Quoteవి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్టర్మినల్ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు
Quoteపది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కు చెందిన 75 లైట్ హౌస్ లలో యాత్రికుల సదుపాయాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు
Quoteభారతదేశం లో మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను ప్రారంభించారు
Quoteపలు రైలు ప్రాజెక్టుల ను మరియు రోడ్డు ప్రాజెక్టుల నుదేశ ప్రజల కు అంకితమిచ్చారు
Quote“తూత్తుక్కుడి లో, తమిళ నాడు, వళర్చియిన ప్రత్తియొక్క ప్రజ్ఞలను ఎంచుకోవడం”
Quote“ఈ రోజు, దేశం 'పూర్తి ప్రభుత్వం' యొక్క పని మాట్లాడుతున్నాయి”
Quote“సంధానాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు జీవన సౌలభ్యాలను పెంచుతున్నాయి”
Quote“సముద్ర రంగానికి అభివృద్ధి అనిపిస్తుంది అయితే తమిళ నాడు వంటి ఒక రాష్ట్రానికి అభివృద్ధి అనిపిస్తుంది”
Quote“ఒకే సమయంలో 75 ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ఇది పూర్తి ప్రభుత్వం”

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17,300 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినటువంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు తమిళ నాడు లోని తూత్తుక్కుడి లో ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు గా వాటిని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ప్రధాన మంత్రి వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణాని కి శంకుస్థాపన చేశారు. భారతదేశం లో మొట్టమొదటిసారి గా పూర్తి గా దేశీయం గా రూపొందించిన గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో ఉన్న 75 లైట్ హౌస్ లలో యాత్రికుల సదుపాయాల ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. వాంచీ మణియాచ్చి - తిరునెల్‌వేలి సెక్శన్, ఇంకా మేలప్పాలయమ్ - అరళ్‌వాయ్‌మొళి సెక్శన్ లు సహా వాంచీ మణియాచ్చి - నాగర్‌కోయిల్ రైలు మార్గం యొక్క డబ్లింగ్ ప్రాజెక్టుల ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. సుమారు గా 4,586 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు తో తమిళ నాడు లో అభివృద్ధి పరచిన నాలుగు రహదారి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు.

 

|

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, తూత్తుక్కుడి లో ఒక క్రొత్త ప్రగతి అధ్యాయాన్ని తమిళ నాడు లిఖిస్తోంది అన్నారు. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం తాలూకు మార్గసూచీ ని సిద్ధం చేసే దిశ లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన లు ఈ రోజు న జరిగాయి అని ఆయన అన్నారు. ప్రస్తుతం చేపట్టుకొంటున్న ఈ అభివృద్ధి ప్రాజెక్టుల లో ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ తాలూకు భావన ను గమనించవచ్చును అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులు తూత్తుక్కుడి లోనివే కావచ్చు, అయినప్పటికీ ఇది భారతదేశం అంతటా అనేక ప్రాంతాల లో అభివృద్ధి కి జోరు ను అందించేదే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ యొక్క యాత్ర ను గురించి మరియు ఆ యాత్ర లో తమిళ నాడు పోషించిన పాత్ర ను గురించి పునరుద్ఘాటించారు. రెండు సంవత్సరాల క్రిందట చిదంబరనార్ నౌకాశ్రయం సామర్థ్యాన్ని విస్తరించడం కోసం ఎన్నో ప్రాజెక్టుల కు తాను నాంది ని పలికిన విషయాన్ని, మరి అలాగే ఈ పోర్టు ను నౌకాయానం సంబంధి ప్రధానమైన నిలయం గా తీర్చిదిద్దడం జరుగుతుంది అంటూ తాను ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఈ సందర్భం లో గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ఆనాడు ఇచ్చిన హామీ ఈనాడు నెరవేరుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్ టర్మినల్ కు శంకుస్థాపన ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కోసం 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని పెట్టడం జరుగుతుంది అని తెలియ జేశారు. ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రాజెక్టుల విలువ 900 కోట్ల రూపాయలు, అలాగే 2,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ను 13 నౌకాశ్రయాల లో మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులు తమిళ నాడు కు లబ్ధి ని చేకూర్చడం తో పాటుగా రాష్ట్రం లో ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తాయి అని ఆయన వివరించారు.

 

|

వర్తమాన ప్రభుత్వం ఈ రోజు న తీసుకు వస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజలు కోరినవే, కానీ మునుపటి ప్రభుత్వాలు వీటి విషయం లో ఎన్నడు శ్రద్ధ తీసుకోలేదు అని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. ‘‘తమిళ నాడు కు సేవ చేయడం కోసం, మరి ఈ రాష్ట్రం యొక్క భాగ్యాన్ని మార్చడం కోసం నేను ఇక్కడకు వచ్చాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

హరిత్ నౌక కార్యక్రమం లో భాగం గా భారతదేశం యొక్క ఒకటో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇది కాశీ నగరాని కి తమిళ నాడు ప్రజలు అందిస్తున్నటువంటి కానుక అంటూ అభివర్ణించారు. తమిళ నాడు ప్రజల ఉత్సాహాన్ని, మరి వారి ఆప్యాయత ను కాశీ తమిళ్ సంగమం కార్యక్రమం లో కనులారా తిలకించాను అని ఆయన అన్నారు. వి.ఒ. చిదంబరనార్ నౌకాశ్రయాన్ని దేశంలోకెల్లా ప్రప్రథమ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్ గా తీర్చిదిద్దడాని కి ఉద్దేశించిన అనేక ఇతర ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల లో ఒక నిర్లవణీకరణ ప్లాంటు, హైడ్రోజన్ ఉత్పత్తి సదుపాయం లతో పాటు బంకరింగ్ ఫెసిలిటీ లు కూడా ఉన్నాయి. ‘‘ప్రపంచం ప్రస్తుతం ఏ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోందో వాటిలో తమిళ నాడు చాలా ముందుకు పోతుంది’’ అని ఆయన అన్నారు.

 

 

నేటి రైలు మరియు రహదారి సంబంధి అభివృద్ధి ప్రాజెక్టుల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, రైలు మార్గాల విద్యుతీకరణ మరియు డబ్లింగు పనుల తో తమిళ నాడు లోని దక్షిణ ప్రాంతాని కి, కేరళ కు మధ్య సంధానం మరింత గా మెరుగు పడుతుంది; అంతేకాకుండా తిరునెల్‌వేలి, ఇంకా నాగర్‌కోయిల్ క్షేత్రాల లో రాకపోకల లో రద్దీ కూడా తగ్గుతుంది అని వివరించారు. తమిళ నాడు లో 4,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన రహదారుల ఆధునికీకరణ సంబంధి ప్రధాన ప్రాజెక్టులు నాలుగింటిని ఈ రోజు న చేపట్టిన విషయాన్ని సైతం ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వీటితో కనెక్టివిటీ కి ప్రోత్సాహం లభించడం, యాత్ర కు పట్టే కాలం తగ్గడం తో పాటుగా రాష్ట్రం లో వ్యాపారం మరియు పర్యటన రంగాల కు ప్రోత్సాహం అందుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

|

‘న్యూ ఇండియా’ లో పూర్తి ప్రభుత్వం దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, తమిళ నాడు లో మెరుగైన సంధానాన్ని మరియు మెరుగైన అవకాశాల ను కల్పించడం కోసం రహదారులు, హైవేస్ మరియు జల మార్గాల విభాగాలు కలసికట్టుగా కృషి చేస్తున్నాయి అన్నారు. ఈ కారణం గా రైల్‌వే స్, రహదారులు మరియు మేరిటైమ్ ప్రాజెక్టుల ను ఒకేసారి ప్రారంభించుకొంటున్నట్లు ఆయన చెప్పారు. బహుళ విధాలైనటువంటి పద్ధతి రాష్ట్రం లో అభివృద్ధి కి సరిక్రొత్త గతి ని అందిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

దేశం లో ప్రధానమైనటువంటి లైట్ హౌస్ లను పర్యటన స్థలాలు గా అభివృద్ధి పరచాలంటూ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ ) కార్యక్రమం లోని ఎపిసోడ్ లలో ఒక ఎపిసోడ్ లో తాను చేసిన సూచన ను ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 75 లైట్ హౌస్ ల లో యాత్రికుల సదుపాయాల ను దేశ ప్రజల కు అంకితం చేస్తున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. ‘‘ఒకే సారి 75 ప్రాంతాల లో అభివృద్ధి కార్యక్రమాలు చోటుచేసుకొన్నాయి, ఇది కదా న్యూ ఇండియా’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించి, ఈ 75 ప్రదేశాలు రాబోయే కాలాల్లో చాలా పెద్ద పర్యటక కేంద్రాలు గా మారిపోతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

  కేంద్ర ప్ర‌భుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్ర‌ధానమంత్రి గుర్తు చేస్తూ- గ‌త 10 సంవ‌త్స‌రాల్లో  త‌మిళ‌నాడులో 1300 కిలోమీటర్ల పొడవైన వివిధ రైలు మార్గాల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే 2000 కిలోమీటర్ల మేర రైలుమార్గాల విద్యుదీకరణ పూర్తయిందని, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణంసహా పలు రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణ పూర్తయ్యాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రయాణానుభూతి కల్పిస్తూ రాష్ట్రంలో 5 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో రహదారి మౌలిక వసతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లదాకా పెట్టుబడులు పెడుతున్నదని వెల్లడించారు. ‘‘అనుసంధానం మెరుగు దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి జీవన సౌలభ్యాన్ని పెంచుతోంది’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

 

|

   భారతదేశంలో దశాబ్దాలుగా జలమార్గాలు-సముద్ర రంగంపై భారీ అంచనాలున్నాయని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. నేడు ఈ రంగాలే వికసిత భారత్ పునాదులుగా మారుతున్నాయని చెప్పారు. వీటిద్వారా దక్షిణ భారతం మొత్తంమీద అత్యధికంగా లబ్ధి పొందేది తమిళనాడు రాష్ట్రమేనని చెప్పారు. తమిళనాడులోని మూడు ప్రధాన ఓడరేవులతోపాటు 12కుపైగా చిన్న ఓడరేవుల ద్వారా అన్ని దక్షిణాది రాష్ట్రాలకూ అవకాశాలు అందివస్తాయని ప్రధానమంత్రి ‘‘సముద్ర రంగం అభివృద్ధి అంటే తమిళనాడు వంటి రాష్ట్ర ప్రగతి’’ అంటూ గత దశాబ్దంలో వి.ఒ.చిదంబరనార్ రేవుద్వారా నౌకల రాకపోకలలో 35 శాతం వృద్ధి నమోదైందని ప్రధాని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం ఈ రేవు 38 మిలియన్ టన్నుల మేర సరకు రవాణా బాధ్యతలు నిర్వర్తించిందని, తద్వారా 11 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. ‘‘దేశంలోని ఇతర ప్రధాన ఓడరేవులలోనూ ఈ తరహాల ఫలితాలు కచ్చితంగా కనిపిస్తాయి’’ అంటూ- ఇందులో సాగరమాల వంటి ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ అన్నారు.


   జలమార్గాలు, సముద్ర సంబంధ రంగాల్లో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని ప్రధాని నొక్కిచెప్పారు. ‘లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌’లో మన దేశం 38వ స్థానానికి దూసుకెళ్లడంతోపాటు  రేవుల సామర్థ్యం దశాబ్ద కాలంలో రెండింతలైందని ఆయన వివరించారు. ఈ కాలంలో జాతీయ జలమార్గాలు 8 రెట్లు, నౌకా ప్రయాణికుల సంఖ్య 4 రెట్లు, నావికుల సంఖ్య రెండింతల మేర పెరుగుదల నమోదైందని ఆయన అన్నారు. ఈ విధంగా ముందడుగు పడుతుండటం ఇటు తమిళనాడుకు అటు మన యువతరానికి మేలు కలుగుతుందని చెప్పారు. ‘‘తమిళనాడు ప్రగతి పథంలో దూసుకెళ్లగలదని నా దృఢ విశ్వాసం. ఈ పరిస్థితుల నడుమ దేశం మాకు మూడోసారి సేవ చేసే అవకాశం ఇస్తే ద్విగుణీకృత ఉత్సాహంతో సేవలందిస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను’’ అని ప్రకటించారు. ప్రస్తత పర్యటనలో తమిళనాడులోని వివిధ ప్రాంతాల ప్రజలు తనపై ప్రదర్శించిన ప్రేమాదరాలు, ఉత్సాహంతోపాటు ఆశీర్వాదాలు కురిపించారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ అభిమానం, ఆప్యాయతలకు సరితూగే విధంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని వాగ్దానం చేశారు. చివరగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రగతి పనులను ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఫోన్ లైట్లను స్విచాన్ చేసి, వెలుగులు విరజిమ్మాలని ప్రధాని కోరారు.

