సూక్ష్మ, లఘు, ఇంకా మధ్యతరహా సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ స్)కు సహాయాన్ని అందిస్తూ, ఈ రంగాన్ని ముందుకు తీసుకు పోయేందుకు లక్షించిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని 2018వ సంవత్సరం నవంబర్ 2వ తేదీ న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఢిల్లీ తో పాటు దేశ వ్యాప్తం గా 100 ప్రదేశాల్లో ఇదే కోవ లో ప్రారంభ కార్యక్రమాలు జరుగనున్నాయి. కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన మంత్రులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు. ఈ ప్రదేశాలన్నింటినీ ఢిల్లీ లో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి జోడించడం జరుగుతుంది. ఢిల్లీ లో జరిగే ప్రధాన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి కీలక ప్రాముఖ్యం గల అనేక అంశాలను గురించి ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇటీవల కొన్ని సంవత్సరాలు గా ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. యావత్తు దేశం లో రాగల 100 రోజుల పాటు కొనసాగే ఈ సహాయ మరియు ప్రచార కార్యక్రమం ఎమ్ఎస్ఎమ్ఇ రంగం లో జరుగుతున్న కృషి కి ఇతోధికమైన తోడ్పాటు ను అందించగలని భావిస్తున్నారు. ఉద్యమ తరహా లో అమలు చేసే ఈ కార్యక్రమం యొక్క పురోగతి ని కేంద్ర ప్రభుత్వం లోని, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల లోని సీనియర్ అధికారులు క్రమం తప్పక పర్యవేక్షిస్తారు.
ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే వారిలో ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, ఎమ్ఎస్ఎమ్ఇ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ గిరిరాజ్ సింహ్ లు ఉంటారు.