QuotePM Modi inaugurates the Mohanpura Irrigation Project & several other projects in Rajgarh, Madhya Pradesh
QuoteIt is my privilege to inaugurate the Rs. 4,000 crore Mohanpura Irrigation project for the people of Madhya Pradesh, says PM Modi
QuoteUnder the leadership of CM Shivraj Singh Chouhan, Madhya Pradesh has written the new saga of development: PM Modi
QuoteIn Madhya Pradesh, 40 lakh women have been benefitted from #UjjwalaYojana, says PM Modi in Rajgarh
QuoteDouble engines of Bhopal, New Delhi are pushing Madya Pradesh towards newer heights: PM Modi

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు మోహ‌న్‌పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు రాజ్‌ఘ‌ర్ జిల్లాలోని భూముల‌కు నీటిపారుద‌ల సౌక‌ర్యం క‌ల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని గ్రామాల‌కు తాగునీటిని కూడా స‌ర‌ఫ‌రా చేస్తుంది. ప్ర‌ధాన‌మంత్రి వివిధ మంచినీటి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు.

|

మోహ‌న్‌పునాలో పెద్ద‌సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, డాక్ట‌ర్ శ్యామ‌ప్ర‌సాద్ ముఖర్జీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న నివాళుల‌ర్పించారు. దేశం త‌న స్వీయ శ‌క్తి, కృషితోనే భ‌ద్రంగా ఉంటుంద‌ని డాక్ట‌ర్ శ్యామ‌ప్ర‌సాద్ ముఖర్జీ సందేశాన్ని ప్ర‌ధాని గుర్తు చేశారు.దేశ పారి్శ్రామి విధానం, విద్య‌, మ‌హిళాసాధికార‌త త‌దిత‌ర రంగాల‌లో డాక్ట‌ర్ శ్యామ‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ సేవ‌ల‌ను ఆయ‌న కొనియాడారు. విద్య‌, ఆరోగ్యం, భ‌ద్ర‌త‌కు డాక్ట‌ర్ శ్యామ ప్ర‌సాద్ ముఖర్జీ అధిక ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని ప్ర‌ధాన‌మంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన స్కిల్ ఇండియా మిష‌న్‌, స్టార్ట‌ప్ ఇండియా, ముద్రా యోజ‌న , మేక్ ఇన్ ఇండియా వంటి వ‌న్నీ డాక్ట‌ర్ శ్యామ‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ దార్శ‌నిక‌త‌కు అనుగుణ‌మైన‌వేన‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

|
|

కేంద్ర‌ప్ర‌భుత్వం గుర్తించిన ఆకాంక్షిత జిల్లాల జాబితాలో రాజ్‌ఘ‌ర్ జిల్లా ఉన్న‌ద‌ని , ఇక ఇప్పుడు అబివృద్ధిప‌నులు ఇక్క‌డ‌ వేగం పుంజుకుంటాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. దేశ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని , దేశ సామ‌ర్ధ్యాల‌పై వివ్వాసం ఉంచి  భార‌త‌దేశాన్ని 21 వ శ‌తాబ్దిలో ఉన్న‌త‌స్థాయికి తీసుకు వెళ్లేందుకు  కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. వ్య‌వ‌సాయ‌రంగంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్నఅభివృద్ధి  చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. రాష్ట్రంలో సాగు భూమిని పెంచినందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు. రాష్ట్ర నీటిపారుద‌ల ప్రాజెక్టుల ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చేందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వంతో క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వం భుజం భుజం క‌లిపి ముందుకు సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి కృషి సించాయి యోజ‌న ప‌థ‌కం కింద రాష్ట్రంలో 14 ప్రాజెక్టులు అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.  సూక్ష్మ నీటిపారుద‌ల రంగానికి కూడా ప్రాధాన్య‌త నివ్వ‌నున్న‌ట్టు ప్ర‌ధాని చెప్పారు.

|

వ్య‌వ‌సాయ‌రంగానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం భూసార ప‌రీక్షా కార్డులు, ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ఈ-నామ్ వంటి చొర‌వ‌లు చేప‌ట్టిన విష‌యాన్ని ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. ఉజ్వ‌ల యోజ‌న‌, ముద్ర యోజ‌న ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించారు.

 

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond