QuoteEvery Indian is proud of our armed forces and brave soldiers, says PM Modi #MannKiBaat
QuoteBlue helmet-wearing Indian soldiers have been contributing to world peace since decades: PM Modi #MannKiBaat
QuoteEvery Indian, irrespective of what his region, caste, religion or language; is always ready to support our soldiers and express joy towards their success: PM #MannKiBaat
QuoteIndia can say with pride that the army derives its strength not only from men but also from women. Today, the Women are empowered, and also armed: PM Modi #MannKiBaat
QuoteThe Indian Air Force is at the forefront of relief and rescue work during times of disasters, says PM Modi #MannKiBaat
QuoteIndia to celebrate Mahatma Gandhi's 150th birth anniversary for two years: PM Modi #MannKiBaat
QuoteBapu gave an inspirational mantra to all of us which is known as Gandhi Ji’s Talisman. This Mantra is extremely relevant today: PM during #MannKiBaat
QuoteThe strong personality of Pt. Lal Bahadur Shastri is identified with his slogan of 'Jai Jawan, Jai Kisan': PM Modi #MannKiBaat
QuoteShastri ji’s gentle persona will always continue to fill us with immense pride, says PM Modi #MannKiBaat
Quote#MannKiBaat PM Modi congratulates the people of India on the success of the 'Swachhata Hi Seva' movement
QuoteCome and let's 'Run for Unity' on 31st October, so that citizens from every class of society could join together and strengthen our efforts for a united India, says PM Modi #MannKiBaat
Quote#MannKiBaat Sardar Patel always worked for the unity of the country throughout his lifetime, says PM Modi
QuoteNHRC, which is set to celebrate its 25th anniversary, has promoted Indian Vedic Values of Sarve Bhavantu Sukhinah: PM Modi #MannKiBaat

నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం! మన సైనిక బలగాలను, మన సాయుధ దళాలను చూసి గర్వపడని భారతీయుడు ఎవరూ ఉండరు. ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ మతం, లేదా ఏ భాషకు చెందిన వారైనా కూడా ప్రతి భారతీయుడూ మన సైనికుల పట్ల, తమ సంతోషాన్నీ, మద్దతునీ తెలపడానికి ఎల్లప్పుడూ తయారుగా ఉంటాడు. నిన్న 125కోట్ల భారతీయులందరూ పరాక్రమ పర్వాన్ని జరుపుకున్నారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ ను గుర్తుచేసుకున్నారు. టెర్రరిజం ముసుగులో మన దేశంపై పరోక్ష యుధ్ధం జరిగినప్పుడు, వారి నిర్లజ్జకర ప్రవర్తనకు దీటైన జవాబుని మన సైనికులు సర్జికల్ స్ట్రైక్ రూపంలో అందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో మన సాయుధదళాలు ప్రదర్శనలను ఏర్పాటుచేసాయి. ఈ ప్రదర్శనల ముఖ్య ఉద్దేశ్యం – మన దేశ ప్రజలకు, ఎక్కువగా మన యువతరానికి, మన దేశానికి ఉన్న శక్తిని పరిచయం చేయడమే. మనలో ఎంత సామర్ధ్యం దాగి ఉందో, మన సైనికులు ఏ విధంగా తమ ప్రాణాలకు తెగించి దేశాన్నీ,మనల్ని రక్షిస్తూ ఉంటారో తెలపడానికి. పరాక్రమ్ పర్వ్ లాంటి ముఖ్యమైన రోజులు మన దేశ యువతలో మన సైనికుల పట్ల గౌరవపూర్వకంగా ఎలా ఉండాలో తెలిపేలాంటి వారసత్వ సంప్రదాయాల్ని గుర్తు చేస్తాయి. తద్వారా మన దేశ సమైక్యత ను, నైతికతను సదా నిలిపి ఉంచడానికి ఇలాంటి దినోత్సవాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. వీరుల భూమి అయిన రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఒక కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. మన దేశ శాంతి, సామరస్యాలను నష్టపరచాలనే ప్రయత్నం ఎవరు చేసినా సరే, వారికి చెంపపెట్టు లాంటి సమాధానాన్ని మన సైనికులు ఇవ్వగలరన్న సంగతి ఇప్పుడు నిశ్చయంగా అందరికీ అర్ధమైంది. మనం శాంతికాముకులం. దేశంలో శాంతిని పెంచాలనే నిబధ్ధతతో ఉంటాం. కానీ అది దేశ గౌరవంతో రాజీ పడో, లేదా దేశ సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టో మాత్రం జరగదు. భారతదేశం నిరంతరం శాంతి పట్ల అంకితభావంతో, కట్టుబడి ఉంది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచయుధ్ధాలలోనూ మన దేశ సైనికులు ఒక లక్ష కంటే ఎక్కువమంది శాంతి కోసం స్వచ్ఛంద బలిదానాలను ఇచ్చారు. ఆ యుధ్ధాలతో మనకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ కూడా. మన దృష్టి ఎన్నడూ మనది కాని భూమిపై పడలేదు. ఇది శాంతి పట్ల మనకున్న నిబధ్ధత. కొన్ని రోజుల క్రితం సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఇజ్రాయిల్ లో హైఫా యుధ్ధం జరిగి వందేళ్ళు పూర్తయిన సందర్భంలో, మైసూర్, హైదరాబాద్, జోధ్పూర్ లకు చెందిన ఈటెగాళ్ళైన మన వీర సైనికులను జ్ఞాపకం చేసుకున్నాం. వారిపై దండెత్తి వచ్చినవారితో మన వీర సైనికులు పోరాడి హైఫా కు ముక్తిని ప్రసాదించారు. శాంతిబాటలో పయనించాలనే ఉద్దేశంతో మన దేశ సైనికులు చేసిన ఒక సాహసం అది. ఐక్య రాజ్య సమితికి చెందిన రకరకాల శాంతి భద్రతా దళాలకు అత్యధిక సంఖ్యలో సైనికులను పంపే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. దశాబ్దాలుగా మన వీర సైనికులు నీలి హెల్మెట్ ధరించి ప్రపంచంలో శాంతిని స్థాపించడంలో కీలక పాత్రను వహిస్తున్నారు.

