Prime Minister condoles the loss of lives in boat mishap in Mumbai
PM announces ex-gratia from PMNRF

మహారాష్ట్రలోని ముంబయిలో పడవ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వనున్నట్లు, గాయపడ్డవారికి రూ. 50,000 వంతున ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:

‘‘ముంబయిలో జరిగిన పడవ ప్రమాదం విచారకరం. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అవసరమైన సాయాన్ని అధికారులు అందిస్తున్నారు: ప్రధానమంత్రి @narendramodi”.

‘‘ముంబయి పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల రూపాయల వంతున నష్టపరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారికి రూ.50,000 వంతున ఇస్తారు.’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power

Media Coverage

Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 డిసెంబర్ 2025
December 25, 2025

Vision in Action: PM Modi’s Leadership Fuels the Drive Towards a Viksit Bharat