Quoteయుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ కార్ఖియాన్ లో బనాస్ కాశీ సంకుల్ పాల ప్రాసెసింగ్ యూనిట్ కు ప్రారంబోత్సవం
Quoteహెచ్ పిసిఎల్ ద్వారా ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్, యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ లో వివిధ మౌలిక సదుపాయాల పనులు, సిల్క్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కామన్ ఫెసిలిటీని ప్రారంభించిన ప్రధాని
Quoteపలు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Quoteవారణాసిలో పలు పట్టణాభివృద్ధి, పర్యాటక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
Quoteవారణాసిలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)కు శంకుస్థాపన
Quoteబి హెచ్ యు లో కొత్త మెడికల్ కాలేజీ, నేషనల్ సెంటర్ ఆఫ్ ఏజింగ్ కు శంకుస్థాపన
Quoteసిగ్రా స్పోర్ట్స్ స్టేడియం ఫేజ్-1, డిస్ట్రిక్ట్ రైఫిల్ షూటింగ్ రేంజ్ ప్రారంభం
Quote"పదేళ్లలో బనారస్ నన్ను బనారసిగా మార్చేసింది"
Quote"కిసాన్ , పశుపాలక్ లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత"
Quote“బనాస్ కాశీ సంకుల్ 3 లక్షల మందికి పైగా రైతుల ఆదాయాన్ని పెంచుతుంది”
Quote"మహిళల స్వావలంబనకు పశుపోషణ గొప్ప సాధనం"
Quote“ఆహారం అందించేవారిని (ఫుడ్ ప్రొవైడర్) ఇంధనం అందించే (ఎనర్జీ ప్రొవైడర్) వారి
Quoteప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన అభివృద్ధి ప్రాజెక్టులు రోడ్లు, రైలు, విమానయానం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పట్టణాభివృద్ధి, పారిశుధ్యం వంటి ముఖ్యమైన రంగాల వృద్ధికి ఉపయోగపడతాయి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో రూ.13,000 కోట్ల పైగా పెట్టుబడితో కూడిన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం,  శంకుస్థాపనలు  వేశారు. వారణాసిలోని కర్ఖియాన్ లో యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ లో నిర్మించిన బనస్కాంత జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ పాల ప్రాసెసింగ్ యూనిట్ -బనాస్ కాశీ సంకుల్-  ను  ప్రధాని సందర్శించారు. ఆవుల లబ్దిదారులతో  ముచ్చటించారు. ఉపాధి లేఖలు, జిఐ అధీకృత యూజర్ సర్టిఫికెట్లను ప్రధాని మోదీ అందజేశారు. ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన  అభివృద్ధి ప్రాజెక్టులు రోడ్లు, రైలు, విమానయానం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పట్టణాభివృద్ధి, పారిశుధ్యం వంటి ముఖ్యమైన రంగాల వృద్ధికి ఉపయోగపడతాయి.

 

|

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కాశీని మరోసారి సందర్శించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, 10 ఏళ్ల క్రితం నగర పార్లమెంటేరియన్ గా ఎన్నికయ్యానని గుర్తు చేసుకున్నారు. ఈ పదేళ్లలో బనారస్ తనను బనారసిగా మార్చిందని ఆయన అన్నారు. శ్రీ మోదీ కాశీ ప్రజల మద్దతు,  సహకారాలను ప్రశంసించారు.  ఈరోజు రూ .13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులతో నవ కాశీని సృష్టించే ప్రచారం జరుగుతోందని అన్నారు. రైలు, రోడ్డు, విమానాశ్రయ సంబంధిత ప్రాజెక్టులు, పశుసంవర్ధక, పరిశ్రమలు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, పరిశుభ్రత, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, పర్యాటకం, ఎల్ పిజి గ్యాస్ వంటి రంగాల అభివృద్ధి ప్రాజెక్టులు కాశీ మాత్రమే కాకుండా మొత్తం పూర్వాంచల్ ప్రాంతం అభివృద్ధికి ఊతమిస్తాయని ఆయన అన్నారు. తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు. సంత్ రవిదాస్ జీకి సంబంధించిన ప్రాజెక్టుల గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ పౌరులను అభినందించారు.

కాశీ, తూర్పు ఉత్తర్ ప్రదేశ్ లలో అభివృద్ధి పధకాల పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి, ముందు రోజు రాత్రి అతిథి గృహానికి వెళ్తూ తన రోడ్ ట్రిప్ ను గుర్తు చేసుకున్నారు. ఫుల్వారియా ఫ్లైఓవర్ ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రస్తావించారు.  బి ఎల్ డబ్ల్యూ నుంచి విమానాశ్రయానికి ప్రయాణ సౌలభ్యం మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ పర్యటన నుంచి రాత్రి వచ్చిన వెంటనే ప్రధాని  అభివృద్ధి ప్రాజెక్టును పరిశీలించారు. గడచిన 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, సిగ్రా స్పోర్ట్స్ స్టేడియం ఫేజ్-1, డిస్ట్రిక్ట్ రైఫిల్ షూటింగ్ రేంజ్ ఈ ప్రాంతంలోని యువ అథ్లెట్లకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.

 

|

బనాస్ డెయిరీని సందర్శించడం, పలువురు పశుపాలకుల మహిళలతో సంభాషించడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వ్యవసాయ నేపథ్యం ఉన్న మహిళలకు అవగాహన కల్పించేందుకు 2-3 సంవత్సరాల క్రితం గిర్ గై దేశవాళీ జాతులను అందించినట్లు తెలిపారు. గిర్ గై ల సంఖ్య ఇప్పుడు దాదాపు 350కి చేరుకుందని పేర్కొన్న ప్రధాన మంత్రి, సాధారణ ఆవులు ఉత్పత్తి చేసే ఐదు లీటర్ల పాలతో పోలిస్తే వారు 15 లీటర్ల వరకు పాలను ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. అలాంటి గిర్ గై 20 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోందని, తద్వారా మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుందని, వారిని లఖ్పతి దీదీలుగా తయారు చేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న 10 కోట్ల మంది మహిళలకు ఇది పెద్ద ప్రేరణ అని ఆయన అన్నారు.

రెండేళ్ల క్రితం బనాస్ డెయిరీకి శంకుస్థాపన జరిగిన సంఘటనను గుర్తు చేసిన ప్రధాన మంత్రి, ఆ రోజు ఇచ్చిన హామీ నేడు ప్రజల ముందు ఉందని అన్నారు. సరైన పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు బనాస్ డెయిరీ మంచి ఉదాహరణ అన్నారు. వారణాసి, మీర్జాపూర్, గాజీపూర్, రాయ్ బరేలి నుంచి బనాస్ డెయిరీ సుమారు 2 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. కొత్త ప్లాంట్ ప్రారంభంతో బల్లియా, చందౌలి, ప్రయాగ్రాజ్, జౌన్పూర్ కు చెందిన పశుపాలకులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ ప్రాజెక్టు కింద వారణాసి, జౌన్పూర్, చందౌలి, గాజీపూర్, అజంగఢ్ జిల్లాల్లోని 1000కు పైగా గ్రామాల్లో కొత్త పాల మండీలను ఏర్పాటు చేయనున్నారు.

బనాస్ కాశీ సంకుల్ వేలాది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ఒక అంచనా ప్రకారం, బనాస్ కాశీ సంకుల్ మూడు లక్షలకు పైగా రైతుల ఆదాయాన్ని పెంచుతుందని ప్రధాన మంత్రి అన్నారు. మజ్జిగ, పెరుగు, లస్సీ, ఐస్ క్రీం, పనీర్, ప్రాంత స్వీట్స్ వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీని కూడా ఈ యూనిట్ చేపట్టనుంది. బనారస్ స్వీట్లను భారతదేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. పాల రవాణా ఉపాధి సాధనంగా, పశు పోషకాహార పరిశ్రమకు ఊతమిచ్చే సాధనంగా ఆయన పేర్కొన్నారు. పాడిపరిశ్రమలో మహిళల ప్రాబల్యాన్ని గుర్తించి పశుపాలక్ సోదరీమణుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని డెయిరీ యాజమాన్యాన్ని ప్రధాని కోరారు. చిన్న రైతులు, భూమిలేని కూలీలను ఆదుకోవడంలో పశుపోషణ పాత్రను ప్రధాన మంత్రి వివరించారు.

