ప్రధాన మంత్రి శ్రీ  నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరియు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు  కు ఈ రోజు న బెంగళూరు లోని కెఎస్ఆర్ రైల్ వే స్టేశన్ లో పచ్చజెండా ను చూపించి, ఆ రైళ్ళ ను ప్రారంభించారు.

ప్రధాన మంత్రి క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ (కెఎస్ఆర్) రైల్ వే స్టేశన్ లో 7వ నంబరు ప్లాట్ ఫార్మ్ కు  చేరుకొని, చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి సిగ్నల్ ను చూపెట్టారు.  ఇది దేశం లో అయిదో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కానుంది.  అంతేకాకుండా, ఇది దక్షిణ భారతదేశం లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా కానుంది.  ఇది పారిశ్రామిక కేంద్రం అయినటువంటి చెన్నై కి, టెక్ మరియు స్టార్ట్-అప్ కేంద్రం అయినటువంటి బెంగళూరు కు, ఇంకా ప్రముఖ పర్యటక నగరం అయినటువంటి మైసూరు కు మధ్య సంధానాన్ని పెంపొందింప చేయనుంది.

|

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ సంధానించడం తో పాటు వాణిజ్యపరమైన కార్యకలాపాల కు ఊతం గా కూడా నిలవనుంది.  ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ సైతం ఇది వృద్ధి చెందింపచేయనుంది.  బెంగళూరు లో ఈ రైలు కు ప్రారంభ సూచక జెండా ను చూపెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

దీనికి తరువాయి గా ప్రధాన మంత్రి 8వ నంబరు ప్లాట్ ఫార్మ్ కు చేరుకొన్నారు. ఆయన భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలు కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చని సిగ్నల్ ను ఇచ్చారు.  కర్నాటక నుండి యాత్రికుల ను కాశీ కి పంపించడం కోసం కర్నాటక ప్రభుత్వం మరియు రైల్ వే ల మంత్రిత్వ శాఖ కలసికట్టు గా భారత్ గౌరవ్ పథకం లో భాగం గా ఈ రైలు ను తీసుకు వచ్చాయి.  ఈ తరహా రైలు ను తీసుకు వచ్చినటువంటి మొదటి రాష్ట్రం కర్నాటక యే.  యాత్రికులు కాశీ ని, అయోధ్య ను మరియు ప్రయాగ్ రాజ్ ను సందర్శించడం కోసం సౌకర్యవంతమైన బస ను, ఇంకా మార్గదర్శనాన్ని వారికి అందించడం జరుగుతుంది.

|

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలు ను అందిస్తున్న ఒకటో రాష్ట్రం గా కర్నాటక ముందుకు వచ్చినందుకు కర్నాటక ను నేను అభినందించ దలచుకొన్నాను.  ఈ రైలు కాశీ ని మరియు కర్నాటక ను సన్నిహితం చేయడం తో పాటు గా యాత్రికులు మరియు పర్యటకులు కాశీ ని, అయోధ్య ను, ఇంకా ప్రయాగ్ రాజ్ ను సౌలభ్యవంతం గా సందర్శించ గలుగుతారు.’’ అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి వెంట కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లతో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు అశ్వనీ వైష్ణవ్ మరియు ప్రహ్లాద్ జోశి లు ఉన్నారు.

పూర్వరంగం

·         వందే భారత్ ఎక్స్ ప్రెస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 లో ప్రయాణికుల కు అనేక ఉన్నతమైన సౌకర్యాలతో పాటు విమానం లో లభ్యం అయ్యేటటువంటి సదుపాయాలు సైతం అందుబాటు లో ఉంటాయి. దేశీయం గా రూపొందించిన అటువంటి ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టం అయిన ‘కవచ్’ సహా అత్యాధునిక సురక్ష సంబంధి పరికరాల ను ఈ రైలు కు జోడించడమైంది. వందే భారత్ 2.0 లో మరిన్ని అదనపు సౌకర్యాల ను జతపరచడమైంది. ఉదాహరణ కు తీసుకొంటే, ఈ రైలు కు కేవలం 52 సెకన్ లలో గంట కు 100 కిలోమీటర్ వేగాన్ని అందుకోగలగడం మరియు గంట కు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందిపుచ్చుకోగలగడం వంటి మెరుగైన లక్షణాల ను సంతరించడమైంది.  ఇదివరకటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ 430 టన్నుల వర్శన్ తో పోల్చి చూసినప్పుడు సరికొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ బరువు 392 టన్నులు గా మాత్రమే ఉంటుంది. దీనిలో వై- ఫై కంటెంట్ ఆన్- డిమాండ్ సౌకర్యం సైతం లభిస్తుంది. మునుపటి వర్శన్ లోని 24 అంగుళాల తెర లతో పోలిస్తే ఈ రైలు లోని ప్రతి ఒక్క రైలు పెట్టె లో 32 అంగుళాల తెర లు ప్రయాణికులకు సమాచారం తో పాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ పర్యావరణ పరం గా చూసినప్పుడు సైతం ప్రయాణికుల కు అనుకూలం గా ఉంటుంది. ఎలాగంటే దీని లోని ఏసీ లు శక్తి ని 15 శాతం అధికం గా ఆదా చేయగలుగుతాయి. దీని లోని ట్రాక్శన్ మోటారు కు ధూళి రహిత స్వచ్ఛ శీత గాలి ని వెలువరించే సదుపాయం కల్పించడం తో ఈ రైలు లో ప్రయాణించడం మరింత సుఖప్రదం గా ఉంటుంది. ఇదివరకటి వందే భారత్ రైలు లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించే వారికి మాత్రమే అందించిన సైడ్ రిక్లైనర్ సీట్ సౌకర్యాన్ని ఇప్పుడు అన్ని క్లాసుల కు అందుబాటు లోకి తీసుకురావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ రైలు పెట్టెల కు 180 డిగ్రీ లు వంపు తిరిగే సీట్ ల సౌకర్యాన్ని కూడా కల్పించడమైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క కొత్త రూపు రేఖల లో భాగం గా గాలి ని శుభ్రపరచడం కోసం రూఫ్ మౌంటెడ్ పేకేజ్ యూనిటు (ఆర్ఎమ్ పియు) లో ఒక ఫోటో కేటలిటిక్ అల్ట్రా వాయ్ లెట్ ఎయర్ ప్యూరిఫికేశన్ సిస్టమ్ ను నెలకొల్పడమైంది. ఈ వ్యవస్థ ను చండీగఢ్ లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ఆర్గనైజేశన్ (సిఐఎస్ఒ) సిఫారసు చేసిన ప్రకారం రూపుదిద్దడమైంది. దీనిని ఆర్ఎమ్ పియు యొక్క రెండు చివరల లోను అమర్చడమైంది. వీచే గాలి లో మరియు తిరిగి బయటకు పోయే గాలి లో రోగకారక క్రిములు, కీటకాలు, సూక్ష్మ జీవులు, వైరస్ లు వంటి వాటి ని వడగట్టి, స్వచ్ఛమైన వాయువు ను అందించేటట్టు ఈ ఏర్పాటు ను చేయడమైంది. 

·         భారత్ గౌరవ్ రైళ్ళు

భారతీయ రైల్ వే లు ఇతివృత్తం ప్రధానం గా ఉండేటటువంటి భారత్ గౌరవ్ రైలు కార్యకలాపాల ను 2021వ సంవత్సరం నవంబర్ నెల లో మొదలుపెట్టింది.  భారతదేశం యొక్క ఘనమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని మరియు వైభవోపేతమైనటువంటి చారిత్రిక ప్రదేశాల ను భారత్ గౌరవ్ రైళ్ళ మాధ్యమం ద్వారా భారతదేశ ప్రజల కు, అలాగే ప్రపంచాని కి కళ్ళ కు కట్టాలి అనేదే ఈ ఇతివృత్తం యొక్క ఉద్దేశ్యం గా ఉంది.  ఈ పథకం పర్యటన రంగం లోని వృత్తి నిపుణుల కీలకమైన బలాల ను ఆలంబన గా చేసుకొని, భారతదేశ పర్యటన రంగం లోని విస్తృత అవకాశాల ను సద్వినియోగ పరచుకోవడం కోసం ఇతివృత్తం ఆధారిత రైళ్ల ను నడపాలి అన్నది కూడా ఈ పథకం యొక్క ఉద్దేశ్యాల లో ఒకటి గా ఉంది.

.

  • Babla sengupta December 23, 2023

    Babla sengupta
  • Hargovind joshi November 20, 2022

    आपश्री भारत को सुवर्ण युग की और ले जा रहे है एवं भारतीय सनातन संस्कृति को जीवित कर रहे है यही हमरी भारतमाता का गौरव है इसलिए ही नयी रेल का नाम वंदे भारत रखा है यह माननीय प्रधानसेवक जी को बाबा केदारनाथ के ईष्ट की शक्ति से प्राप्त हुआ है। इसी तरह पूरे भारतवर्ष मे अंग्रेजों के जमाने के नेहरु द्वारा दिये गये रेल्वे स्टेशनो के नाम भी सनातन संस्कृति के आधार पर ही होने चाहिए मुगलो के नाम बिल्कुल ही हटाने की कौशिश करना जरूरी है चाहे इसके लिए कानून ही बनाना पड जाये।
  • Hargovind joshi November 20, 2022

    करने की हार्दिक बधाई एवं शुभकामनाएं
  • Hargovind joshi November 20, 2022

    हमारा प्रधानसेवक हमारा गौरव सम्माननीय प्रधानसेवक एवं रेलमंत्री माननीय अश्विनी वैष्णव को कर्नाटक में दो रेल सेवाओं को हरी झण्डी दिखाकर प्रारंभ कने
  • Vijay kumar Gupta November 17, 2022

    Aap laisa koi desh main aajaye to baat ban jaye.
  • Subhash Sadashiv November 16, 2022

    भारत के लिये यह सुवर्णयुग की शुरुवात है अभिमान और गर्व हो रहा है मुझे ऐसे अच्छे दिन आनेकी वजह से यह सरकार और सारे सरकारी कर्मचारी योकी वजह से यह हो रहा है, जय हिंन्द
  • Markandey Nath Singh November 12, 2022

    मेरा प्रधानमंत्री - मेरा अभिमान
  • अनन्त राम मिश्र November 12, 2022

    जय हिन्द जय भारत बंदेमातरम् जय हो बिजय हो
  • Gangadhar Rao Uppalapati November 12, 2022

    Jai Bharat.
  • Venkatesapalani Thangavelu November 12, 2022

    Wow Wonderful Mr.PM Shri Narendra Modi Ji, your connectivity deliverables prioritised national governance, connects India to its all places of pride and importance, as well it creates larger opportunities to prosper and develop. The Vande Bharat Express and Shri Kashi , new rail routes will enhance National and International Tourisms , as Bengaluru Karnataka is one of the hub of traveling natives and foreigners India salutes you Ji We the people of TN congrats all Karnataka people .
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas

Media Coverage

India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 ఫెబ్రవరి 2025
February 22, 2025

Citizens Appreciate PM Modi's Efforts to Support Global South Development