నా ప్రియమైన దేశప్రజలారా, ఆకాశం కబుర్లు విచిత్రమైనవి. ఆకాశానికి కూడా తమ శక్తిని పరిచయం చేసిన మన వైమానిక దళం దేశప్రజలందరి దృష్టినీ తన వైపుకి ఆకర్షించుకుంది. మనకు రక్షణను అందిస్తుందనే నమ్మకాన్ని కుదిర్చింది. గణతంత్ర దినోత్సవ ఉత్సవ సమయంలో జరిగే పెరేడ్ లో  ఏ భాగం కోసం ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తారో, వాటిల్లో ఒకటి ఫ్లై పాస్ట్(fly past) . అందులో మన వైమానిక దళం ఆశ్చర్యకరమైన పనులతో తన శక్తిని ప్రదర్శిస్తుంది. అక్టోబర్ 8వ తేదీన మనం వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటాం. 1932లో ఆరుగురు పైలట్లు , 19 మంది సైనికులతో మొదలైన అతి చిన్న వైమానిక దళం పెరిగి పెద్దయ్యింది. ఇవాళ మన దళం ఇరవై ఒకటవ శతాబ్దంలోకెల్లా సాహసవంతమైన, శక్తివంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.  దేశం కోసం తమ సేవను అందించే ఈ వాయు యోధులకు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు. 
1947 లో పాకిస్తాన్ వారు ఆకస్మిక దాడి మొదలుపెట్టినప్పుడు, శ్రీనగర్ ను ఆక్రమణదారుల నుండి భారత                                                                                                                                                                                                                                                                            వైమానిక దళాలవారే రక్షించారు. భారతీయ సైనికులు, వారి సాధనాలు, యుధ్ధ సమయంలో సరిగ్గా సమయానికల్లా చేరేలా ఖచ్చితమైన ప్రణాళిక చేసింది మన వైమానిక దళాలవారే. 1965లో శత్రువుల మొహం పగిలేలా జవాబునిచ్చింది  కూడా మన వైమానిక దళమే. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం గురించి ఎవరికి తెలీదు? 1999 లో కార్గిల్ ను చొరబాటుదారుల వశం నుండి విడిపించడంలో కూడా వైమానిక దళం ముఖ్య పాత్రను వహించింది. టైగర్ హిల్స్ లో శత్రువుల స్థావరాలపై రాత్రింబవళ్ళూ బాంబుదాడి చేసి వారిని మట్టి కరిపించింది కూడా మన వైమానిక దళమే. సహాయ పునరావాసాలు అయినా, విపత్తు నిర్వహణ అయినా సరే మన వాయుసేనా యోధులు చేసే మెచ్చుకోలు పనుల వల్ల దేశానికి వారి పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంది. తుఫాను, గాలివాన, వరదలు నుండి అడవిలో కార్చిచ్చుల వరకూ ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ ఎదుర్కొని, దేశప్రజలకు సహాయం చెయ్యడంలో వారు చూపే తెగువ అద్భుతమైనది. దేశంలో gender equality అంటే స్త్రీ, పురుష సమానత్వాన్ని నిరూపించడంలో వైమానికదళం వారు ఒక ఉదాహరణగా నిలిచారు. ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని మన దేశ ఆడపడుచుల కోసం ఏర్పాటు చేసారు. ఇప్పుడైతే మన వైమానిక దళం స్త్రీల కోసం short service commission తో పాటూ permanent commissionను కూడా ప్రత్యామ్నాయంగా ఇస్తోంది. ఆగస్టు15 న ఎర్రకోట వేదిక నుండి నేను ఈ ప్రకటనను చేసాను. భారత సైన్యంలో సాయుధ బలగాలలో పురుష శక్తి తో పాటూ స్త్రీ శక్తి సహకారం కూడా సమానంగా ఉందని  ఇప్పుడు భారతదేశం గర్వంగా చెప్పగలదు. శక్తిస్వరూపమైన స్త్రీ ఇప్పుడు సాయుధురాలు కూడా అవుతోంది.

నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం మన నౌకా దళానికి చెందిన అభిలాష్ టోమీ అనే అధికారి తన జీవితం కోసం మృత్యువుతో పోరాటం చేశారు. యావత్ దేశం ఆయనను ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన పడింది. మీకు తెలుసు కదా అభిలాష్ టోమీ చాలా సాహసవంతుడైన అధికారి. ఏ రకమైన ఆధునిక సాంకేతికతనూ ఉపయోగించుకోకుండా, కేవలం ఒక చిన్న నావ సహాయంతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. దక్షిణ హిందూ మహా సముద్రంలో Golden Globe Raceలో పాల్గోవడానికి ఆయన గత ఎనభై రోజులుగా సముద్రంలో తన వేగాన్ని అదుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ భయంకరమైన సముద్రపు తుఫాను ఆయనకు ఇబ్బందులను తెచ్చింది. కానీ భారత నౌకా దళానికి చెందిన ఈ వీరుడు సముద్రంలో అనేక రోజుల పాటు పోరాడుతూ గడిపాడు. ఆ సముద్రపు నీటిలో తిండితిప్పలు లేకుండా నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు కానీ ఓటమిని ఒప్పుకోలేదు. సాహసం, సంకల్పబలం, పరాక్రమాలకు అతి పెద్ద ఉదాహరణ అతను. కొద్ది రోజుల క్రితం అతడిని సముద్రంలోంచి రక్షించి బయతకు తీసుకువచ్చిన తరువాత నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడాను. ఇంతకు మునుపు కూడా నేనతన్ని కలిసాను. ఇంతటి ఆపద నుండి బయటకు వచ్చిన తరువాత కూడా అతడిలోని ధైర్యం, పోరాట పటిమ, మరోసారి ఇటువంటి సాహసం చెయ్యాలనే కోరిక ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దేశ యువతకు ప్రేరణాత్మకమైనవి. అభిలాష్ టోమీ ఆరోగ్యం మెరుగవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన సాహసం, ఆయన పరాక్రమం, ఆయన సంకల్పబలం, పోరాట పటిమ, గెలవాలనే సంకల్పం మన దేశ యువతకు తప్పకుండా ప్రేరణను అందిస్తాయి.

నా ప్రియమైన దెశప్రజలారా, అక్టోబర్ రెండవ తేదీ మన దేశానికి ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అక్టోబర్ రెండుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి నుండీ మొదలుకొని ఒక రెండేళ్ళ వరకూ మనందరము మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా జరుపుకోబోతున్నాం. మహాత్మా గాంధీ ఆలోచనలు యావత్ ప్రపంచానికీ ప్రేరణను అందించాయి. Dr. Martin Luther King Junior , Nelson Mandela లాంటి గొప్ప నాయకులు కూడా తమ ప్రజలకు సమానత్వం, గౌరవం తాలూకూ హక్కులను అందించడానికి జరిపిన పోరాటాలకు మహాత్మా గాంధీ ఆలోచనల నుండి శక్తిని పొందినవారే. ఇవాళ్టి మన్ కీ బాత్ కార్యక్రమంలో నేను పూజ్య బాపూ జరిపిన మరొక ముఖ్యమైన పనిని గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను. దీని గురించి వీలయినంత ఎక్కువమంది దేశప్రజలందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. 1941లో గాంధీ గారు constructive programme అంటేరచనాత్మక కార్యక్రమ రూపంలో కొన్ని ఆలోచనలను రాయడం మొదలుపెట్టారు. తర్వాత 1945లో స్వతంత్ర పోరాటం ఊపందుకొన్నప్పుడు ఆయన తన ఆలోచనల సవరణా ప్రతి ని తయారుచేసారు. పూజ్య బాపూ రైతులు, పల్లెలు, శ్రామికుల అధికారాలను రక్షించడం కోసం, పరిశుభ్రత, విద్య లాంటి అనేక విషయాలపై తన ఆలోచనలను దేశప్రజల ముందర పెట్టారు. దానిని గాంధీ చార్టర్(Gandhi Charter) అని కూడా అంటారు. పూజ్య బాపు ప్రజా సంగ్రాహకుడు.  ప్రజలతో కలిసిపోవడం, వారిని తనతో కలుపుకోవడం అనేది బాపూ ప్రత్యేకత. అది ఆయన స్వభావం. ఇది ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకతగా అందరూ గుర్తించారు. ఇది దేశానికి ఎంతో అవసరమైన, ముఖ్యమైన ఆవస్యకత అని బాపూ అందరికీ అర్థమయ్యేలా చేశారు. స్వతంత్ర పోరాటం జరిగిన సమయంలో ఆయన వహించిన ముఖ్య పాత్ర ఏమిటంటే ఆ పోరాటాన్ని ఒక ప్రజా-ఉద్యమంగా మార్చడం. మహాత్మా గాంధీ గారి ఆహ్వానంపై సమాజంలోని ప్రతి వర్గానికీ, ప్రతి ప్రాంతానికీ సంబంధించిన ప్రజలందరూ కూడా స్వతంత్ర పోరాట ఉద్యమానికి తమను తాము అంకితం చేసుకున్నారు. బాపు మనందరికీ ఒక ప్రేరణాత్మక మంత్రాన్ని ఇచ్చారు. అది గాంధీగారి తాయత్తు అనే పేరుతో పసిధ్ధి చెందింది.అందులో గాంధీ గారు ఏం చెప్పారంటే, "నేను మీ అందరికీ ఒక తాయొత్తు ని ఇస్తాను. మీకు ఎప్పుడైనా ఏదైనా సందేహం కలిగినా, లేదా మీ అహం మీపై అధికారాన్ని చూపెట్టినా సరే ఒక పరీక్షను పెట్టుకోండి. మీరు చూసిన వ్యక్తుల్లో అతి పేద, బలహీన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతడి మొహాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వేయబోయే అడుగు ఆ వ్యక్తికి ఎలాంటి సహాయాన్ని అందించగలదు? అని ఆలోచించండి . ఆ పేద వ్యక్తికి నా నిర్ణయం సహాయపడగలదా? దానివల్ల అతడికి ఏదైనా లాభం చేకూరగలదా? దీనివల్ల అతడు తన జీవితమ్లో ఏవైనా మార్పులు చేసుకోగలడా? నా నిర్ణయం వల్ల ఆకలితో అలమటిస్తున్న కోట్ల కొద్దీ ప్రజల ఆకలి తీరగలదా? వారి ఆత్మ సంతృప్తి చెందగలదా? అని ప్రశ్నించుకోండి. అప్పుడు నీ సందేహ నివృత్తి జరుగుతున్నట్లు, నీ అహం కరిగిపోతున్నట్లు నీకు అనిపిస్తుంది" అని చెప్పారు బాపూ.

నా ప్రియమైన దేశప్రజలారా, గాంధీ గారు చెప్పిన ఈ మంత్రం ఇప్పటికీ ముఖ్యమైనదే. నేడు దేశంలో  మధ్యవర్గం పెరుగుతోంది, వారి ఆర్థిక శక్తి పెరుగుతోంది, కొనుగోలు శక్తి పెరుగుతోంది. మనం ఏదన్న కొనేందుకు వెళ్ళినప్పుడు ఒక్క క్షణం పూజ్య బాపూ ని గుర్తు చేసుకుని, ఆయన చెప్పిన ఈ మంత్రాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ వస్తువు కొనుగోలు చెయ్యడం వల్ల నేను దేశంలో ఏ పౌరుడికి లాభం ఇస్తున్నాను?ఎవరి మొహంలో సంతోషాన్ని వెలిగిస్తున్నాను? నా కొనుగోలు వల్ల ఎవరికి నేరుగా కానీ పరోక్షంగా గానీ లాభం కలగబోతోంది? దీని వల్ల నిరుపేద వ్యక్తికి లాభం కలిగితే నా కొనుగోలు వల్ల నేను చాలా సంతోషాన్ని పొందుతాను. భవిష్యత్తులో మీ ప్రతి కొనుగోలు ముందరా,  గాంధీ గారు చెప్పిన ఈ మంత్రాన్ని గనుక మీరు గుర్తు ఉంచుకోవాలి. గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఇది గనుక గుర్తు పెట్టుకుంటే మన కొనుగొలు వల్ల ఎవరో ఒక నిరుపేదకు ఉపయోగం కలుగుతుంది, అతడు చిందించిన చమటకు, పడిన కష్టానికీ, అతడి పెట్టుబడి పెట్టిన ప్రతిభకూ అన్నింటికీ ఏదో ఒక లాభం చేకూరుతుంది అని ఆలోచించాలి. ఇదే గాంధీ గారి తాయత్తు. ఇదే ఆయన సందేశం. అందరి కంటే పేదవాడు, బలహీనుడు అయిన వ్యక్తి జీవితంలో మీరు వేసే అడుగు వల్ల గొప్ప మార్పు రాగలదు అని నాకు నమ్మకం ఉంది.

నా ప్రియమైన దేశప్రజలారా, పరిశుభ్రత పాటిస్తే స్వాతంత్ర్యం లభిస్తుంది అని గాంధీగారు చెప్పారు. ఎలాగో ఆయనకూ తెలిసి ఉండదు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలానే ఇవాళ మీరు చేసే ఈ చిన్న పని వల్ల కూడా నా దేశ ఆర్థిక అభివృధ్ధి, ఆర్థిక సాధికారత, పేదవాడికి పేదరికంతో పోరాడే శక్తిని ఇవ్వడానికి నా సహకారం ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. కానీ నేటి యుగంలో ఇదే నిజమైన దేశభక్తి, ఇదే గాంధీ గారికి మనం ఇచ్చే కార్యాంజలి. ఉదాహరణకి, ప్రత్యేక సందర్భాల్లో ఖాదీ, చేనేత ఉత్పాదక కొనుగోళ్ళ వల్ల అనేకమంది చేనేత కర్మికులకి సహాయాన్ని అందించినవాళ్ళమౌతాము. లాల్ బహదూర్ శాస్త్రి గారు పాతబడిన, చిరిగిన చేనేత వస్త్రాలను కూడా దాచిపెట్టి వాడుకునేవారట. అందులో ఎవరి కష్టం ఉందో కదా అనే ఆలోచనతో అలా చేసేవారుట. ఈ ఖాదీ వస్త్రాలన్నీ కూడా ఎంతో కష్టపడితే గాని తయారవ్వవు, వీటి ఒక్కొక్క దారం ఉపయోగపడాలి అనేవారుట. దేశం పట్ల అభిమానం, దేశప్రజల పట్ల ప్రేమ కనబడే ఇటువంటి గొప్ప భావనలు అతి చిన్న అడుగులు వేసే ఆ మహామనీషి నరనరాల్లోనూ నిండి ఉన్నాయి. రెండు రోజుల్లో పూజ్య బాపు తో పాటూ మనం శాస్త్రి గారి జయంతిని కూడా జరుపుకోబోతున్నాం. శాస్త్రి గారి పేరు వినగానే మన భారతీయుల మనసుల్లో ఒక అనంతమైన భక్తిశ్రధ్ధలు ఎగసిపడతాయి. వారి సౌమ్య వ్యక్తిత్వం ప్రతి పౌరుడినీ ఎప్పటికీ గర్వంతో  నింపేస్తుంది.

బయట నుంచి అతి వినమ్రంగా కనబడి, లోపలి నుండి మాత్రం పర్వతం లాంటి ధృఢ నిశ్చయం కలిగి ఉండేవారు  లాల్ బహదూర్ శాస్త్రి గారు. "జయ్ జవాన్ జయ్ కిసాన్" అన్న నినాదం శాస్త్రి గారి గొప్ప వ్యక్తిత్వానికి ఒక చక్కని నిదర్శనం. ఏదాదిన్నర కాలం పాటు సాగిన ఆయన సంక్షిప్త పదవీ కాలంలో, ఆయన దేశ సైనికులకు, రైతులకు విజయశిఖరాలను అందుకునే మంత్రం ఇచ్చారు. ఇది దేశం పట్ల ఆయనకు ఉన్న నిస్వార్థ ప్రేమకు నిదర్శనం.

నా ప్రియమైన దేశప్రజలారా, ఇవాళ మనం పూజ్యులైన బాపుని గుర్తు చేసుకుంటున్నప్పుడు పరిశుభ్రత గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణమే. సెప్టెంబర్ పదిహేను నుండీ "పరిశుభ్రతే సేవ" అనే ఒక ఉద్యమం మొదలైంది. కోట్ల కొద్దీ ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నాకు కూడా ఢిల్లీలోని అంబేద్కర్ పాఠశాల లో పిల్లలతో పరిశుభ్రత శ్రమదానం చేసే అవకాశం లభించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఆ పాఠశాలకు పునాది వేశారుట. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలూ ఈ సెప్టెంబర్ పదిహేను వ తేదీన జరిగిన శ్రమదానంలో పాల్గొన్నారు. అనేక సంస్థలు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నాయి. స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, యువజన సంఘాలు, మీడియా గ్రూపులు, కార్పరేట్ ప్రపంచంలోనివారందరూ కూడా పెద్ద ఎత్తున పరిశుభ్రతకై శ్రమదానం చేశారు. ఇందుమూలంగా ఈ పరిశుభ్రతా ప్రేమికులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుయచేస్తున్నాను. రండి ఒక ఫోన్ కాల్ విందాం –
"నమస్కారం! నా పేరు షైతాన్ సింగ్. పూగల్ తాలూకా, బికనేర్ జిల్లా, రాజస్థాన్ నుండి మాట్లాడుతున్నాను. నేనొక అంధుడిని. నా రెండు కళ్ళు కనబడవు. నేను పూర్తి గుడ్డివాడిని. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ’మన్ కీ బాత్ కార్యక్రమం’ ద్వారా మోదీ గారు చేపట్టిన పరిశుభ్ర భారతదేశాన్ని తయారుచేసే పని చాలా గొప్పది. నాలాంటి అంధులు మరుగుదొడ్ల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే  మరుగుదొడ్ల నిర్మాణం జరిగడం వల్ల మాకు చాలా ఉపయోగం జరిగింది. ఇది చాలా గొప్ప అడుగు. ఈ పని ఇలానే ముందుకు సాగాలి"

అనేకానేక ధన్యవాదాలు.  మీరు చాలా మంచి మాట చెప్పారు. ప్రతివారి జీవితంలోనూ పరిశుభ్రతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వచ్ఛ భారత ఉద్యమం ద్వారా మీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మణం జరిగడం వల్ల అది మీకు బాగా ఉపయోగపడుతోంది. ఇంతకు మించిన ఆనందం మా అందరికీ ఇంకేముంటుంది? మీకు కనబడదు కాబట్టి చూడలేకపోతున్నారు కానీ ఈ ఉద్యమం ద్వారా కలిగిన ప్రయోజనం ఇందులో పాల్గొన్న వారికి కూడా అంచనా ఉండి ఉండదు . మరుగుదొడ్డి నిర్మాణం జరగక ముందు మీరెన్ని  ఇబ్బందులతో జీవితాన్ని గడిపేవారో, మరుగుదొడ్డి నిర్మాణం జరిగిన తర్వాత అది మీ పాలిట ఎలా వరంగా మారిందో అన్న విషయం మీరు ఫోన్ చేయకపోయి ఉంటే మాకు తెలిసేది కాదు. పరిశుభ్రతా ఉద్యమంలో పాలుపంచుకున్నవారందరి దృష్టికీ ఈ సున్నితమైన అంశం వచ్చేది కాదు. మీ ఫోన్ కాల్ కి గానూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, "స్వఛ్ఛ భారత్ మిషన్" కేవలం మన దేశం లోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక విజయవంతమైన కథ అయ్యింది. దీని గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. చరిత్రలో నిలిచిపోయేలాంటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పరిశుభ్రతా సదస్సు ని ఈసారి భారతదేశం నిర్వహించబోతోంది.  ‘Mahatma Gandhi International Sanitation Convention’ అంటే "మహాత్మా గాంధీ అంతర్జాతీయ పరిశుభ్రతా సదస్సు" ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుభ్రతా మంత్రులు, ఈ రంగంలోని నిపుణులు ఒకటిగా వచ్చి ఈ పరిశుభ్రతా సదస్సులో తమతమ ప్రయోగాలు, అనుభవాలు పంచుకుంటారు.  2018 అక్టోబర్ రెండవ తేదీన బాపూ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం తో పాటూ ఈ ‘Mahatma Gandhi International Sanitation Convention’ పూర్తవుతుంది. 

నా ప్రియమైన దేశప్రజలారా, సంస్కృతంలో ఒక మాట ఉంది – "న్యాయమూలం స్వరాజ్యం స్యాత్". అంటే స్వరాజ్య మూలంలోనే న్యాయం ఉంటుంది. న్యాయాన్ని గురించిన చర్చ జరిగినప్పుడు మానవ అధికారాల భావంలోనే పూర్తిగా అది అంతర్గతమై ఉంటుంది. శోషిత,పీడిత, వంచిత ప్రజలకు స్వతంత్రం, శాంతి, న్యాయం అందించాలంటే, అది ప్రత్యేకంగా అనివార్యమైన సంగతి. బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా నిర్మితమైన రాజ్యాంగంలో పేదల ప్రాధమిక హక్కుల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. వాటి దృష్టితో ప్రేరణ పొంది, 1993 అక్టోబర్ 12, న "జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే "‘National Human Rights Commission’ (NHRC)  స్థాపించబడింది. కొద్ది రోజుల్లో NHRC పాతికేళ్ళు పూర్తిచేసుకోబోతోంది. NHRC  కేవలం మానవ హక్కులను మాత్రమే రక్షించలేదు. మనవత గౌరవాన్ని కూడా పెంచే పని చేసింది ఈ కమీషన్. మన మాజీ ప్రధానీ, మన ప్రాణ ప్రియ నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయ్ గారు స్పష్టంగా చెప్పారు – మానవ హక్కులనేవి మనకి పరాయివేమీ కాదు. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ చిహ్నాంలో వైదిక కాలం నాటి ఆదర్శ సూత్రం "సర్వే భవంతు సుఖిన:" అంకితమై ఉంది. మానవ హక్కుల కోసం NHRC   విస్తృతమైన అవగాహనని కల్పించింది. దానితో పాటూ ఇందులో ఆ హక్కుల దురుపయోగాన్ని అడ్డుకునేందుకు కూడా మెచ్చుకోదగ్గ పాత్రను వహించింది. పాతికేళ్ల ఈ ప్రయాణంలో దేశప్రజల్లో NHRC   ఒక ఆశనీ, ఒక నమ్మకపు వాతావరణాన్నీ ఏర్పరిచింది. ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం , ఉత్తమ ప్రజాస్వామ్య విలువల కోసం ఇదొక పెద్ద ఆశాపూర్వకమైన ఘటన అని నా నమ్మకం. ఇవాళ జాతీయ స్థాయిలో మానవ హక్కుల పనితో పాటూ ఇరవై ఆరు దేశాల మానవ హక్కుల కమిషన్ కూడా స్థాపించబడింది. ఒక సమాజ రూపంలో మానవ హక్కులను అర్థం చేసుకుని, ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాల్సి ఉంది. ఇదే "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్" – ’అందరి సహకారంతో -అందరికీ అభివృధ్ధి ’ అనే ఆలోచనకి ఆధారం.

నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్ నెలలో జయ ప్రకాశ్ నారాయణ్ గారి జయంతి ఉంది. ఇదే నెలలో రాజమాత విజయరాజే సింధియా గారి శతాబ్ది జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ మహా పురుషులందరూ మనకి ప్రేరణాత్మకమైనవారు.  వారికి నా నమస్సులు. అక్టోబర్ 31 వ తేదీన సర్దార్ సాహెబ్ జయంతి ఉంది. వీరి గురించి రాబోయే మన్ కీ బాత్ లో నేను వివరంగా చెప్తాను కానీ ఇవాళ మాత్రం నేను తప్పకుండా ఈ ప్రస్తావన చెయ్యలనుకున్నాను. గత కొన్నేళ్ళ నుండీ సర్దార్ సాహెబ్ జయంతి అయిన అక్టోబర్ 31 నాడు "రన్ ఫర్ యూనిటీ" అని భారతదేశంలో ప్రతి చిన్న- పెద్ద పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో "రన్ ఫర్ యూనిటీ" ఏర్పాటుచేయడం జరుగుతోంది. ఈసారి కూడా మనం ప్రయత్నపూర్వకంగా ప్రతి చిన్న- పెద్ద పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో ఈ "రన్ ఫర్ యూనిటీ"ని ఏర్పాటుచేద్దాం. "రన్ ఫర్ యూనిటీ" అనే కార్యక్రమం సర్దార్ సాహెబ్ ను గుర్తుచేసుకుందుకు ఉత్తమ మార్గం. ఎందుకంటే ఈయన జీవితమంతా భారతదేశ సమైక్యత కోసం పాటుపడ్డారు. అక్టోబర్ 31 న "రన్ ఫర్ యూనిటీ" ద్వారా సమాజంలో ప్రతి వర్గాన్నీ, దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ సమైక్యతాభావంతో ముడిపెట్టేందుకు మనం చేసే ప్రయత్నాలన్నింటికీ మనం బలాన్నిద్దాం. ఇదే ఆయనకు మనం ఇచ్చే చక్కని శ్రధ్ధాంజలి.

నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి , దుర్గా పూజ లేదా విజయదశమి ఏ పేరైనా ఈ పవిత్ర పండుగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Media Coverage

"Huge opportunity": Japan delegation meets PM Modi, expressing their eagerness to invest in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM Modi in TV9 Summit
March 28, 2025
QuoteToday, the world's eyes are on India: PM
QuoteIndia's youth is rapidly becoming skilled and driving innovation forward: PM
Quote"India First" has become the mantra of India's foreign policy: PM
QuoteToday, India is not just participating in the world order but also contributing to shaping and securing the future: PM
QuoteIndia has given Priority to humanity over monopoly: PM
QuoteToday, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM

श्रीमान रामेश्वर गारु जी, रामू जी, बरुन दास जी, TV9 की पूरी टीम, मैं आपके नेटवर्क के सभी दर्शकों का, यहां उपस्थित सभी महानुभावों का अभिनंदन करता हूं, इस समिट के लिए बधाई देता हूं।

TV9 नेटवर्क का विशाल रीजनल ऑडियंस है। और अब तो TV9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है। इस समिट में अनेक देशों से इंडियन डायस्पोरा के लोग विशेष तौर पर लाइव जुड़े हुए हैं। कई देशों के लोगों को मैं यहां से देख भी रहा हूं, वे लोग वहां से वेव कर रहे हैं, हो सकता है, मैं सभी को शुभकामनाएं देता हूं। मैं यहां नीचे स्क्रीन पर हिंदुस्तान के अनेक शहरों में बैठे हुए सब दर्शकों को भी उतने ही उत्साह, उमंग से देख रहा हूं, मेरी तरफ से उनका भी स्वागत है।

साथियों,

आज विश्व की दृष्टि भारत पर है, हमारे देश पर है। दुनिया में आप किसी भी देश में जाएं, वहां के लोग भारत को लेकर एक नई जिज्ञासा से भरे हुए हैं। आखिर ऐसा क्या हुआ कि जो देश 70 साल में ग्यारहवें नंबर की इकोनॉमी बना, वो महज 7-8 साल में पांचवे नंबर की इकोनॉमी बन गया? अभी IMF के नए आंकड़े सामने आए हैं। वो आंकड़े कहते हैं कि भारत, दुनिया की एकमात्र मेजर इकोनॉमी है, जिसने 10 वर्षों में अपने GDP को डबल किया है। बीते दशक में भारत ने दो लाख करोड़ डॉलर, अपनी इकोनॉमी में जोड़े हैं। GDP का डबल होना सिर्फ आंकड़ों का बदलना मात्र नहीं है। इसका impact देखिए, 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं, और ये 25 करोड़ लोग एक नियो मिडिल क्लास का हिस्सा बने हैं। ये नियो मिडिल क्लास, एक प्रकार से नई ज़िंदगी शुरु कर रहा है। ये नए सपनों के साथ आगे बढ़ रहा है, हमारी इकोनॉमी में कंट्रीब्यूट कर रहा है, और उसको वाइब्रेंट बना रहा है। आज दुनिया की सबसे बड़ी युवा आबादी हमारे भारत में है। ये युवा, तेज़ी से स्किल्ड हो रहा है, इनोवेशन को गति दे रहा है। और इन सबके बीच, भारत की फॉरेन पॉलिसी का मंत्र बन गया है- India First, एक जमाने में भारत की पॉलिसी थी, सबसे समान रूप से दूरी बनाकर चलो, Equi-Distance की पॉलिसी, आज के भारत की पॉलिसी है, सबके समान रूप से करीब होकर चलो, Equi-Closeness की पॉलिसी। दुनिया के देश भारत की ओपिनियन को, भारत के इनोवेशन को, भारत के एफर्ट्स को, जैसा महत्व आज दे रहे हैं, वैसा पहले कभी नहीं हुआ। आज दुनिया की नजर भारत पर है, आज दुनिया जानना चाहती है, What India Thinks Today.

|

साथियों,

भारत आज, वर्ल्ड ऑर्डर में सिर्फ पार्टिसिपेट ही नहीं कर रहा, बल्कि फ्यूचर को शेप और सेक्योर करने में योगदान दे रहा है। दुनिया ने ये कोरोना काल में अच्छे से अनुभव किया है। दुनिया को लगता था कि हर भारतीय तक वैक्सीन पहुंचने में ही, कई-कई साल लग जाएंगे। लेकिन भारत ने हर आशंका को गलत साबित किया। हमने अपनी वैक्सीन बनाई, हमने अपने नागरिकों का तेज़ी से वैक्सीनेशन कराया, और दुनिया के 150 से अधिक देशों तक दवाएं और वैक्सीन्स भी पहुंचाईं। आज दुनिया, और जब दुनिया संकट में थी, तब भारत की ये भावना दुनिया के कोने-कोने तक पहुंची कि हमारे संस्कार क्या हैं, हमारा तौर-तरीका क्या है।

साथियों,

अतीत में दुनिया ने देखा है कि दूसरे विश्व युद्ध के बाद जब भी कोई वैश्विक संगठन बना, उसमें कुछ देशों की ही मोनोपोली रही। भारत ने मोनोपोली नहीं बल्कि मानवता को सर्वोपरि रखा। भारत ने, 21वीं सदी के ग्लोबल इंस्टीट्यूशन्स के गठन का रास्ता बनाया, और हमने ये ध्यान रखा कि सबकी भागीदारी हो, सबका योगदान हो। जैसे प्राकृतिक आपदाओं की चुनौती है। देश कोई भी हो, इन आपदाओं से इंफ्रास्ट्रक्चर को भारी नुकसान होता है। आज ही म्यांमार में जो भूकंप आया है, आप टीवी पर देखें तो बहुत बड़ी-बड़ी इमारतें ध्वस्त हो रही हैं, ब्रिज टूट रहे हैं। और इसलिए भारत ने Coalition for Disaster Resilient Infrastructure - CDRI नाम से एक वैश्विक नया संगठन बनाने की पहल की। ये सिर्फ एक संगठन नहीं, बल्कि दुनिया को प्राकृतिक आपदाओं के लिए तैयार करने का संकल्प है। भारत का प्रयास है, प्राकृतिक आपदा से, पुल, सड़कें, बिल्डिंग्स, पावर ग्रिड, ऐसा हर इंफ्रास्ट्रक्चर सुरक्षित रहे, सुरक्षित निर्माण हो।

साथियों,

भविष्य की चुनौतियों से निपटने के लिए हर देश का मिलकर काम करना बहुत जरूरी है। ऐसी ही एक चुनौती है, हमारे एनर्जी रिसोर्सेस की। इसलिए पूरी दुनिया की चिंता करते हुए भारत ने International Solar Alliance (ISA) का समाधान दिया है। ताकि छोटे से छोटा देश भी सस्टेनबल एनर्जी का लाभ उठा सके। इससे क्लाइमेट पर तो पॉजिटिव असर होगा ही, ये ग्लोबल साउथ के देशों की एनर्जी नीड्स को भी सिक्योर करेगा। और आप सबको ये जानकर गर्व होगा कि भारत के इस प्रयास के साथ, आज दुनिया के सौ से अधिक देश जुड़ चुके हैं।

साथियों,

बीते कुछ समय से दुनिया, ग्लोबल ट्रेड में असंतुलन और लॉजिस्टिक्स से जुड़ी challenges का सामना कर रही है। इन चुनौतियों से निपटने के लिए भी भारत ने दुनिया के साथ मिलकर नए प्रयास शुरु किए हैं। India–Middle East–Europe Economic Corridor (IMEC), ऐसा ही एक महत्वाकांक्षी प्रोजेक्ट है। ये प्रोजेक्ट, कॉमर्स और कनेक्टिविटी के माध्यम से एशिया, यूरोप और मिडिल ईस्ट को जोड़ेगा। इससे आर्थिक संभावनाएं तो बढ़ेंगी ही, दुनिया को अल्टरनेटिव ट्रेड रूट्स भी मिलेंगे। इससे ग्लोबल सप्लाई चेन भी और मजबूत होगी।

|

साथियों,

ग्लोबल सिस्टम्स को, अधिक पार्टिसिपेटिव, अधिक डेमोक्रेटिक बनाने के लिए भी भारत ने अनेक कदम उठाए हैं। और यहीं, यहीं पर ही भारत मंडपम में जी-20 समिट हुई थी। उसमें अफ्रीकन यूनियन को जी-20 का परमानेंट मेंबर बनाया गया है। ये बहुत बड़ा ऐतिहासिक कदम था। इसकी मांग लंबे समय से हो रही थी, जो भारत की प्रेसीडेंसी में पूरी हुई। आज ग्लोबल डिसीजन मेकिंग इंस्टीट्यूशन्स में भारत, ग्लोबल साउथ के देशों की आवाज़ बन रहा है। International Yoga Day, WHO का ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, आर्टिफिशियल इंटेलीजेंस के लिए ग्लोबल फ्रेमवर्क, ऐसे कितने ही क्षेत्रों में भारत के प्रयासों ने नए वर्ल्ड ऑर्डर में अपनी मजबूत उपस्थिति दर्ज कराई है, और ये तो अभी शुरूआत है, ग्लोबल प्लेटफॉर्म पर भारत का सामर्थ्य नई ऊंचाई की तरफ बढ़ रहा है।

साथियों,

21वीं सदी के 25 साल बीत चुके हैं। इन 25 सालों में 11 साल हमारी सरकार ने देश की सेवा की है। और जब हम What India Thinks Today उससे जुड़ा सवाल उठाते हैं, तो हमें ये भी देखना होगा कि Past में क्या सवाल थे, क्या जवाब थे। इससे TV9 के विशाल दर्शक समूह को भी अंदाजा होगा कि कैसे हम, निर्भरता से आत्मनिर्भरता तक, Aspirations से Achievement तक, Desperation से Development तक पहुंचे हैं। आप याद करिए, एक दशक पहले, गांव में जब टॉयलेट का सवाल आता था, तो माताओं-बहनों के पास रात ढलने के बाद और भोर होने से पहले का ही जवाब होता था। आज उसी सवाल का जवाब स्वच्छ भारत मिशन से मिलता है। 2013 में जब कोई इलाज की बात करता था, तो महंगे इलाज की चर्चा होती थी। आज उसी सवाल का समाधान आयुष्मान भारत में नजर आता है। 2013 में किसी गरीब की रसोई की बात होती थी, तो धुएं की तस्वीर सामने आती थी। आज उसी समस्या का समाधान उज्ज्वला योजना में दिखता है। 2013 में महिलाओं से बैंक खाते के बारे में पूछा जाता था, तो वो चुप्पी साध लेती थीं। आज जनधन योजना के कारण, 30 करोड़ से ज्यादा बहनों का अपना बैंक अकाउंट है। 2013 में पीने के पानी के लिए कुएं और तालाबों तक जाने की मजबूरी थी। आज उसी मजबूरी का हल हर घर नल से जल योजना में मिल रहा है। यानि सिर्फ दशक नहीं बदला, बल्कि लोगों की ज़िंदगी बदली है। और दुनिया भी इस बात को नोट कर रही है, भारत के डेवलपमेंट मॉडल को स्वीकार रही है। आज भारत सिर्फ Nation of Dreams नहीं, बल्कि Nation That Delivers भी है।

साथियों,

जब कोई देश, अपने नागरिकों की सुविधा और समय को महत्व देता है, तब उस देश का समय भी बदलता है। यही आज हम भारत में अनुभव कर रहे हैं। मैं आपको एक उदाहरण देता हूं। पहले पासपोर्ट बनवाना कितना बड़ा काम था, ये आप जानते हैं। लंबी वेटिंग, बहुत सारे कॉम्प्लेक्स डॉक्यूमेंटेशन का प्रोसेस, अक्सर राज्यों की राजधानी में ही पासपोर्ट केंद्र होते थे, छोटे शहरों के लोगों को पासपोर्ट बनवाना होता था, तो वो एक-दो दिन कहीं ठहरने का इंतजाम करके चलते थे, अब वो हालात पूरी तरह बदल गया है, एक आंकड़े पर आप ध्यान दीजिए, पहले देश में सिर्फ 77 पासपोर्ट सेवा केंद्र थे, आज इनकी संख्या 550 से ज्यादा हो गई है। पहले पासपोर्ट बनवाने में, और मैं 2013 के पहले की बात कर रहा हूं, मैं पिछले शताब्दी की बात नहीं कर रहा हूं, पासपोर्ट बनवाने में जो वेटिंग टाइम 50 दिन तक होता था, वो अब 5-6 दिन तक सिमट गया है।

साथियों,

ऐसा ही ट्रांसफॉर्मेशन हमने बैंकिंग इंफ्रास्ट्रक्चर में भी देखा है। हमारे देश में 50-60 साल पहले बैंकों का नेशनलाइजेशन किया गया, ये कहकर कि इससे लोगों को बैंकिंग सुविधा सुलभ होगी। इस दावे की सच्चाई हम जानते हैं। हालत ये थी कि लाखों गांवों में बैंकिंग की कोई सुविधा ही नहीं थी। हमने इस स्थिति को भी बदला है। ऑनलाइन बैंकिंग तो हर घर में पहुंचाई है, आज देश के हर 5 किलोमीटर के दायरे में कोई न कोई बैंकिंग टच प्वाइंट जरूर है। और हमने सिर्फ बैंकिंग इंफ्रास्ट्रक्चर का ही दायरा नहीं बढ़ाया, बल्कि बैंकिंग सिस्टम को भी मजबूत किया। आज बैंकों का NPA बहुत कम हो गया है। आज बैंकों का प्रॉफिट, एक लाख 40 हज़ार करोड़ रुपए के नए रिकॉर्ड को पार कर चुका है। और इतना ही नहीं, जिन लोगों ने जनता को लूटा है, उनको भी अब लूटा हुआ धन लौटाना पड़ रहा है। जिस ED को दिन-रात गालियां दी जा रही है, ED ने 22 हज़ार करोड़ रुपए से अधिक वसूले हैं। ये पैसा, कानूनी तरीके से उन पीड़ितों तक वापिस पहुंचाया जा रहा है, जिनसे ये पैसा लूटा गया था।

साथियों,

Efficiency से गवर्नमेंट Effective होती है। कम समय में ज्यादा काम हो, कम रिसोर्सेज़ में अधिक काम हो, फिजूलखर्ची ना हो, रेड टेप के बजाय रेड कार्पेट पर बल हो, जब कोई सरकार ये करती है, तो समझिए कि वो देश के संसाधनों को रिस्पेक्ट दे रही है। और पिछले 11 साल से ये हमारी सरकार की बड़ी प्राथमिकता रहा है। मैं कुछ उदाहरणों के साथ अपनी बात बताऊंगा।

|

साथियों,

अतीत में हमने देखा है कि सरकारें कैसे ज्यादा से ज्यादा लोगों को मिनिस्ट्रीज में accommodate करने की कोशिश करती थीं। लेकिन हमारी सरकार ने अपने पहले कार्यकाल में ही कई मंत्रालयों का विलय कर दिया। आप सोचिए, Urban Development अलग मंत्रालय था और Housing and Urban Poverty Alleviation अलग मंत्रालय था, हमने दोनों को मर्ज करके Housing and Urban Affairs मंत्रालय बना दिया। इसी तरह, मिनिस्ट्री ऑफ ओवरसीज़ अफेयर्स अलग था, विदेश मंत्रालय अलग था, हमने इन दोनों को भी एक साथ जोड़ दिया, पहले जल संसाधन, नदी विकास मंत्रालय अलग था, और पेयजल मंत्रालय अलग था, हमने इन्हें भी जोड़कर जलशक्ति मंत्रालय बना दिया। हमने राजनीतिक मजबूरी के बजाय, देश की priorities और देश के resources को आगे रखा।

साथियों,

हमारी सरकार ने रूल्स और रेगुलेशन्स को भी कम किया, उन्हें आसान बनाया। करीब 1500 ऐसे कानून थे, जो समय के साथ अपना महत्व खो चुके थे। उनको हमारी सरकार ने खत्म किया। करीब 40 हज़ार, compliances को हटाया गया। ऐसे कदमों से दो फायदे हुए, एक तो जनता को harassment से मुक्ति मिली, और दूसरा, सरकारी मशीनरी की एनर्जी भी बची। एक और Example GST का है। 30 से ज्यादा टैक्सेज़ को मिलाकर एक टैक्स बना दिया गया है। इसको process के, documentation के हिसाब से देखें तो कितनी बड़ी बचत हुई है।

साथियों,

सरकारी खरीद में पहले कितनी फिजूलखर्ची होती थी, कितना करप्शन होता था, ये मीडिया के आप लोग आए दिन रिपोर्ट करते थे। हमने, GeM यानि गवर्नमेंट ई-मार्केटप्लेस प्लेटफॉर्म बनाया। अब सरकारी डिपार्टमेंट, इस प्लेटफॉर्म पर अपनी जरूरतें बताते हैं, इसी पर वेंडर बोली लगाते हैं और फिर ऑर्डर दिया जाता है। इसके कारण, भ्रष्टाचार की गुंजाइश कम हुई है, और सरकार को एक लाख करोड़ रुपए से अधिक की बचत भी हुई है। डायरेक्ट बेनिफिट ट्रांसफर- DBT की जो व्यवस्था भारत ने बनाई है, उसकी तो दुनिया में चर्चा है। DBT की वजह से टैक्स पेयर्स के 3 लाख करोड़ रुपए से ज्यादा, गलत हाथों में जाने से बचे हैं। 10 करोड़ से ज्यादा फर्ज़ी लाभार्थी, जिनका जन्म भी नहीं हुआ था, जो सरकारी योजनाओं का फायदा ले रहे थे, ऐसे फर्जी नामों को भी हमने कागजों से हटाया है।

साथियों,

 

