तो दुकानदार के पहले बोल यही होते थे – भाई साहब लीजिए ना, ये तो इंपोर्टेड है ! आज स्थिति बदल गई है। आज लोग सामने से पूछते हैं- भाई, मेड इन इंडिया है या नहीं है?

साथियों,

आज हम भारत की मैन्युफैक्चरिंग एक्सीलेंस का एक नया रूप देख रहे हैं। अभी 3-4 दिन पहले ही एक न्यूज आई है कि भारत ने अपनी पहली MRI मशीन बना ली है। अब सोचिए, इतने दशकों तक हमारे यहां स्वदेशी MRI मशीन ही नहीं थी। अब मेड इन इंडिया MRI मशीन होगी तो जांच की कीमत भी बहुत कम हो जाएगी।

|

साथियों,

आत्मनिर्भर भारत और मेक इन इंडिया अभियान ने, देश के मैन्युफैक्चरिंग सेक्टर को एक नई ऊर्जा दी है। पहले दुनिया भारत को ग्लोबल मार्केट कहती थी, आज वही दुनिया, भारत को एक बड़े Manufacturing Hub के रूप में देख रही है। ये सक्सेस कितनी बड़ी है, इसके उदाहरण आपको हर सेक्टर में मिलेंगे। जैसे हमारी मोबाइल फोन इंडस्ट्री है। 2014-15 में हमारा एक्सपोर्ट, वन बिलियन डॉलर तक भी नहीं था। लेकिन एक दशक में, हम ट्वेंटी बिलियन डॉलर के फिगर से भी आगे निकल चुके हैं। आज भारत ग्लोबल टेलिकॉम और नेटवर्किंग इंडस्ट्री का एक पावर सेंटर बनता जा रहा है। Automotive Sector की Success से भी आप अच्छी तरह परिचित हैं। इससे जुड़े Components के एक्सपोर्ट में भी भारत एक नई पहचान बना रहा है। पहले हम बहुत बड़ी मात्रा में मोटर-साइकल पार्ट्स इंपोर्ट करते थे। लेकिन आज भारत में बने पार्ट्स UAE और जर्मनी जैसे अनेक देशों तक पहुंच रहे हैं। सोलर एनर्जी सेक्टर ने भी सफलता के नए आयाम गढ़े हैं। हमारे सोलर सेल्स, सोलर मॉड्यूल का इंपोर्ट कम हो रहा है और एक्सपोर्ट्स 23 गुना तक बढ़ गए हैं। बीते एक दशक में हमारा डिफेंस एक्सपोर्ट भी 21 गुना बढ़ा है। ये सारी अचीवमेंट्स, देश की मैन्युफैक्चरिंग इकोनॉमी की ताकत को दिखाती है। ये दिखाती है कि भारत में कैसे हर सेक्टर में नई जॉब्स भी क्रिएट हो रही हैं।

साथियों,

TV9 की इस समिट में, विस्तार से चर्चा होगी, अनेक विषयों पर मंथन होगा। आज हम जो भी सोचेंगे, जिस भी विजन पर आगे बढ़ेंगे, वो हमारे आने वाले कल को, देश के भविष्य को डिजाइन करेगा। पिछली शताब्दी के इसी दशक में, भारत ने एक नई ऊर्जा के साथ आजादी के लिए नई यात्रा शुरू की थी। और हमने 1947 में आजादी हासिल करके भी दिखाई। अब इस दशक में हम विकसित भारत के लक्ष्य के लिए चल रहे हैं। और हमें 2047 तक विकसित भारत का सपना जरूर पूरा करना है। और जैसा मैंने लाल किले से कहा है, इसमें सबका प्रयास आवश्यक है। इस समिट का आयोजन कर, TV9 ने भी अपनी तरफ से एक positive initiative लिया है। एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं।

मैं TV9 को विशेष रूप से बधाई दूंगा, क्योंकि पहले भी मीडिया हाउस समिट करते रहे हैं, लेकिन ज्यादातर एक छोटे से फाइव स्टार होटल के कमरे में, वो समिट होती थी और बोलने वाले भी वही, सुनने वाले भी वही, कमरा भी वही। TV9 ने इस परंपरा को तोड़ा और ये जो मॉडल प्लेस किया है, 2 साल के भीतर-भीतर देख लेना, सभी मीडिया हाउस को यही करना पड़ेगा। यानी TV9 Thinks Today वो बाकियों के लिए रास्ता खोल देगा। मैं इस प्रयास के लिए बहुत-बहुत अभिनंदन करता हूं, आपकी पूरी टीम को, और सबसे बड़ी खुशी की बात है कि आपने इस इवेंट को एक मीडिया हाउस की भलाई के लिए नहीं, देश की भलाई के लिए आपने उसकी रचना की। 50,000 से ज्यादा नौजवानों के साथ एक मिशन मोड में बातचीत करना, उनको जोड़ना, उनको मिशन के साथ जोड़ना और उसमें से जो बच्चे सिलेक्ट होकर के आए, उनकी आगे की ट्रेनिंग की चिंता करना, ये अपने आप में बहुत अद्भुत काम है। मैं आपको बहुत बधाई देता हूं। जिन नौजवानों से मुझे यहां फोटो निकलवाने का मौका मिला है, मुझे भी खुशी हुई कि देश के होनहार लोगों के साथ, मैं अपनी फोटो निकलवा पाया। मैं इसे अपना सौभाग्य मानता हूं दोस्तों कि आपके साथ मेरी फोटो आज निकली है। और मुझे पक्का विश्वास है कि सारी युवा पीढ़ी, जो मुझे दिख रही है, 2047 में जब देश विकसित भारत बनेगा, सबसे ज्यादा बेनिफिशियरी आप लोग हैं, क्योंकि आप उम्र के उस पड़ाव पर होंगे, जब भारत विकसित होगा, आपके लिए मौज ही मौज है। आपको बहुत-बहुत शुभकामनाएं।

धन्यवाद।