న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 10న జర్మనీ గణతంత్ర సమాఖ్య చాన్సలర్ గౌరవనీయ ఓలాఫ్ స్కోల్జ్‌ తో సమావేశమయ్యారు. కాగా, 2023 ఫిబ్రవరిలో తొలిసారి భారత్‌లో పర్యటించిన స్కోల్జ్‌, ప్రస్తుతం జి-20 సదస్సులో పాల్గొనేందుకు రెండోసారి వచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని ఆయన అభినందించారు.

   భారత్‌ అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో జర్మనీ సంపూర్ణ మద్దతు ఇవ్వడాన్ని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ జి-20 శిఖరాగ్ర సదస్సు సమావేశాలు, కార్యక్రమాల్లో ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని నేతలిద్దరూ సమీక్షించారు. రక్షణ, హరిత-సుస్థిర ప్రగతి, కీలక ఖనిజాలు, నిపుణ మానవశక్తి ఆదానప్రదానం, విద్య వగైరా రంగాల్లో సహకార విస్తరణకుగల మార్గాలపైనా వారు చర్చించారు.

   మరోవైపు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, వచ్చే ఏడాది అంతర-ప్రభుత్వ కమిషన్‌ సమావేశం నేపథ్యంలో భారత్‌లో పర్యటించాల్సిందిగా చాన్సలర్‌ స్కోల్జ్‌ ను ప్రధాని ఆహ్వానించారు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India eyes potential to become a hub for submarine cables, global backbone

Media Coverage

India eyes potential to become a hub for submarine cables, global backbone
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 మార్చి 2025
March 10, 2025

Appreciation for PM Modi’s Efforts in Strengthening Global Ties