हमारी सरकार टैक्स की पाई-पाई का ईमानदारी से उपयोग करती है, और टैक्सपेयर का भी सम्मान करती है, सरकार ने टैक्स सिस्टम को टैक्सपेयर फ्रेंडली बनाया है। आज ITR फाइलिंग का प्रोसेस पहले से कहीं ज्यादा सरल और तेज़ है। पहले सीए की मदद के बिना, ITR फाइल करना मुश्किल होता था। आज आप कुछ ही समय के भीतर खुद ही ऑनलाइन ITR फाइल कर पा रहे हैं। और रिटर्न फाइल करने के कुछ ही दिनों में रिफंड आपके अकाउंट में भी आ जाता है। फेसलेस असेसमेंट स्कीम भी टैक्सपेयर्स को परेशानियों से बचा रही है। गवर्नेंस में efficiency से जुड़े ऐसे अनेक रिफॉर्म्स ने दुनिया को एक नया गवर्नेंस मॉडल दिया है।

साथियों,

पिछले 10-11 साल में भारत हर सेक्टर में बदला है, हर क्षेत्र में आगे बढ़ा है। और एक बड़ा बदलाव सोच का आया है। आज़ादी के बाद के अनेक दशकों तक, भारत में ऐसी सोच को बढ़ावा दिया गया, जिसमें सिर्फ विदेशी को ही बेहतर माना गया। दुकान में भी कुछ खरीदने जाओ, तो दुकानदार के पहले बोल यही होते थे – भाई साहब लीजिए ना, ये तो इंपोर्टेड है ! आज स्थिति बदल गई है। आज लोग सामने से पूछते हैं- भाई, मेड इन इंडिया है या नहीं है?

साथियों,

आज हम भारत की मैन्युफैक्चरिंग एक्सीलेंस का एक नया रूप देख रहे हैं। अभी 3-4 दिन पहले ही एक न्यूज आई है कि भारत ने अपनी पहली MRI मशीन बना ली है। अब सोचिए, इतने दशकों तक हमारे यहां स्वदेशी MRI मशीन ही नहीं थी। अब मेड इन इंडिया MRI मशीन होगी तो जांच की कीमत भी बहुत कम हो जाएगी।

|

साथियों,

आत्मनिर्भर भारत और मेक इन इंडिया अभियान ने, देश के मैन्युफैक्चरिंग सेक्टर को एक नई ऊर्जा दी है। पहले दुनिया भारत को ग्लोबल मार्केट कहती थी, आज वही दुनिया, भारत को एक बड़े Manufacturing Hub के रूप में देख रही है। ये सक्सेस कितनी बड़ी है, इसके उदाहरण आपको हर सेक्टर में मिलेंगे। जैसे हमारी मोबाइल फोन इंडस्ट्री है। 2014-15 में हमारा एक्सपोर्ट, वन बिलियन डॉलर तक भी नहीं था। लेकिन एक दशक में, हम ट्वेंटी बिलियन डॉलर के फिगर से भी आगे निकल चुके हैं। आज भारत ग्लोबल टेलिकॉम और नेटवर्किंग इंडस्ट्री का एक पावर सेंटर बनता जा रहा है। Automotive Sector की Success से भी आप अच्छी तरह परिचित हैं। इससे जुड़े Components के एक्सपोर्ट में भी भारत एक नई पहचान बना रहा है। पहले हम बहुत बड़ी मात्रा में मोटर-साइकल पार्ट्स इंपोर्ट करते थे। लेकिन आज भारत में बने पार्ट्स UAE और जर्मनी जैसे अनेक देशों तक पहुंच रहे हैं। सोलर एनर्जी सेक्टर ने भी सफलता के नए आयाम गढ़े हैं। हमारे सोलर सेल्स, सोलर मॉड्यूल का इंपोर्ट कम हो रहा है और एक्सपोर्ट्स 23 गुना तक बढ़ गए हैं। बीते एक दशक में हमारा डिफेंस एक्सपोर्ट भी 21 गुना बढ़ा है। ये सारी अचीवमेंट्स, देश की मैन्युफैक्चरिंग इकोनॉमी की ताकत को दिखाती है। ये दिखाती है कि भारत में कैसे हर सेक्टर में नई जॉब्स भी क्रिएट हो रही हैं।

साथियों,

TV9 की इस समिट में, विस्तार से चर्चा होगी, अनेक विषयों पर मंथन होगा। आज हम जो भी सोचेंगे, जिस भी विजन पर आगे बढ़ेंगे, वो हमारे आने वाले कल को, देश के भविष्य को डिजाइन करेगा। पिछली शताब्दी के इसी दशक में, भारत ने एक नई ऊर्जा के साथ आजादी के लिए नई यात्रा शुरू की थी। और हमने 1947 में आजादी हासिल करके भी दिखाई। अब इस दशक में हम विकसित भारत के लक्ष्य के लिए चल रहे हैं। और हमें 2047 तक विकसित भारत का सपना जरूर पूरा करना है। और जैसा मैंने लाल किले से कहा है, इसमें सबका प्रयास आवश्यक है। इस समिट का आयोजन कर, TV9 ने भी अपनी तरफ से एक positive initiative लिया है। एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं।

मैं TV9 को विशेष रूप से बधाई दूंगा, क्योंकि पहले भी मीडिया हाउस समिट करते रहे हैं, लेकिन ज्यादातर एक छोटे से फाइव स्टार होटल के कमरे में, वो समिट होती थी और बोलने वाले भी वही, सुनने वाले भी वही, कमरा भी वही। TV9 ने इस परंपरा को तोड़ा और ये जो मॉडल प्लेस किया है, 2 साल के भीतर-भीतर देख लेना, सभी मीडिया हाउस को यही करना पड़ेगा। यानी TV9 Thinks Today वो बाकियों के लिए रास्ता खोल देगा। मैं इस प्रयास के लिए बहुत-बहुत अभिनंदन करता हूं, आपकी पूरी टीम को, और सबसे बड़ी खुशी की बात है कि आपने इस इवेंट को एक मीडिया हाउस की भलाई के लिए नहीं, देश की भलाई के लिए आपने उसकी रचना की। 50,000 से ज्यादा नौजवानों के साथ एक मिशन मोड में बातचीत करना, उनको जोड़ना, उनको मिशन के साथ जोड़ना और उसमें से जो बच्चे सिलेक्ट होकर के आए, उनकी आगे की ट्रेनिंग की चिंता करना, ये अपने आप में बहुत अद्भुत काम है। मैं आपको बहुत बधाई देता हूं। जिन नौजवानों से मुझे यहां फोटो निकलवाने का मौका मिला है, मुझे भी खुशी हुई कि देश के होनहार लोगों के साथ, मैं अपनी फोटो निकलवा पाया। मैं इसे अपना सौभाग्य मानता हूं दोस्तों कि आपके साथ मेरी फोटो आज निकली है। और मुझे पक्का विश्वास है कि सारी युवा पीढ़ी, जो मुझे दिख रही है, 2047 में जब देश विकसित भारत बनेगा, सबसे ज्यादा बेनिफिशियरी आप लोग हैं, क्योंकि आप उम्र के उस पड़ाव पर होंगे, जब भारत विकसित होगा, आपके लिए मौज ही मौज है। आपको बहुत-बहुत शुभकामनाएं।

धन्यवाद।