 

|

   ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, కేంద్ర ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.
 

నేపథ్యం


   ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇవాళ వి.ఒ.చిదంబరనార్ రేవులో ‘ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్‌’కు శంకుస్థాపన చేశారు. ఈ రేవును తూర్పు భారతానికి రవాణా కూడలిగా మార్చడంలో ఈ కంటైనర్ టెర్మిన‌ల్‌ను ఒక ముందడుగుగా పేర్కొనవచ్చు. సుదీర్ఘ భారత తీరప్రాంతంతోపాటు సానుకూల భౌగోళిక స్థానాన్ని ప్రభావితం చేయడంతోపాటు ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ పోటీతత్వాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిలోనూ ఈ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ తనవంతు పాత్ర పోషిస్తుంది. అలాగే వి.ఒ.చిదంబరనార్ ఓడరేవును దేశంలోనే తొలి హరిత ఉదజని కూడలిగా మార్చడం లక్ష్యంగా అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించారు. వీటిలో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్లాంట్, ఉదజని ఉత్పత్తి-బంకరింగ్ సౌకర్యం తదితరాలు కూడా ఉన్నాయి.

 

|

   ‘హరిత నౌకా కార్యక్రమం’ కింద భారత తొలి స్వదేశీ హరిత ఉదజని ఇంధన సెల్ అంతర్గత జలమార్గ నౌకను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ నౌకను కొచ్చిన్ షిప్‌యార్డ్ తయారుచేయగా, పరిశుభ్ర ఇంధన పరిష్కారాల అనుసరణతోపాటు నికర-శూన్య ఉద్గారాలపై దేశం నిబద్ధతకు అనుగుణంమైన ఓ మార్గదర్శక దశకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. మరోవైపు దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లలో పర్యాటక సౌకర్యాలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.


   ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా వంచి మ‌ణియాచ్చి-తిరునెల్వేలి విభాగం, వంచి మ‌ణియాచ్చి - నాగ‌ర్‌కోయిల్ రైలు మార్గం, మేల‌పాళ‌యం-అర‌ళ్‌వాయిమొళి విభాగం సహా వంచి మ‌ణియాచ్చి- నాగ‌ర్‌కోయిల్ రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టులను ప్ర‌ధాని జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.1,477 కోట్లతో నిర్మించిన ఈ డబ్లింగ్ ప్రాజెక్ట్ వల్ల చెన్నై-కన్యాకుమారి, నాగర్‌కోయిల్-తిరునల్వేలి మార్గాల్లో రైళ్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.


   తమిళనాడులో దాదాపు రూ.4,586 కోట్లతో నిర్మించిన 4 రహదారి ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. వీటిలో ఎన్‌హెచ్-844లోని జిట్టాందహళ్లి-ధర్మపురి సెక్షన్‌ 4 వరుసలుగా విస్తరణ; ఎన్‌హెచ్-81లోని మీన్‌సురుట్టి-చిదంబరం సెక్షన్‌ 2 వరుసల విస్తరణ, ఎన్‌హెచ్-83లోని ఓడంచత్రం-మడతుకుళం సెక్షన్ 4 వరుసలుగా విస్తరణ; ఎన్‌హెచ్-83లోని నాగపట్టిణ-తంజావూరు సెక్షన్‌లో రెండువైపులా అదనపు భుజాలతో 2 వరుసల విస్తరణ ప్రాజెక్టులున్నాయి. వీటిద్వారా అనుసంధానం మెరుగుపడటమేగాక ప్రయాణ సమయం తగ్గుతుంది. అలాగే సామాజిక-ఆర్థిక వృద్ధికి ముందడుగు పడటంతోపాటు ఈ ప్రాంతంలో తీర్థయాత్రికులకు సౌలభ్యం ఇనుమడిస్తుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • Vijay bapu kamble August 31, 2024

    इचलकरंजी विधानसभा मतदारसंघ 279 बूथ प्रमुख भाजप बूथ क्रमांक 55 श्री विजय बापू कांबळे चंदुर भाजप कार्यकर्ता माननीय श्री पंतप्रधान नरेंद्र मोदी जी यांचे नमो ॲप ला मिळालेले गुण अकरा लाख गुण मिळाले आहेत
  • Vivek Kumar Gupta May 10, 2024

