నమస్కారం !

ప్రబుద్ధ భారత 125 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక సాధారణమైన పత్రిక కాదు. దీనిని, 1896 లో సాక్షాత్తూ, స్వామి వివేకానంద ప్రారంభించారు. అది కూడా, కేవలం, ముప్పై మూడు సంవత్సరాల వయస్సులో ప్రారంభించారు. దేశంలో చాలా కాలంగా నడుస్తున్న ఆంగ్ల పత్రికలలో, ఇది ఒకటి.

"ప్రబుద్ధ భారత" - అనే - ఈ పేరు వెనుక చాలా శక్తివంతమైన ఆలోచన ఉంది. మన దేశ స్ఫూర్తిని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో, స్వామి వివేకానంద ఈ పత్రికకు ప్రబుద్ధ భారత అని పేరు పెట్టారు. ఆయన, ' జాగృతమైన భారతదేశాన్ని' సృష్టించాలని అనుకున్నారు. భారత్ అంటే అర్థం చేసుకున్న వారికి తెలుస్తుంది, అది కేవలం రాజకీయ లేదా ప్రాదేశిక సంస్థకు మించినదని. స్వామి వివేకానంద ఈ విషయాన్ని చాలా ధైర్యంగా, గర్వంగా వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా జీవించి, ఊపిరి పీల్చుకుంటున్న సాంస్కృతిక స్పృహగా ఆయన భారతదేశాన్ని చూశారు. అంచనాలు విరుద్ధంగా ఉన్నప్పటికి, భారతదేశం, ప్రతి సవాలు అనంతరం కూడా మరింత బలంగా ఉద్భవించే దేశం. స్వామి వివేకానంద భారతదేశాన్ని ‘ప్రబుద్ధ’ గా మార్చాలని లేదా జాగృతం చేయాలని అనుకున్నారు. ఒక దేశంగా మనం గొప్పతనాన్ని కోరుకుందాం - అనే ఆత్మ విశ్వాసాన్ని మేల్కొల్పాలని ఆయన కోరారు.

మితృలారా !

స్వామి వివేకానందకు పేదల పట్ల అపారమైన కరుణ ఉండేది. పేదరికంమే - అన్ని సమస్యలకు మూలమని ఆయన బలంగా నమ్మారు. అందువల్ల, పేదరికాన్ని, దేశం నుండి తొలగించాలి. అందుకే, ఆయన ‘దరిద్ర నారాయణ’ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

స్వామి వివేకానంద, అమెరికా నుండి, చాలా లేఖలు రాశారు. మైసూర్ మహారాజు కు, స్వామి రామకృష్ణానందజీ కి ఆయన రాసిన లేఖలను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ లేఖలలో, పేదవారి సాధికారతపై, స్వామిజీ విధానం గురించి రెండు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. పేదలు సులభంగా సాధికారతను చేరుకోలేకపోతే, సాధికారతనే పేదల వద్దకు తీసుకు వెళ్ళాలన్నది, ఆయన మొదటి ఆలోచన. ఇక రెండవ ఆలోచనగా, ఆయన భారతదేశ పేదల గురించి మాట్లాడుతూ, "వారికి ఆలోచించే అవకాశం ఇవ్వాలి; వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతోందో, వారి కళ్ళతో చూడాలి; అప్పుడు, వారి సమస్యల పరిష్కారానికి, వారే కృషి చేస్తారు." అని సూచించారు.

ఇదే విధానంతో, ఇప్పుడు, భారతదేశం ముందుకు సాగుతోంది. పేదలు బ్యాంకులను చేరుకోలేకపోతే, బ్యాంకులే పేదల దగ్గరకు రావాలి. ఆ పనిని "జన్ ధన్ యోజన" చేసింది. పేదలు బీమాను పొందలేకపోతే, బీమా పేదలను చేరాలి. "జన సురక్ష పథకాలు" అదే చేస్తున్నాయి. పేదలు ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతే, మనం పేదల వద్దకు ఆరోగ్య సంరక్షణను తప్పకుండా తీసుకు వెళ్ళాలి. "ఆయుష్మాన్ భారత్ పథకం" ఇదే చేసింది. రోడ్లు, విద్య, విద్యుత్తు, ఇంటర్నెట్ అనుసంధానం వంటి సౌకర్యాలను, దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ, ముఖ్యంగా పేదల దగ్గరకు తీసుకువెళ్ళడం జరుగుతోంది. ఇది పేదల మధ్య ఆకాంక్షలను రేకెత్తిస్తోంది. ఈ ఆకాంక్షలే దేశాభివృద్ధి కి కారణమవుతున్నాయి.

