PM Modi meets Directors and Deputy Secretaries, urges them to work with full dedication towards creation of New India by 2022
Silos are big bottleneck in functioning of the Government, adopt innovative ways to break silos, speed up governance: PM to officers

భార‌త ప్ర‌భుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖ‌లలోనూ, విభాగాలలోనూ ప‌ని చేస్తున్న డైరెక్ట‌ర్లు, ఇంకా డిప్యూటీ సెక్ర‌ట‌రీలు దాదాపు 380 మందితో కూడిన నాలుగు బృందాల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మావేశ‌మై చ‌ర్చ జ‌రిపారు. ఈ ముఖాముఖి చ‌ర్చ‌లు 2017 అక్టోబ‌ర్ నెల‌లో వేరు వేరు రోజుల‌లో సాగాయి. వీటిలో క‌డ‌ప‌టి సంభాష‌ణ 2017, అక్టోబ‌ర్ 17వ తేదీన చోటు చేసుకొంది. ప్ర‌తి స‌మావేశం సుమారు రెండు గంట‌ల పాటు కొన‌సాగింది.

ముఖాముఖి చ‌ర్చ‌ల‌లో.. ప‌రిపాల‌న, అవినీతి, ప్ర‌భుత్వ సంస్థ‌లు, ప్ర‌భుత్వానికి చెందిన ఇ-మార్కెట్ ప్లేస్‌, ఆరోగ్యం, విద్య‌, నైపుణ్యాల అభివృద్ధి, వ్య‌వ‌సాయం, ర‌వాణా, జాతీయ స‌మైక్య‌త‌, జ‌ల‌ వ‌న‌రులు, స్వ‌చ్ఛ భార‌త్‌, సంస్కృతి, క‌మ్యూనికేష‌న్ మ‌రియు ప‌ర్య‌ట‌న ల వంటి అంశాల‌పై చ‌ర్చలు జ‌రిగాయి.

2022 క‌ల్లా ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం దిశ‌గా పూర్తి అంకిత భావంతో ప‌ని చేయాల‌ని అధికారుల‌కు ప్ర‌ధాన మంత్రి ఉద్బోధించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప‌నితీరులో గిరి గీసుకొని ఉండ‌డం అనేది ఒక పెద్ద ప్ర‌తిబంధ‌కంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ అడ్డుగోడ‌ల‌ను ఛేదించ‌డం కోసం కొత్త కొత్త మార్గాల‌ను అనుస‌రించాల‌ని, ఇలా చేస్తే ప‌రిపాల‌న‌లో వివిధ ప్ర‌క్రియ‌ల‌ను వేగ‌వంతం చేయ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని అధికారుల‌కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఇదే తీరులో డైరెక్ట‌ర్ మ‌రియు డిప్యూటీ సెక్ర‌ట‌రీ స్థాయి అధికారులు తప్పక బృందాలుగా ఏర్ప‌డి, ఉత్త‌మ ఫ‌లితాల‌ను సాధించాల‌ని కూడా ఆయ‌న సూచించారు.

ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పిఎమ్ఒ) స‌హాయ మంత్రి శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ తో పాటు, పిఎమ్ఒకు, కేబినెట్ సెక్ర‌టేరియ‌ట్‌ కు చెందిన సీనియ‌ర్ అధికారులు ఈ ముఖాముఖి స‌మావేశాల‌లో పాల్గొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”