Quoteఈ జాతీయ రహదారుల వెంబడి ‘పాల్ఖీ’ కోసం రెండువైపులా ప్రత్యేక నడకదారులు;
Quoteపంథర్‌పూర్తో అనుసంధానం మెరుగుకు నిర్మించిన పలు రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

   పంథర్‌పూర్‌కు భక్తుల రాకపోకల సౌలభ్యం దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 8న ‘శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్‌-965) పరిధిలోని ఐదు విభాగాలు- ‘శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్‌-965జి) పరిధిలోని మూడు విభాగాలకు సంబంధించి నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జాతీయ రహదారుల వెంబడి రెండువైపులా ‘పాల్ఖీ’ కోసం ప్రత్యేక నడక మార్గాలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల భక్తుల రాకపోకలకు సురక్షిత-అడ్డంకులు లేని అవాంతరాలు లేని సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

   దివేఘాట్ నుంచి మొహోల్ వరకు సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ఖీ మార్గ్‌లో 221 కిలోమీటర్లు; పటాస్ నుంచి టాండలే-బొండలే వరకు సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్‌లో దాదాపు 130 కిలోమీటర్లు మేర రహదారులు నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయబడతాయి. ఈ మార్గాలకు రెండువైపులా ప్రత్యేక నడకదారులు కూడా నిర్మించబడతాయి. ఈ రెండు మార్గాలలో మొదటిదానికి రూ.6690 కోట్లకుపైగా… రెండోదానికి రూ.4400 కోట్లమేర వ్యయం కాగలదని అంచనా.

    కార్యక్రమంలో భాగంగా పంథర్‌పూర్‌కు అనుసంధానం మెరుగు కోసం వివిధ రహదారుల పరిధిలో రూ.1,180 కోట్ల వ్యయంతో ఉన్నతీకరించి, పనులు పూర్తిచేసిన 223కుపైగా కిలోమీటర్ల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటిలో… మాస్వాద్-పిలివ్- పంథర్‌పూర్ (ఎన్‌హెచ్‌-548ఇ); కుర్దువాడి-పంథర్‌పూర్ (ఎన్‌హెచ్‌-965సి); పంథర్‌పూర్- సంగోలా (ఎన్‌హెచ్‌-965సి); తెంభూర్ని-పంథర్‌పూర్ సెక్షన్ (ఎన్‌హెచ్‌-561ఎ); పంథర్‌పూర్- మంగళవేధ-ఉమాది సెక్షన్‌ (ఎన్‌హెచ్‌-561ఎ) మార్గాలున్నాయి. కాగా, ప్రధానమంత్రి చేతులమీదుగా వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా శంకుస్థాపన జరిగే కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రితోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Three-wheeler sales in India likely to grow 6-8% in FY26, says SIAM

Media Coverage

Three-wheeler sales in India likely to grow 6-8% in FY26, says SIAM
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 మార్చి 2025
March 26, 2025

Empowering Every Indian: PM Modi's Self-Reliance Mission