    नमो .......................🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta May 10, 2024

    नमो ....................................🙏🙏🙏🙏🙏
  • Pradhuman Singh Tomar April 30, 2024

    BJP
  • Krishna Jadon April 29, 2024

    BJP
  • B M S Balyan April 13, 2024

    विकसित ओर सुदृढ़ भारत। विकसित ओर सुदृढ़ भारत बनाने के लिए बहुत प्रयास करना पड़ेगा और बहुत मेहनत करनी पड़ेगी इस देश में समस्याएं बहुत है उन पर भी ध्यान देना है इस देश की शांति बनाए रखने के लिए भी बहुत मेहनत करनी है। यहां पर अहंकार की बहुत बड़ी प्रॉब्लम है हर किसी को अहंकार है उसे डेवलपमेंट से कोई मतलब नहीं है अगर उनकी अहंकार बीच में आ जाती है तो वह डेवलपमेंट को नहीं चाहते। इस देश में गद्दारों की भी कमी नहीं है यहां पर घरों में एजेंट बैठे हैं जो नौकरी करते है बिजनेस करते हैं पर उन लोगों के सम्बन्ध अभी भी बाहरी ताकतों से जुड़े हैं यह वह समय है जब हम कुछ सही कर सकते हैं अगर समय चला गया तो बहुत मुश्किल हो जाएगी जो भी हमने मेहनत करी है इस देश में सब बेकार हो जायेगी। समस्याओं की कमी नहीं है कोई ना कोई ना कोई समस्या चलती रहती है और उन समस्याओं को खत्म करते हे तो दूसरी समस्या पैदा हो जाती है अभी भी बहुत सारी सुविधाओं की जरूरत है पापुलेशन पर कंट्रोल होना बहुत जरूरी है। गांव में अभी भी बहुत सारी सुविधाओं का आना बाकी है गांव को मॉडर्न बनाना है बेसिक सुविधाओं से उनको पूरा करना है ।गांव को भी वर्ल्ड क्लास सुविधा प्रदान करनी है । गांव में टेक्नोलॉजी का उपयोग करना हैं एडवांस टेक्नोलॉजी और कंप्यूटर सेंटर खोलने जरूरी है जिससे कि गांव के नागरिक भी आगे आने चाहिए और देश में क्या डेवलपमेंट हो रहा है उसको वह समझ सके ओर आगे बड़ सके। गांव में सुरक्षा की भी एक प्रॉब्लम है उसको भी बढ़ाना है जिससे कि गांव का व्यक्ति भी सुरक्षित महसूस करें और उसे भी लगे कि मैं यहां एक सुरक्षित भारत का नागरिक हूं और एक नए भारत का नागरिक हूं। उनके लिए भी हमें हेल्प सेंटर खोलने है जहां पर वह कानून की सुविधा प्राप्त कर सके ऑनलाइन जिससे वह तुरंत सहायता ले सके। किसानों के लिए केंद्र खोलने हैं जहां पर वह अपनी लागत को कम करने का तरीका सीख सके अपनी फसल को बढ़ाने का तरीका सीख सके अपनी फसल को बेचने का तरीका सीख सके और ऐसे सेंटर खोलने जहां पर उनकी फसल आराम से बिक जाए और हर गांव को एक सलाहकार दिया जाएगा जो उन को एडवाइज करें ओर इस बात की गारंटी दे की फसल को हम खरीदेंगे और इतने दामों पर खरीदेंगे उनके लिए मॉनिटरिंग सिस्टम बनाया जाए वाटर हार्वेस्टिंग सिस्टम बनाया जाए और एक हेल्प सेंटर खोला जाए जो इन सब चीजों के लिए जिम्मेदार हो और किसानों को आगे बढ़ाने में जिम्मेदारी लें। सुरक्षा की गारंटी दी जाए आज तक किसी पार्टी ने सुरक्षा की गारंटी नहीं दिए पर भाजपा ने दि सभी पार्टी बड़ी-बड़ी बात करती है बोलती भी है पर सुरक्षा नहीं देती हम आपको सुरक्षा भी दे रहे हैं स्वास्थ्य बीमा भी दे रहे हैं फसल बीमा भी दे रहे है सुविधा भी दे रहे हैं तो उसके