Quoteఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న సూఫీ సంగీతోత్సవం
Quoteఅమీర్ ఖుస్రో ఘన వారసత్వాన్ని వేడుక చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ కళాకారుల రాక

న్యూఢిల్లీ సుందర్ నర్సరీలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సూఫీ సంగీతోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారు.


దేశానికి చెందిన విభిన్న కళలు సంస్కృతులను ప్రోత్సహించడంలో  ప్రధానమంత్రి ముందున్నారు. ఈ దిశగా సూఫీ సంగీతం, కవిత్వం, నృత్యానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి జహాన్-ఎ-ఖుస్రో వేడుకలో ప్రధాని పాల్గొంటున్నారు. అమీర్ ఖుస్రో ఘన వారసత్వాన్ని వేడుక చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ కళాకారులు న్యూఢిల్లీ చేరుకుంటున్నారు.


ప్రముఖ దర్శకుడు, కళాకారుడు ముజఫర్ అలీ 2001లో ప్రారంభించిన ఈ ఉత్సవం, రూమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న ఈ ఫెస్టివల్, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ జరుగుతుంది.

ఉత్సవంలో భాగంగా ఏర్పాటైన 'టీఈహెచ్' బజార్ (హస్తకళల బజార్)ను కూడా శ్రీ మోదీ సందర్శిస్తారు.  బజార్ లో ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన అద్వితీయ కళాఖండాలను ప్రదర్శిస్తారు. చేనేత, హస్తకళల ఉత్పత్తుల గురించి తెలిపే లఘు చిత్రాల ప్రదర్శన కూడా ఉంటుంది.  

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Govt: 68 lakh cancer cases treated under PMJAY, 76% of them in rural areas

Media Coverage

Govt: 68 lakh cancer cases treated under PMJAY, 76% of them in rural areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Uttarakhand meets Prime Minister
March 19, 2025

The Governor of Uttarakhand, Lieutenant General Gurmit Singh (Retd.) met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister’s Office posted on X;

“Governor of Uttarakhand, @LtGenGurmit, met Prime Minister @narendramodi.”