జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్పిఎ) చరిత్రలో తొలిసారిగా మార్చి 30నాటికి 6 మిలియన్ ‘టిఇయు’ల సరుకు రవాణా సామర్థ్య స్థాయిని అధిగమించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై ‘జెఎన్పిఎ' అధికారిక ట్వీట్కు స్పందనగా పంపిన సందేశంలో:
“భారతదేశంలోని కీలక ఓడరేవులలో ఒకటి గుర్తించదగిన స్థాయిలో సాధించిన ఘనత నాకెంతో సంతోషం కలిగిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు.
Noteworthy feat by one of India’s important ports. https://t.co/bbTufvf2z5
— Narendra Modi (@narendramodi) April 1, 2023