దీపావళి పర్వదినం సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ వెలుగుజిలుగుల పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సకల సౌభాగ్యాలతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. సంపదలిచ్చే తల్లి లక్ష్మీదేవి కటాక్షం, విఘ్నాలను హరించే శ్రీ గణేశుని చల్లని చూపులు అందరికీ మీదా ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.