మితృలారా !

"బలహీనతకు పరిహారం, దాన్ని పెంచి పోషించడం కాదు, బలం గురించి ఆలోచించడం". అని స్వామీ వివేకానంద అన్నారు. మనం అస్తమానం అవరోధాల గురించే ఆలోచిస్తూంటే, మనం, వాటిలోనే మునిగి పోతాము. అదే, మనం, అవకాశాల పరంగా ఆలోచిస్తే, ముందుకు సాగడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కోవిడ్-19 మహమ్మారిని ఉదాహరణగా తీసుకోండి. భారతదేశం ఏమి చేసింది? ఇది సమస్యను మాత్రమే చూస్తూ, నిస్సహాయంగా ఉండిపోలేదు. భారతదేశం, పరిష్కారాలపై దృష్టి పెట్టింది. పి.పి.ఇ. కిట్ ‌లను ఉత్పత్తి చేయడం నుండి ప్రపంచానికి ఫార్మసీగా మారడం వరకు మన దేశం పోటా, పోటీగా నిలిచింది. సంక్షోభ సమయంలో, భారతదేశం ప్రపంచానికి మద్దతుగా మారింది. కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారతదేశం ముందంజలో ఉంది. కొద్ది రోజుల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మనం ఇతర దేశాలకు సహాయం చేయడానికి కూడా, ఈ సామర్థ్యాలను ఉపయోగిస్తున్నాము.

మితృలారా !

ప్రపంచమంతా ఎదుర్కొంటున్న మరో అవరోధం వాతావరణ మార్పు. అయితే, మనం కేవలం, సమస్య గురించి మాత్రమే ఫిర్యాదు చేయలేదు. మనం అంతర్జాతీయ సౌర కూటమి రూపంలో దీనికి, ఒక పరిష్కారం తీసుకువచ్చాము. పునరుత్పాదక వనరులను ఎక్కువగా ఉపయోగించాలని మనం సూచిస్తున్నాము. స్వామి వివేకానంద ఆలోచనలకు అనుగుణంగా రూపొందిన ప్రబుద్ధ భారత కూడా ఇదే. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్న భారతదేశం ఇదే.

మితృలారా !

భారత యువతపై అపారమైన నమ్మకం ఉన్నందున స్వామి వివేకానందకు భారతదేశం గురించి పెద్ద కలలు ఉండేవి. ఆయన భారతదేశ యువతను, నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క శక్తి కేంద్రంగా చూశారు. "నాకు వంద మంది శక్తివంతమైన యువకులను ఇవ్వండి; నేను భారతదేశాన్ని మారుస్తాను" అని, ఆయన చెప్పారు. ఈ రోజు మనం భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలతో పాటు ఎంతో మందిలో ఈ స్ఫూర్తిని చూస్తున్నాము. వారు సరిహద్దులను అధిగమించి, అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తారు.

అయితే, మన యువతలో ఆ విధమైన స్ఫూర్తిని మరింతగా ప్రోత్సహించడం ఎలా? ఆచరణీయ వేదాంతంపై, స్వామీ వివేకానంద ఉపన్యసిస్తూ, కొన్ని లోతైన విషయాలను వెల్లడించారు. ఆయన ఎదురుదెబ్బలను అధిగమించడం గురించి మాట్లాడుతూ, వాటిని అభ్యాస క్రమంలో భాగంగా చూడాలని పేర్కొన్నారు. ప్రజలలో నింపాల్సిన రెండవ విషయం ఏమిటంటే: నిర్భయంగా ఉండటం, ఆత్మ విశ్వాసంతో నిండి ఉండటం. నిర్భయంగా ఉండడం అనే పాఠాన్ని స్వామి వివేకానంద స్వీయ జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఆయన ఏ పని చేసినా, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. ఆయనపై ఆయన పూర్తి విశ్వాసంతో ఉండేవారు. శతాబ్దాల నాటి ఒక నీతికి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఆయన నమ్మకంగా ఉండేవారు.

మితృలారా !

స్వామి వివేకానంద ఆలోచనలు శాశ్వతమైనవి. వాటిని, మనం, ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి: ప్రపంచానికి విలువైనదాన్ని సృష్టించడం ద్వారా నిజమైన అమరత్వం సాధించాలి. అదే, మనల్ని మనం బ్రతికిస్తుంది. మన పౌరాణిక కథలు మనకు ఎంతో విలువైన విషయాలు నేర్పుతాయి. అమరత్వాన్ని వెంబడించిన వారికి అది ఎన్నడూ లభించలేదని, అవి మనకు బోధిస్తాయి. కానీ, ఇతరులకు సేవ చేయాలనే లక్ష్యం ఉన్నవారు దాదాపు ఎల్లప్పుడూ అమరులుగానే ఉంటారు. స్వామి జీ స్వయంగా చెప్పినట్లుగా, "ఇతరుల కోసం జీవించేవారు మాత్రమే, జీవించి ఉంటారు." మనం, ఈ విషయాన్ని, స్వామి వివేకానంద జీవితంలో కూడా గమనించవచ్చు. తనకోసం ఏదైనా సాధించాలనే ఉద్దేశ్యంతో ఆయన బయటకు వెళ్ళలేదు. ఆయన హృదయం ఎప్పుడూ, మన దేశంలోని పేదల కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన గుండె అప్పుడూ, బంధనాల్లో ఉన్న మాతృభూమి కోసమే, కొట్టుకుంటూ ఉంటుంది.

మితృలారా !

స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మరియు ఆర్థిక పురోగతిని పరస్పరం భిన్నంగా చూడలేదు. మరీ ముఖ్యంగా, ప్రజలు పేదరికాన్ని శృంగారభరితం చేసే విధానాన్ని, ఆయన వ్యతిరేకించారు. ఆచరణీయ వేదాంతం గురించి, ఆయన, తన ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ, "మతం మరియు ప్రపంచ జీవితాల మధ్య కల్పిత వ్యత్యాసం అంతరించిపోవాలి, ఎందుకంటే వేదాంతం ఏకత్వాన్ని బోధిస్తుంది", అని పేర్కొన్నారు.

స్వామి జీ ఒక ఆధ్యాత్మిక దిగ్గజం, అత్యున్నతమైన మనసు కలిగిన వ్యక్తి. అయినప్పటికీ, ఆయన, పేదల ఆర్థిక పురోగతి ఆలోచనను, ఎప్పుడూ త్యజించలేదు. స్వామి జీ స్వయంగా సన్యాసి. ఆయన, తన కోసం ఎప్పుడూ ఒక్క పైసా కూడా, ఆశించలేదు. అయితే, గొప్ప సంస్థలను నిర్మించడానికి నిధులు సేకరించడానికి సహాయం చేశారు. ఈ సంస్థలు పేదరికానికి వ్యతిరేకంగా పోరాడి, ఆవిష్కరణలను ప్రోత్సహించాయి.

మితృలారా !

మనకు మార్గనిర్దేశం చేసే అనేక సంపదలు స్వామి వివేకానంద నుండి మనకు లభిస్తాయి. స్వామి జీ ఆలోచనలను వ్యాప్తి చేస్తూ, ప్రబుద్ధ భారత, 125 సంవత్సరాల నుండి నడుస్తోంది. యువతకు విద్యను అందించడం, దేశాన్ని మేల్కొల్పడం అనే, స్వామీజీ ఆలోచనలపై వారు దృష్టి కేంద్రీకరించారు. స్వామి వివేకానంద ఆలోచనలకు అమరత్వం కలిగించడానికి, ఇది గణనీయంగా దోహదపడింది. ప్రబుద్ధ భారత భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

ధన్యవాదములు.

  • krishangopal sharma Bjp February 20, 2025

    मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹🙏🌹🙏🌷🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp February 20, 2025

    मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹🙏🌹🙏🌷🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp February 20, 2025

    मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹मोदी 🌹🙏🌹🙏🌷🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • shaktipaswan October 25, 2023

    आवास योजना नही मिला है मिलेगा नही सर जी नाम शक्ति पासवान उर्म ३२ अकाउन्ट नम्बर 1880493732 या होमलोन मिलेगा
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय माँ भारती
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता February 18, 2022

    जय श्री राम
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan

Media Coverage

'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

ప్రియమైన దేశ ప్రజలారా.. నమస్కారం

గత కొన్ని రోజులుగా మనమందరం దేశ సామర్థ్యం, సహనాన్ని రెండింటిని చూశాం

మొదటగా..భారత దేశ పరాక్రమ సేనకు, సరిహద్దు బలగాలకు, నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు, ప్రతి ఒక్క భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నాను.

మన వీర సైనికులు ఆపరేషన్ సిందూర్‌లో కచ్చితత్వంతో అసమాన శౌర్యాన్ని చూపిస్తూ లక్ష్యాలను ఛేదించారు

వారి వీరత్వం, పరాక్రమానికి, వారి సాహసానికి సెల్యూట్ చేస్తున్నాను

 

మన దేశ ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి కూతురుకు ఈ పరాక్రమాన్ని అంకితం చేస్తాం

 

మిత్రులారా...ఏప్రిల్ 22న పెహల్గామ్ లో ఉగ్రవాదులు క్రూరత్వాన్ని చూపించారు

ఈ ఘటన దేశాన్ని, ప్రపంచాన్ని వణికించింది.

సెలవులు గడపడానికి వెళ్లిన అమాయాక పౌరులను వారి మతం అడిగి...వారి కుటుంబం ముందే, వారి పిల్లల ముందే దయలేకుండా హతమార్చారు. ఇది ఉగ్రవాదానికి బీభత్సానికి, క్రూరత్వానికి ప్రతీక.

 

దేశంలోని సౌభ్రాత్రుత్వాన్ని విడగొట్టడానికి ఘోరమైన ప్రయత్నం. వ్యక్తిగతంగా నాకు ఇది ఎంతో బాధను కలిగించింది. ఈ ఉగ్రవాద దాడి తర్వాత దేశమంతా, ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వర్గం, ప్రతి రాజకీయ పార్టీ ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏకమయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టేంచేందుకు భారతీయ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం.

 

మన చెల్లెల్లు, కూతుళ్ల నుదిటి సింధూరాన్ని చేరిపేస్తే..దాని సమాధానం ఎలా ఉంటుందో ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థ తెలుసుకుంది.

మిత్రులారా..ఆపరేషన్ సిందూర్ ఇదొక పేరు కాదు.

ఇది దేశంలోని కోటానుకోట్ల ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది

ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసం ఒక అఖండ ప్రతిజ్ఞ.

మే 6 రాత్రి, మే7 తెల్లవారుజామున ఈ ప్రతిజ్ఞ ఫలితాలను ప్రపంచం మొత్తం చూసింది.

భారత సైన్యం పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై...వారి శిక్షణ కేంద్రాలపై కచ్చితమైన దాడి చేసింది. ఉగ్రవాదులు కలలో కూడా అనుకొని ఉండకపోవచ్చు...భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని..కానీ ఎప్పుడైతే దేశం ఏకమవుతుందో..నేషన్ ఫస్ట్ అనే భావన ఉంటుందో.. దేశ హితమే ముఖ్యమని అనుకుంటున్నామో అప్పుడే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ ఫలితాలను సాధించి చూపిస్తాం

 

పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మిసైల్ దాడులు చేసినప్పుడు, డ్రోన్ల దాడులు చేసినప్పుడు, ఉగ్రవాద సంస్థల భవనాలే కాకుండా వారి ధైర్యం కూడా ధ్వంసం అయ్యాయి. బవహల్ పూర్, మురిద్కేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు...ఒక రకంగా ప్రపంచ ఉగ్రవాదానికి విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి.

ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగినా, 9/11, లండన్ బాంబ్ బ్లాస్టింగ్ లేదా, భారత్ లో జరిగిన పెద్ద ఉగ్రవాద దాడులు, వాటి మూలాలు ఈ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలతో ముడిపడి ఉన్నాయి.

ఉగ్రవాదులు మన అక్కాచెల్లెల్ల సిందూరాన్ని తుడిచేశారు. అందుకే భారత్ ఉగ్రవాద ముఖ్య కేంద్రాలను సర్వనాశనం చేసింది. భారత్ దాడిలో వంద మందికిపైగా అతి భయంకరమైన ఉగ్రవాదులు హతం అయ్యారు.

గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి సూత్రధారులు బహిరంగంగా తిరుగుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. భారత్ ఒక్కదాడితో వారందరినీ అంతమొందించింది. మిత్రులారా.. భారత దేశ ఈ చర్యతో పాకిస్తాన్ ఎంతో నిరాశ, నిస్పృహకు, గాభరపాటుకు లోనయ్యింది. ఈ గాభరపాటులోనే పాకిస్తాన్ మరొక దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరులో భారత్ కు మద్దతుగా నిలవాల్సింది పోయి పాకిస్తాన్ భారత్ పై దాడిని ప్రారంభించింది. పాకిస్థాన్ మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, సామాన్య పౌరుల నివాసాలే లక్ష్యంగా దాడులు చేసింది. పాక్ మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ..దీంతో పాకిస్తాన్ నిజస్వరూపం బయటపడింది. అలాగే పాకిస్తాన్ కుట్రలు కూడా బయటపడ్డాయి..

ప్రపంచం మొత్తం పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ ఎలా ముక్కలుముక్కలు చేసిందో చూశాయి. భారత దేశ సమర్ధమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలోనే నాశనం చేశాయి. పాకిస్తాన్ సరిహద్దు వద్ద యుద్దానికి సిద్దమైంది..ఐతే భారత వాయుసేన పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీలక స్థావరాలపై దాడి చేసింది.

భారత డ్రోన్లు, మిస్సైళ్లు కచ్చితమైన లక్ష్యాలపై దాడి చేశాయి.

పాకిస్థాన్ వాయు సేన ఎయిర్ బేస్‌ను నష్టం కలిగించాం. ఈ ఎయిర్ బేస్ పై పాకిస్థాన్‌కు గర్వం ఉండేది. భారత్ మొదటి మూడు రోజుల్లోనే పాకిస్థాన్‌లో చేసిన నష్టం, వాళ్ల ఊహకు కూడా అందలేదు. అందుకే భారత ప్రతి దాడి తర్వాత పాకిస్థాన్ తనను తాను రక్షించుకునేందుకు అనేక మార్గాలను వెతకడం ప్రారంభించింది.

ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ వినతులు చేసింది. ఇంత ఘోరంగా దెబ్బతినడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మే 10 మధ్యాహ్నానికి పాక్ సైన్యం మన డీజీఎంవోను సంప్రదించారు. అప్పటికే..ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున నాశనం చేశాం. అనేక ఉగ్రవాదులను హతం చేశాం. పాకిస్థాన్‌లో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఉగ్ర స్థావరాలను శ్మశానంలా మార్చేశాం. అందుకే పాకిస్థాన్ నుంచి ఇలాంటి వినతులను వచ్చాయి. పాకిస్థాన్ తరఫు నుంచి ఇలా అన్నారు...తమ నుంచి భవిష్యత్‌లో ఉగ్రవాద చర్యలు, సైనిక దుస్సాహసం జరగదని హామీ ఇచ్చారు. దానిపై ఆలోచిస్తుందని...దీన్ని మరోసారి నేను చెప్తున్నాను. మనం పాకిస్తాన్ ఉగ్రవాద సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేశాం, ప్రతిదాడిని ప్రస్తుతానికి ఆపేశాం. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ తీసుకునే ప్రతి అడుగును ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వారి వైఖరి ఎలా ఉంటుందో చూస్తాం. మిత్రులారా భారత్, త్రివిధ దళాలు మన ఎయిర్ ఫోర్స్, మన సైన్యం, మన నౌకా దళం, బీఎస్ఎఫ్, భారత అర్థ సైనిక బలాలు ప్రతిక్షణం అలర్ట్‌గా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సిందూర్ వంటివి ఉగ్రవాదుల వ్యతిరేకంగా భారత విధానంగా చూడాలి. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. దాడుల స్థాయిని పెంచి న్యూ నార్మల్‌ని నిర్దేశించాం. అందులో మొదటగా భారత్ మీద ఉగ్రదాడులు జరిగితే దానికి ధీటైన జవాబు ఇస్తాం.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రపంచం పాకిస్తాన్ అసహ్యకరమైన సత్యాన్ని మరోసారి చూసింది. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల సమయంలో పాక్ సైన్యంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి. భారత్, తన పౌరుల రక్షణ కోసం నిరంతరంగా నిర్ణయాక చర్యలు తీసుకుంటుంది.

మిత్రులారా...యుద్ధ క్షేత్రంలో మనం ప్రతిసారి పాకిస్థాన్ ను ఓడించాం. ఈ సారి కూడా ఆపరేషన్ సిందూర్ కొత్త శిఖరాలకు చేర్చింది.

మన సైన్యం ఎడారి, కొండల్లో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. అలాగే..కొత్త తరం యుద్ధ తంత్రంలో కూడా మనం శ్రేష్ఠత సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. ఈ ఆపరేషన్ లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల సామర్ధ్యం కూడా నిరూపితమైంది. ఈ రోజు ప్రపంచమంతా చూస్తోంది. 21వ శతాబ్ద యుద్ధంలో భారత్ లో తయారైన రక్షణ ఉత్పత్తుల వినియోగానికి సమయం వచ్చింది.

మిత్రులారా..ఏరకమైన ఉగ్రవాదానికైనా వ్యతిరేకంగా మనం అందరం ఏకంగా ఉండటం అదే మన బలం.

కచ్చితంగా ఇప్పుడు ఇది యుద్ధ యుగం కాదు. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం....ఒక సురక్షిత ప్రపంచానికి గ్యారంటీ..

మిత్రులారా పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాగైతే ఉగ్రవాదానికి మద్దతుగా ఉందో..అదే ఉగ్రవాదం భవిష్యత్తులో పాకిస్తాన్‌నే అంతం చేస్తుంది. పాకిస్థాన్ తనను తాను కాపాడుకోవాలంటే..తన భూభాగంలో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ను అంతం చేయాల్సిందే..

దీనికి మించి శాంతికి మరేదారి లేదు. భారత దేశ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. టెర్రర్ అండ్ టాక్...ఉగ్రవాదం ఒకే పడవ మీద ప్రయాణం చేయలేవు. ఉగ్రవాదం వ్యాపారం ఒకే దగ్గర ఇమిడి ఉండవు. నీరు రక్తం కూడా ఒకే దగ్గర ఉండవు. నేను ఈ రోజు ప్రపంచానికి చెప్తున్నానను..ఇది మా ప్రకటిత విధానం. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అది కేవలం ఉగ్రవాదంపైనే...పాకిస్థాన్ తో చర్చలు జరిపితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే జరుగుతుంది. ప్రియమన దేశ ప్రజలారా ..ఈ రోజు బుద్ద పూర్ణిమ...భగవాన్ బుద్దుడు మనకు శాంతి మార్గాన్ని చూపించారు. శాంతి మార్గమే శక్తిగా ఉంటుంది. మానవాళి శాంతి, సమృద్ధి వైపు ముందుకు వెళుతోంది ప్రతి భారతీయుడు శాంతితో జీవించాలి. వికసిత్ భారత్ కలను పూర్తి చేయాలి. దీని కోసం భారత్, శాంతియుంతంగా ఉండాలి అవసరమైతే శక్తిని కూడా వాడాలి. గత కొన్ని రోజులుగా భారత్ ఇదే చేస్తోంది. నేను మరోసారి భారత సైన్యానికి, భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. భారతీయులందరి ధైర్యం, ఐక్యతకు నేను నమస్కరిస్తున్నాను.

ధన్యవాదాలు....

భారత్ మాతా కీ జై

​​​​​​​భారత్ మాతా కీ జై

​​​​​​​భారత్ మాతా కీ జై​​​​​​​....