QuotePM Modi to inaugurate a stretch of the new Magenta line of the Delhi Metro on 25th December
QuotePM Modi to undertake metro ride from Botanical Garden, address public meeting
Quote5 new Metro Rail Projects covering a total length of over 140 kilometres approved by Centre
QuoteMetro Lines of around 250 kilometre length are proposed to be commissioned over the next two years

ఢిల్లీ మెట్రో నిర్మించిన నూత‌న మెజెంటా మెట్రో రైల్ లైనును ఈ నెల 25న ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ ప్రారంభించ‌నున్నారు. ఈ కొత్త లైను నోయిడాలోని బొటానిక‌ల్ ఉద్యాన‌వ‌నాన్ని, ఢిల్లీలోని క‌ల్కాజీ మందిర్ తో క‌లుపుతుంది. ఈ లైను కార‌ణంగా నోయిడా, ద‌క్షిణ ఢిల్లీల మ‌ధ్య‌న గ‌ల దూరం గ‌ణ‌నీయంగా త‌గ్గ‌నుంది. ఈ సంద‌ర్భంగా నోయిడాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌నుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగిస్తారు.

దేశంలో న‌గ‌ర ప్రాంతాల్లో ర‌వాణా సౌక‌ర్యాల‌ను ఆధునీక‌రించాల‌నే కేంద్ర ప్ర‌భుత్వ సంక‌ల్పానికి అనుగుణంగా ఈ నూత‌న మెట్రో రైలును నిర్మించ‌డం జ‌రిగింది. సాంకేతికత‌కు పెద్ద పీట వేస్తూ, ప‌ర్యావ‌ర‌ణ హిత న‌గ‌ర ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌ను నెల‌కొల్పడానికి అనుగుణంగా కేంద్రం చేప‌ట్టిన కార్య‌క్ర‌మ‌మిది.

ఈ ఏడాది ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభ‌మ‌వుతున్న మూడోమెట్రో లైను ఇది. ఈ సంవ‌త్స‌రం జూన్ నెల‌లో ఆయ‌న కొచ్చి మెట్రో ను జాతికి అంకితం చేశారు. న‌వంబ‌ర్ నెల‌లో హైద‌రాబాద్ మెట్రోను ప్రారంభించారు. ఈ రెండు ప్రారంభోత్స‌వాల స‌మ‌యంలో చేసిన‌ట్టుగానే ఈ సారి కూడా ప్ర‌ధాని ఈ నూత‌న మెట్రో రైలు లైనులో ప్ర‌యాణం చేసి ఆ త‌ర్వాత బ‌హిరంగ‌స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడ‌తారు.

రాజ‌ధాని ప్రాంతంలో ప‌లు కార్య‌క్ర‌మాలకు హాజ‌రు కావ‌డానికిగాను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ త‌ర‌చూ మెట్రో రైలులో ప్ర‌యాణం చేస్తున్నారు. 2016 జ‌న‌వ‌రిలో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హొలాండే తో క‌లిసి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ ఢిల్లీనుంచి గుర‌గావ్ వ‌ర‌కూ ప్ర‌యాణం చేశారు. ఆ త‌ర్వాత వారు అక్క‌డ అంత‌ర్జాతీయ సౌర వేదిక ప్ర‌ధాన కార్యాల‌యంకోసం శంకుస్థాప‌న చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో ప్ర‌ధాని శ్రీ మోదీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాని శ్రీ మాల్క‌మ్ ట‌ర్న్ బుల్ తో క‌లిసి అక్ష‌ర ధామ్ దేవాల‌యంవ‌ర‌కూ మెట్రోలో ప్రయాణం చేశారు.

వేగంగా ప్ర‌యాణం చేయ‌డానికి వీలుగా వుండే ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌ద్వారా క‌నెక్టివిటీని పెంచాలనే ల‌క్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్ర‌భుత్వం గ‌త మూడున్న సంవ‌త్స‌రాల‌లో తొమ్మిది మెట్రో ప్రాజెక్టుల‌ను ప్రారంభించింది. దాదాపుగా 165 కిలోమీట‌ర్ల దూరం వుండే మెట్రో ప్రాజెక్టులివి.. 140 కిలోమీట‌ర్ల దూరంగ‌ల ఐదు నూత‌న మెట్రో రైలు ప్రాజెక్టుల‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. 250 కిలోమీట‌ర్ల దూరంగ‌ల మెట్రో లైన్ల‌ను రాబోయే రెండు సంవ‌త్స‌రాల‌లో చేప‌ట్టాల‌ని ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM extends greetings on Rajasthan Day
March 30, 2025

The Prime Minister, Shri Narendra Modi extended warm wishes to the people of Rajasthan on the occasion of Rajasthan Day today. He expressed hope that the state will continue to thrive and make invaluable contributions to India's journey toward excellence.

In a post on X, he wrote:

“अद्भुत साहस और पराक्रम के प्रतीक प्रदेश राजस्थान के अपने सभी भाई-बहनों को राजस्थान दिवस की अनेकानेक शुभकामनाएं। यहां के परिश्रमी और प्रतिभाशाली लोगों की भागीदारी से यह राज्य विकास के नित-नए मानदंड गढ़ता रहे और देश की समृद्धि में अमूल्य योगदान देता रहे, यही कामना है।”