Quoteభాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని మేళవించే ఒక మహా కార్యక్రమమిది
Quoteప్రధాని నాయకత్వంలో 2020లో బోడో శాంతి ఒప్పందంపై సంతకాలైన తరువాత పునరుత్థాన అధ్యాయాన్ని ఓ సంబరంలాగా జరుపుకోవడానికే ఈ మహోత్సవ్

ప్రప్రథమ ‘బోడోలాండ్ మహోత్సవ్‌’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజున అంటే ఈ నెల 15న, సాయంత్రం దాదాపు 6:30 గంటలకు న్యూ ఢిల్లీలోని ఎస్ఏఐ ఇందిరా గాంధీ క్రీడా భవన సముదాయంలో ప్రారంభించనున్నారు.  ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

బోడోలాండ్ మహోత్సవ్‌ను రెండు రోజుల పాటు.. ఈ నెల 15న, 16న.. నిర్వహిస్తున్నారు.  శాంతి పరిరక్షణ సూచకంగా, చైతన్య భరిత బోడో సమాజాన్ని ఆవిష్కరించడానికి భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి పెద్ద పీటను వేస్తూ వివిధ కార్యక్రమాలకు వేదికగా ఈ మహోత్సవ్ ఉంటుంది.  ఒక్క బోడోలాండ్ లోనే కాకుండా అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్ లతో పాటు, ఈశాన్య ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న బోడో ప్రజలందరినీ ఒక్క తాటి మీదకు తేవడం ఈ ఉత్సవం లక్ష్యం.  ‘సమృద్ధ భారత్ ఆవిష్కారానికి శాంతి, సామరస్యాలు’.. ఇవి ఈ మహోత్సవ్‌ ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతోంది.  బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్  (బీటీఆర్)లోని బోడో సముదాయం, ఇంకా ఇతర సముదాయాల సంపన్న సంస్కృతి, భాష, విద్య.. ఈ అంశాలపై మహోత్సవం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.  దీనితో పాటు, బోడోలాండ్ సంస్కృతి, భాషల విశిష్ట వారసత్వాన్ని, అక్కడి పరిసరాలలోని జీవ వైవిధ్యాన్ని ఈ మహోత్సవం కళ్ళకు కట్టనుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చురుకైన నాయకత్వంలో 2020 లో బోడో శాంతి ఒప్పందం కుదిరిన తరువాత ఆ ప్రాంతం మళ్ళీ పుంజుకున్న సరళిని ఈ మహోత్సవంలో ఓ పండుగలా జరుపుకోనున్నారు. దశాబ్దాల పాటు సంఘర్షణలు, హింస, చెలరేరగి బోడోలాండ్ లో అపార ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో ఆ దురవస్థను శాంతి ఒప్పందం పరిష్కరించడమే కాక, ఇతరత్ర శాంతి ఒడంబడికలకు ఓ ఉత్ప్రేరకంలా కూడా పనిచేసింది.

‘‘సంపన్న బోడో సంస్కృతి, సంప్రదాయాలు, ఇంకా సాహిత్యం భారతీయ వారసత్వానికి, సంప్రదాయాలకు అందిస్తున్న తోడ్పాటు’’ అంశంపై నిర్వహించే కార్యక్రమం ఈ మహోత్సవ్ లో ప్రధానాంశంగా ఉండబోతోంది.  బోడోల విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యంలపై చర్చోపచర్చలు ఈ కార్యక్రమంలో చోటుచేసుకోనున్నాయి.  ‘‘జాతీయ విద్యా విధానం 2020 పథనిర్దేశకత్వంలో మాతృభాష మాధ్యమంలో విద్యాబోధనకు ఉన్న అవకాశాలు, సవాళ్ళు’’ అంశంపైన సైతం మరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  బోడోలాండ్ ప్రాంతంలో ‘‘పర్యటన రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సంస్కృతి, పర్యటన మాధ్యమాల ద్వారా ‘చైతన్యశీల బోడోలాండ్’ నిర్మాణంలో స్థానిక సంస్కృతి పాత్ర’’ అంశం పై ఒక సమావేశాన్ని, చర్చను నిర్వహించనున్నారు.  

 

అయిదు వేల మందికి పైగా కళా రంగ ఔత్సాహికులు ఈ మహోత్సవ్‌లో పాలుపంచుకోనున్నారు.  వారిలో బోడోలాండ్ ప్రాంతానికి చెందిన వారే కాక, అసోం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, , నేపాల్, భూటాన్ వంటి ఇరుగు పొరుగు దేశాలకు చెందిన వారు కూడా తరలిరానున్నారు.

 

  • pankaj sharma January 21, 2025

    Yes
  • Vivek Kumar Gupta January 02, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta January 02, 2025

    नमो ..........….......🙏🙏🙏🙏🙏
  • Avdhesh Saraswat December 27, 2024

    NAMO NAMO
  • Ranjan kumar trivedy December 26, 2024

    सेवा में, माननीय प्रधान मंत्री, भारत सरकार, नई दिल्ली। विषय: दिल्ली में जल निकासी समस्या के समाधान हेतु तत्काल कार्यवाही की आवश्यकता। मान्यवर, सविनय निवेदन है कि दिल्ली, देश की राजधानी होने के बावजूद जल निकासी की समस्या से गंभीर रूप से प्रभावित है। हर वर्ष मॉनसून के दौरान जलभराव से न केवल जनता को असुविधा होती है, बल्कि अन्य महत्वपूर्ण परियोजनाओं की प्रगति पर भी इसका नकारात्मक प्रभाव पड़ता है। यदि दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बनती है, तो आपसे आग्रह है कि जल निकासी समस्या को प्राथमिकता दी जाए। निम्नलिखित सुझाव इस दिशा में सहायक हो सकते हैं: 1. पुराने और अव्यवस्थित जल निकासी तंत्र का पुनर्निर्माण। 2. अत्याधुनिक तकनीक का उपयोग कर जल निकासी के लिए दीर्घकालिक समाधान। 3. जलभराव वाले क्षेत्रों की पहचान कर स्थानीय उपाय लागू करना। 4. जनभागीदारी और जागरूकता अभियानों के माध्यम से समस्या को स्थायी रूप से हल करना। यह समस्या न केवल नागरिकों की दिनचर्या को प्रभावित करती है, बल्कि इससे स्वास्थ्य और पर्यावरण पर भी प्रतिकूल प्रभाव पड़ता है। अतः इसे युद्धस्तर पर सुलझाना अत्यंत आवश्यक है। आपके सकारात्मक निर्णय से दिल्लीवासियों को राहत मिलेगी और राजधानी की छवि और भी बेहतर होगी। धन्यवाद।
  • Vishal Seth December 17, 2024

    जय श्री राम
  • JYOTI KUMAR SINGH December 08, 2024

    👌
  • parveen saini December 06, 2024

    Jai ho
  • Chandrabhushan Mishra Sonbhadra December 05, 2024

    🕉️🕉️
  • Chandrabhushan Mishra Sonbhadra December 05, 2024

    🕉️
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Job opportunities for women surge by 48% in 2025: Report

Media Coverage

Job opportunities for women surge by 48% in 2025: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 మార్చి 2025
March 05, 2025

Citizens Appreciate PM Modi's Goal of Aatmanirbhar Bharat - Building a Self-Reliant India