लिए मॉनिटरिंग सिस्टम भी प्रदान कर रहे हैं जहां पर आप अपनी शिकायत दर्ज कर सकते हैं और बता सकते हैं कि आपको यह सुविधा अभी तक नहीं मिली। अगर कहीं कोई आपसे रिश्वत मांगी जा रही है उसकी आप कंप्लेंट कर सके वह भी ऑनलाइन हो जाए जिस की फ्यूचर में भविष्य में इसका संज्ञान लिया जा सके। सुरक्षा की कमी की वजह से इस देश में अभी भी बहुत सारे लोग आजाद देश में रहते हुए भी गुलाम की तरह ही रहे हैं जो अपनी बातों को खुलकर नहीं बता पाते या कानून की सहायताएं उन्हें पूर्ण रूप से नहीं मिल पाती करप्शन अपना रूप बदलता रहता है उसके लिए हमें पब्लिक के सपोर्ट की जरूरत है पब्लिक ही सबसे पहले बता सकती है कि कहां पर क्या करप्शन है और क्यों है इसके लिए पब्लिक पोर्टल बनाई गई है जनसुनवाई केंद्र खोले गए हैं कंप्लेंट करना जरूरी है इस चीज को खत्म करने में गवर्नमेंट की सहायता कर सकते हैं। अभी भी हमें हर वर्ग के लिए काम करना है जो भी डेवलपमेंट हमने किए हैं वह अभी भी कम है अभी भी हमें बहुत से लोगों के लिए काम करना है और इस देश को वर्ल्ड क्लास देश बनाने के लिए बहुत कुछ करना बाकी है अभी भी बहुत सारी समस्याएं हैं हमने हर तरह की सुविधा जन-जन तक पहुंचने का प्रयास किया है फिर भी अभी बहुत सारी जगह ऐसी हैं जहां अभी भी समस्या है वहां पर अभी और प्रयास करने की और उन सुविधाओं को और बेहतर बनाने की हमारे को जरूरत है कोशिश करनी है। सुविधा हमने प्रदान कराई हे वो उज्जवला योजना, महिला सम्मान, कन्या योजना कन्या शादी समारोह, प्रेगनेंसी मे मेडिकल की सुविधा, आयुष्मान हेल्थ कार्ड, घरों की योजना, स्वच्छता अभियान, जल योजना, जनधन योजना है पर अभी भी बहुत सारी समस्या बाकी है जो योजना हमने बनाई है टेक्नोलॉजी को उपयोग करके यह सब देखना है कि मॉनिटर करना कि हमारी योजना कहां-कहां तक पहुंच चुकी है और अभी भी कितने लोगों तक पहुंची नहीं है बाकी है। हर तरह की वर्ल्ड क्लास सूविधा प्रदान करने की योजनाएं गांव गांव कस्बे कस्बे तक यह सुविधा पहुंचाई जाएगी। उद्योग धंधों को हर आदमी की पहुंच तक लाना है उनको शिक्षित करना है उनको तरीके सीखने हे की कैसे वो अपना रोजगार शुरू कर सके। कैसे वह अपने उद्योग शुरू कर सके और किस तरह से वह सरकार से उद्योग चलाने में सहायता प्राप्त कर सकते हैं किस तरह से उन्हें लोन मिल सकता है यह सब चीज अभी भी पहुंचानी बाकी है सिखानी बाकी उसके लिए हमें मॉनिटरिंग सिस्टम बनाने हैं मॉनिटरिंग सिस्टम और कंट्रोल सिस्टम के थ्रू हमें हर आदमी तक इन सुविधाओं को पहुंचना है टेक्नोलॉजी का उपयोग करना है। हर आदमी को सुरक्षा की गारंटी देनी है कुछ भी गलत होने पर उसकी जिम्मेदारी हमारी होगी यूपी को आप देख सकते हैं किसी भी समूह की ज़ोर जबर्दस्ती नहीं चलती है कोई भी व्यक्ति विशेष समूह अपनी मन मर्जी नहीं चला सकता है अगर कोई चलाएगा और कानून के खिलाफ जाकर या कानून का पालन किये बिना अगर कोई भी व्यक्ति ऐसा करेगा तो जेल जाएगा चाहे वह कोई भी हो। उस पर गलत बोलने की या गलत करने की हिम्मत नहीं है किसी को भी हिम्मत नहीं है अगर कोई करेगा तो उसको हम सबक सिखाएंगे जिससे कि वह या कोई और दोबारा से ऐसी कोई गलती ना करें या करने की कोई और कोशिश ना करें। हमें हर वर्ग के लिए काम करना है हमारे पास अभी भी बहुत सारी योजनाएं हैं जिससे कि हर वर्ग के पास हर तरह की सुविधा पहूचाई जा सके और जीवन को आसान बना सके अब हमारा फोकस रहेगा कि आम जनता का जीवन आसान कैसे बन जाए उनकी भविष्य को सुनहरा कैसा बनाया जाए उनके जीवन को सरल कैसा बनाया जाए हर तरह की सुविधाएं हर आदमी तक कैसे पहुंचा जाए ।मोटरसाइकिल, कार, एसी वाला घर यह सब सुविधाएं हर आदमी तक कैसे पहुंचे उनकी सोर्स आफ इनकम कैसे बढ़ेगी कमाई का जरिए कैसे बढ़ाए इन सब चीजों पर हमें फोकस करना होगा इन सब पर फोकस करना होगा हमें अभी भी बहुत काम करना है हमें अभी भी गरीब लोगों के लिए काम करना है हमें अभी भी पिछडे लोगों के लिए काम करना है हमें अभी भी मिडिल क्लास और सर्विस क्लास लोगों के लिए काम करना है हर वर्ग के लोगों तक सुविधा पहुंचानी है जिससे कि उनकी लाइफ सरल हो सके हमें अभी भी कुछ ऐसा करना है जिससे कि लोगों की सोर्स आफ इनकम बन सके उनकी कमाई का जरिया हमेशा के लिए बन जाए उनको उस चीज की टेंशन ना रहे हैं कि वह कल क्या करेंगे कैसे काम आएंगे और किस तरह से उनका जीवन निकलेगा उनके लिए हमें काम करना है। करप्शन को जीरो करना है करप्शन को हमेशा हमेशा के लिए खत्म करना है जिससे की मेहनत करने वालों की कमाई को कोई चालाक आदमी ना खा सके टेक्नोलॉजी का उपयोग करना है जिससे कि लोगों को हर सुविधा मिल सके और करप्शन फ्री देश बन सके जब पीस होगी सिक्योरिटी होगी तभी आप अपने टैलेंट का सही इस्तेमाल कर सकते हैं और जीरो करप्शन होगा तभी आप विश्वास कर सकते हैं कि आपका टैलेंट का सही उपयोग हो पाएगा और जब भी आप मेहनत करेंगे और आगे बढ़ेंगे और देश को भी आगे बढ़ाएंगे करप्शन को खत्म करने के लिए टेक्नोलॉजी का उपयोग करा जाएगा लोगों से मदद ली जाएगी । टेक्नोलॉजी का विकास करा जाएगा क्योंकि टेक्नोलॉजी आज के युग में बहुत जरूरी है एडवांस टेक्नोलॉजी का उपयोग करा जाएगा सेमीकंडक्टर का उपयोग करा जाएगा ऑटोमेशंस का उपयोग कर जाएगा ड्रोन का उपयोग कर जाएगा रोबोट का उपयोग करा जाएगा । जोब क्रिएट करे जाएंगे लोगों को नई टेक्नोलॉजी सिखाई जाएगी स्किल सेंटर्स ओपन कर जाएंगे हमें अपने देश को बेटर और बहुत बैटर बनाना है अब हमारा कंपटीशन डेवलपड कंट्रीज के साथ है। जय हिन्द जय भारत लेखक भूपेंद्र बालयाण
  • Shabbir meman April 10, 2024

    🙏🙏
  • Sunil Kumar Sharma April 09, 2024

    जय भाजपा 🚩 जय भारत
  • Jayanta Kumar Bhadra April 07, 2024

    Jai hind sir
  • Jayanta Kumar Bhadra April 07, 2024

    Jai Sri Krishna
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How the makhana can take Bihar to the world

Media Coverage

How the makhana can take Bihar to the world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 ఫెబ్రవరి 2025
February 25, 2025

Appreciation for PM Modi’s Effort to Promote Holistic Growth Across Various Sectors