 

|

ఉర్జా డేటా నుంచి ఉర్వారా దత్తా వరకు అన్నదాతను తయారు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. గోబర్ ధన్ లో ఉన్న అవకాశాల గురించి తెలియ చేస్తూ, బయో  సి ఎన్ జి , సేంద్రియ ఎరువు తయారీ కోసం డెయిరీలో ఉన్న ప్లాంట్ గురించి వివరించారు. గంగా నది ఒడ్డున పెరుగుతున్న ప్రకృతి వ్యవసాయం గురించి ప్రస్తావిస్తూ,  గోబర్ ధన్ పథకం కింద సేంద్రియ ఎరువు ఉపయోగాన్ని ప్రధాన మంత్రి వివరించారు. పట్టణ వ్యర్థాలను ఎన్ టి పి సి చార్కోల్ ప్లాంట్ కు తరలించడాన్ని ప్రస్తావిస్తూ, 'కచ్రాను కంచన్'గా మార్చాలన్న కాశీ స్ఫూర్తిని ప్రధాన మంత్రి ప్రశంసించారు.

రైతులు, పశువుల పెంపకందారుల (కిసాన్ ఔర్ పశుపాలక్ ) అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. గత క్యాబినెట్ సమావేశంలో చెరకు ఎఫ్ ఆర్ పి ని క్వింటాలుకు రూ.340కి సవరించడం, జాతీయ పశుసంవర్ధక మిషన్ సవరణతో పశుదాన్ బీమా కార్యక్రమాన్ని సడలించడాన్ని ఆయన ప్రస్తావించారు. రైతుల బకాయిలు చెల్లించడమే కాకుండా పంటల ధరలు కూడా పెంచుతున్నామని చెప్పారు.

"ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ కు పునాది అవుతుంది" అని ప్రధాన మంత్రి అన్నారు, గత ప్రభుత్వ ఆలోచనా విధానానికి, ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనా విధానానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. దేశంలో ఉన్న చిన్న చిన్న అవకాశాలను పునరుత్తేజపరిచి, చిన్న రైతులు, పశుపాలకులు, చేతివృత్తులవారు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సహాయం అందించినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ సాకారమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. వోకల్ ఫర్ లోకల్ పిలుపు అనేది టెలివిజన్ , వార్తాపత్రికలలో వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చు చేయలేని మార్కెట్ లోని చిన్న సంస్థలకు వాణిజ్య ప్రకటన వంటిదని ప్రధాన మంత్రి అన్నారు. ‘స్వదేశీ వస్తువులను ఉత్పత్తి చేసే వారికి మోదీ స్వయంగా వ్యాపార ప్రకటనలు ఇస్తున్నారని‘ అన్నారు. “ఖాదీ, బొమ్మల తయారీదారులు, మేక్ ఇన్ ఇండియా, దేఖో అప్నా దేశ్ వంటి ప్రతి చిన్న రైతు, పరిశ్రమకు మోదీ అంబాసిడర్” అని అన్నారు. విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరణ తర్వాత 12 కోట్లకు పైగా పర్యాటకులు నగరాన్ని సందర్శించిన కాశీలోనే ఇటువంటి పిలుపు ప్రభావం కనిపిస్తోందని, దీనివల్ల ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. వారణాసి, అయోధ్య కోసం ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ) అందించిన ఎలక్ట్రిక్ క్యాటమారన్ నౌకను ప్రారంభించడం గురించి ప్రస్తావిస్తూ, ఇది సందర్శించేవారికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని సృష్టిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

 

|

వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి, బుజ్జగింపుల దుష్ప్రభావాలను ప్రధాని వివరించారు. కాశీ యువతను కొన్ని వర్గాలు కించపరుస్తున్నాయని ఆయన విమర్శించారు. యువత ఎదుగుదలకు, వారసత్వ రాజకీయాలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఆయన వివరించారు. ఈ శక్తులలో కాశీ, అయోధ్య కొత్త రూపం పట్ల ద్వేషం ఉందని ఆయన పేర్కొన్నారు.

"మోదీ మూడవ పదవీకాలం భారతదేశ సామర్థ్యాలను ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకువస్తుంది. భారతదేశ ఆర్థిక, సామాజిక, వ్యూహాత్మక, సాంస్కృతిక రంగాలు కొత్త శిఖరాలకు చేరుతాయి" అని ప్రధాన మంత్రి విశ్వాసం వ్య్యక్తం చేశారు. భారత దేశం సాధించిన పురోభివృద్ధిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గత పదేళ్లలో 11వ స్థానం నుంచి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకు వెళ్ళిందని  ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో డిజిటల్ ఇండియా, రోడ్ల వెడల్పు, రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు వంటి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. “అభివృద్ధికి దూరమైన తూర్పు భారతదేశాన్ని   వికసిత్ భారత్ కు వృద్ధి చోదకశక్తిగా మార్చడం మోదీ హామీ” అని అన్నారు.

వారణాసి నుంచి ఔరంగాబాద్ వరకు ఆరు వరుసల రహదారి మొదటి దశ ప్రారంభోత్సవం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రాబోయే ఐదు సంవత్సరాల్లో వారణాసి-రాంచీ-కోల్ కతా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం పూర్తయితే యుపి, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ల మధ్య దూరం తగ్గుతుందని అన్నారు. "భవిష్యత్తులో, బెనారస్ నుండి కోల్కతాకు ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గుతుంది", అని ఆయన అన్నారు.

 

|

రాబోయే 5 సంవత్సరాలలో కాశీ అభివృద్ధిలో కొత్త కోణాలను ప్రధాన మంత్రి అంచనా వేశారు. కాశీ రోప్ వే, విమానాశ్రయ సామర్థ్యం విపరీతంగా పెరగడం గురించి ఆయన ప్రస్తావించారు. కాశీ నగరం దేశంలో ముఖ్యమైన క్రీడా నగరంగా ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లకు కాశీ ప్రధాన పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు. రాబోయే ఐదేళ్లలో కాశీ ఉపాధి, నైపుణ్యాలకు కేంద్రంగా మారనుందన్నారు. ఈ కాలంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్ కూడా పూర్తవుతుంది, ఇది ఈ ప్రాంతంలోని యువత,  నేత కార్మికులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. “గత దశాబ్ద కాలంలో కాశీకి ఆరోగ్యం, విద్య కేంద్రంగా కొత్త గుర్తింపు తెచ్చామన్నారు. ఇప్పుడు దానికి కొత్త మెడికల్ కాలేజీని కూడా జోడించబోతున్నాం" అని ప్రధాన మంత్రి తెలిపారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ ( బి హెచ్ యు) లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఏజింగ్ తో పాటు రూ.35 కోట్ల విలువైన పలు డయాగ్నోస్టిక్ యంత్రాలు, పరికరాలను ప్రధాని ప్రారంభించారు. ఆసుపత్రి నుంచి బయో హానికారక వ్యర్థాలను తొలగించే సదుపాయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు.

ప్రసంగాన్ని ముగిస్టూ ప్రధాన మంత్రి,  కాశీ, యుపి శరవేగంగా అభివృద్ధి చెందాలని, కాశీలోని ప్రతి ఒక్కరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. “మోదీ హామీపై దేశానికి, ప్రపంచానికి అంత నమ్మకం ఉందంటే దానికి కారణం   మీ అభిమానం, బాబా ఆశీర్వాదం” అని అన్నారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ ,  ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రిజేష్ పాఠక్ , కేంద్ర మంత్రి శ్రీ మహేంద్ర నాథ్ పాండే, బనాస్ డెయిరీ చైర్మన్ శ్రీ శంకర్ భాయ్ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

వారణాసిలో రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగు పరచడం కోసం పలు రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, ప్శంకుస్థాపన చేశారు. నాలుగు లేన్ల గా ఎన్ హెచ్ -233 లోని ఘర్గ్రా-బ్రిడ్జి-వారణాసి సెక్షన్ ; ఎన్ హెచ్-56, ప్యాకేజీ-1 లోని సుల్తాన్ పూర్ -వారణాసి సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం; ఎన్ హెచ్-19 లోని వారణాసి-ఔరంగాబాద్ సెక్షన్ ఫేజ్-1ను ఆరు లేన్లుగా మార్చడం; ఎన్ హెచ్ -35పై ప్యాకేజీ-1 వారణాసి-హనుమంత సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం; బాబత్ పూర్ సమీపంలోని వారణాసి- జౌన్ పూర్ రైలు మార్గంలో ఆర్ ఒ బి నిర్మాణం ఇందులో ఉన్నాయి. వారణాసి-రాంచీ-కోల్ కతా ఎక్స్ ప్రెస్ వే ప్యాకేజీ-1 నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రధాన మంత్రి సేవాపురిలో హెచ్ పిసిఎల్ ద్వారా ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ కార్ఖియాన్ లో బనాస్ కాశీ సంకుల్ పాల ప్రాసెసింగ్ యూనిట్; కర్ఖియాన్ లోని యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ వద్ద వివిధ మౌలిక సదుపాయాల పనులు; చేనేత కార్మికుల కొరకు సిల్క్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కామన్ ఫెసిలిటీ సెంటర్ లను ప్రారంభించారు.

 

|

వారణాసిలో పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. రమణ వద్ద ఎన్ టిపిసి ద్వారా అర్బన్ వేస్ట్ టు చార్కోల్ ప్లాంట్;  సిస్-వరుణ ప్రాంతంలో నీటి సరఫరా నెట్వర్క్ ను మెరుగుపరచడం;  ఎస్ టిపిలు , మురుగునీటి పంపింగ్ స్టేషన్ల ఆన్ లైన్ వ్యర్థాల పర్యవేక్షణ , స్కాడా ఆటోమేషన్ మొదలైనవి. ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ, పార్కుల పునర్నిర్మాణం సహా వారణాసి సుందరీకరణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు,  ఇంకా 3 డి అర్బన్ డిజిటల్ మ్యాప్ , డేటాబేస్ రూపకల్పన  అభివృద్ధి కి ప్రధాని శంకుస్థాపన చేశారు.

వారణాసిలో టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. వీటిలో - పది ఆధ్యాత్మిక యాత్రతో పంచకోషి పరిక్రమ మార్గ్,  పవన్ పథ్ లోని ఐదు పడావ్ లలో ప్రజా సౌకర్యాల పునరాభివృద్ధి ; వారణాసి,  అయోధ్య కోసం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ) అందించిన ఎలక్ట్రిక్ క్యాటమరన్ నౌకను ప్రారంభించడం; ఏడు ఛేంజ్ రూమ్ లు తేలియాడే జెట్టీలు ,  నాలుగు కమ్యూనిటీ జెట్టీలు ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా గంగానదిలో పర్యాటక అనుభవాన్ని ఎలక్ట్రిక్ కాటమరన్ మెరుగుపరుస్తుంది. ప్రధాన మంత్రి వివిధ నగరాల్లో ఐడబ్ల్యూఏఐకి చెందిన పదమూడు కమ్యూనిటీ జెట్టీల కు, బలియాలో క్విక్ పొంటూన్ ఓపెనింగ్ మెకానిజానికి శంకుస్థాపన చేశారు.

వారణాసిలోని ప్రసిద్ధ టెక్స్ టైల్ రంగానికి ఊతమిచ్చేలా వారణాసిలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కొత్త సంస్థ టెక్స్ టైల్ రంగంలో విద్య, శిక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.

ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు, వారణాసిలో కొత్త వైద్య కళాశాలకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. బిహెచ్ యు లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఏజింగ్ కు ఆయన శంకుస్థాపన చేశారు. సిగ్రా స్పోర్ట్స్ స్టేడియం ఫేజ్-1, డిస్ట్రిక్ట్ రైఫిల్ షూటింగ్ రేంజ్ లను ప్రధాన మంత్రి ప్రారంభించారు, ఇది నగరంలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ఒక అడుగు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi Distributes Over 51,000 Appointment Letters At 15th Rozgar Mela

Media Coverage

PM Modi Distributes Over 51,000 Appointment Letters At 15th Rozgar Mela
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh
April 27, 2025
QuotePM announces ex-gratia from PMNRF

Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The Prime Minister's Office posted on X :

"Saddened by the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"