PM Narendra Modi dedicates multiple development projects in Jharkhand
Development projects in Jharkhand will add to the state’s strength, empower poor and tribal communities: PM
The poor in India wish to lead a life of dignity, and seek opportunities to prove themselves: PM Modi
‘Imandari Ka Yug’ has started in India; youth wants to move ahead with honesty: PM Modi

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ఖండ్ లోని సాహెబ్గంజ్ లో అభివృద్ధి పథకాలను ఈ రోజు ప్రారంభించారు.

గంగా నది మీదుగా నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి, దానితో పాటే ఒక మల్టి- మోడల్ టర్మినల్ కు ఆయన శంకు స్థాపన చేశారు. వారాణసీ నుండి హల్దియా వరకు జాతీయ జల మార్గాన్ని అభివృద్ధిపరచే ప్రక్రియలో మల్టి- మోడల్ టర్మినల్ ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.

ప్రధాన మంత్రి 311 కిలోమీటర్ల మేర సాగే గోవింద్ పూర్-జమ్ తారా-దుమ్ కా-సాహెబ్ గంజ్ హైవేను ప్రారంభించారు; ఇంకా, సాహెబ్ గంజ్ జిల్లా న్యాయస్థాన భవనం వద్ద మరియు సాహెబ్ గంజ్ జిల్లా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఒక సౌర విద్యుత్తు సదుపాయాన్ని కూడా ఆయన దేశ ప్రజలకు అంకితం చేశారు.

ప్రధాన మంత్రి పహాడియా స్పెషల్ ఇండియా రిజర్వ్ బెటాలియన్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలను; స్వయంసహాయక బృందాలకు చెందిన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్మార్ట్ ఫోన్ లను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ అభివృద్ధి పథకాలు సంథాల్ పరగణా ప్రాంతానికి మేలు చేస్తాయని, ఆదివాసీ సముదాయాలకు మరింత సాధికారతను ప్రసాదించడంలో తోడ్పడుతాయన్నారు. భారతదేశంలోని పేద ప్రజలు గౌరవంగా జీవించాలని కోరుకుంటున్నారని, వారు తమను తాము నిరూపించుకొనేందుకు తగ్గ అవకాశాలను వాంఛిస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు. వారి సామర్థ్యం పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన చెప్పారు.

భారతదేశంలో నిజాయతీతో కూడిన శకం ఆరంభమైందని ప్రధాన మంత్రి అన్నారు. పేదలు వారికి దక్కవలసింది పొందేటట్లు చూసేందుకు తాను పడుతున్న ప్రయాస సఫలం కావడంలో ప్రజల దీవెనలు తనకు కావాలని ఆయన కోరారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12మార్చి 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise