Quoteశ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌లో బహుళ కార్యక్రమాలలో పాల్గొనున్న ప్రధాన మంత్రి
Quoteరఘుబీర్ మందిర్‌లో పూజ, దర్శనం
Quoteదివంగత శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శతాబ్ది జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బహిరంగ కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాన మంత్రి
Quoteతులసి పీఠాన్ని కూడా సందర్శించనున్న ప్రధాన మంత్రి; కంచ మందిరంలో పూజ మరియు దర్శనం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు (అక్టోబర్ 27న) మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు, ప్రధానమంత్రి సత్నా జిల్లా చిత్రకూట్ కు చేరుకుంటారు.  శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. రఘుబీర్ మందిర్‌లో మూర్తి దర్శనం, పూజలు చేస్తారు. శ్రీ రామ్ సంస్కృత మహావిద్యాలయాన్ని సందర్శిస్తారు. స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జానకి కుండ్ చికిత్సాలయ నూతన విభాగాన్ని ప్రారంభిస్తారు. 

స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగే బహిరంగ కార్యక్రమానికి కూడా ప్రధాన మంత్రి హాజరవుతారు. శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌ను 1968లో పరమ పూజ్య రామ్ చోద్ దాస్ జి మహారాజ్ స్థాపించారు. శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్, పరమ పూజ్య  రామ్ చోద్ దాస్ జి మహారాజ్ నుండి ప్రేరణ పొందారు. ట్రస్ట్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ ఒకరు. దేశ అభివృద్ధి పథంలో శ్రీ అరవింద్ భాయ్ ది  కూడా కీలక పాత్ర ఉంది. 

చిత్రకూట్ పర్యటన సందర్భంగా ప్రధాని తులసీ పీఠాన్ని కూడా సందర్శిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు, అతను కంచ మందిర్‌లో పూజలు చేస్తారు. తులసి పీఠానికి చెందిన జగద్గురు రామానందాచార్యుల ఆశీర్వాదం పొంది, బహిరంగ సభకు హాజరవుతారు, అక్కడ ఆయన మూడు పుస్తకాలు- ‘అష్టాధ్యాయి భాష’, ‘రామానందాచార్య చరితం’, ‘భగవాన్ శ్రీ కృష్ణ కి రాష్ట్రలీల’లను విడుదల చేస్తారు.

తులసి పీఠ్ అనేది మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ. దీనిని 1987లో జగద్గురు రామభద్రాచార్య స్థాపించారు. తులసి పీఠ్ హిందూ మత సాహిత్యం ప్రముఖ ప్రచురణకర్తలలో ఒకటి.

  • krishangopal sharma Bjp January 15, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 15, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹
  • krishangopal sharma Bjp January 15, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷
  • अविनाश सिंह December 29, 2023

    nyc
  • dr shashi prabha verma December 28, 2023

    नया भारत
  • huma khan December 17, 2023

    🙏🙏
  • SADHU KIRANKUMAR SRIKAKULAM DISTRICT BJP VICE PRESIDENT December 17, 2023

    JAYAHO MODIJI 🙏🙏 JAI BJP...🚩🚩🚩 From: SADHU KIRANKUMAR SRIKAKULAM DISTRICT BJP ViCE - PRESIDENT SRIKAKULAM. A.P
  • Mala Vijhani December 06, 2023

    Jai Hind Jai Bharat!
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 09, 2023

    Jay shree Ram
  • Umakant Mishra October 28, 2023

    namo namo
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond