QuoteIndian thought is vibrant and diverse: PM Modi
QuoteFor centuries we have welcomed the world to our land: PM Modi
QuoteIn a world seeking to break free from mindless hate, violence, conflict and terrorism, the Indian way of life offers rays of hope: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఐఐఎమ్ కోషిక్కోడ్ లో స్వామి వివేకానందుల వారి నిలువెత్తు విగ్రహాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ఆవిష్కరించారు.  ‘‘గ్లోబల్ ఇండియన్ థాట్’’ తాలూకు అంతర్జాతీయ సమావేశం లో కూడా పాలు పంచుకొన్నారు.

 

ఈ సంద‌ర్భం లో స‌భికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘భార‌తీయ ఆలోచ‌న ఎంతో ఉత్తేజ‌క‌ర‌మైంది. అది స్థిరం గా నిలుస్తూ, రోజు రోజు కూ పరిణామం చెందుతోంది.   భార‌తీయ ఆలోచ‌న ఒక ఉప‌న్యాసం లోనో లేదా ఒక చర్చాసభ లోనో లేదా పుస్త‌కాల లోనో వివ‌రించ‌లేనంతటి విస్తృతమైంది.  స్థూలం గా చెప్పాలి అంటే, కొన్ని ఆద‌ర్శాలు భార‌తీయ విలువ‌ల‌ కు కేంద్రం గా నిలిచేలా  ఉండిపోయాయి.  అవి ద‌య‌, సామ‌ర‌స్య‌ం, న్యాయం, సేవ‌, దాపరికం లేని తనం’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో పేర్కొన్నారు.

|

శాంతిసామ‌ర‌స్యం మ‌రియు సౌభ్రాతృత్వం

 

భార‌త‌దేశం ప‌ట్ల ప్ర‌పంచ దేశాలు ఆస‌క్తి చూప‌డానికి గ‌ల అంశాల ను గురించి ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు.  మొట్ట‌మొద‌ట‌ గా అంద‌రి మ‌ది లోకి వ‌చ్చే అంశాలు శాంతి సుగుణాలు, ఐక‌మ‌త్యం మ‌రియు సౌభ్రాతృత్వం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

దేశం లో నెల‌కొన్న సామ‌ర‌స్యం , శాంతి ల కార‌ణం గా మ‌న నాగ‌రక‌త నిల‌దొక్కుకుంది, వెలుగొందుతోంది.  అయితే అదే కాలం లో అనేక నాగ‌రక‌త‌ లు విఫ‌ల‌ం అయ్యాయి.

దేశం లో అనేక రాష్ట్రాలు ఉన్నాయి.  భార‌తీయులు అనేక భాష‌ల‌ ను మాట్లాడుతారు.  అంతే కాదు మాండ‌లికాలు కోకొల్ల‌లు.   విశ్వాసాలు అనేకం గా ఉన్నాయి.  సంప్ర‌దాయాల కు, విశ్వాసాల కు లెక్క లేదు.  దేశం లో అనేక ఆహారపు టల‌వాట్ల‌ ను చూడ‌వ‌చ్చును. జీవ‌న విధానాలు, ఆహార్యం లో అనేక విధానాలు అమ‌లులో ఉన్నాయి.  ఇంత వైవిధ్య‌ం ఉన్న‌ప్ప‌టికీ శ‌తాబ్దాల త‌ర‌బ‌డి మ‌నం శాంతియుతం గా జీవిస్తూ వచ్చాము.  శ‌తాబ్దాలు గా అనేక దేశాల‌ కు మ‌న దేశం లోపలకు స్వాగ‌తించాము.  మ‌న నాగ‌రకత‌ దేదీప్య‌మానం గా వెలుగొందింది.  అదే కాలం లో అనేక నాగ‌రక‌త‌ లు న‌శించిపోయాయి.  ఎందుకు?  ఎందుకంటే, ఇక్క‌డ ఉన్న శాంతి మ‌రియు సామ‌ర‌స్య వాతావ‌ర‌ణ‌మే కార‌ణం.

 

మ‌న ఆలోచ‌న‌ లు జీవ‌ం గల సంప్ర‌దాయాలు గా మారాయ‌ని సాధార‌ణ‌మైన‌, వ్య‌క్తీక‌రించ‌గ‌లిగే కార్యాచ‌ర‌ణ‌ లు వాటికి మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ కార్యాచ‌ర‌ణ‌ లు క‌ఠిన‌మైన‌వి కావు.  అలాగే కోణ‌ర‌హిత‌మైన‌వి కావు. వాటిలోని అందమ‌నేది ప్ర‌త్యేకంగా వాటి ని అమ‌లు లోకి తీసుకురావ‌డం లోనే ఉంది అని ప్రధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

భార‌త‌దేశం హిందూమ‌తం, బౌద్ధ‌మ‌తం, జైన‌మ‌తం, సిఖ్ఖు మ‌తం అనే ఉజ్వ‌ల‌మైన మతాల‌ ను ప్రంప‌చాని కి అందించింది.  ఈ గ‌డ్డ మీద సూఫీత‌త్త్వం ప‌రిఢ‌విల్లింది అని ఆయ‌న అన్నారు.

వీట‌న్నిటికీ కీల‌క‌మైంది అహింసా విధాన‌ం అని పేర్కొన్న ప్రధాన మంత్రి.. మ‌హాత్మ గాంధీ పాత్ర ను గురించి మాట్లాడారు.  ఈ ఆద‌ర్శాల గొప్ప‌తనాన్ని చాటిన మ‌హాత్ముడు త‌ద్వారా భార‌త‌దేశాని కి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు.

సంఘ‌ర్ష‌ణ‌ ల నివార‌ణ‌ కోసం హింస‌ కు తెగ‌బ‌డ‌డ‌ం అనేది భార‌త‌దేశం యొక్క విధానం కాదు.  చ‌ర్చ‌ ల ద్వారానే వాటి ని ప‌రిష్క‌రించుకోవ‌డం మ‌న విధానం అని ఈ సంద‌ర్భం గా ప్రధాన మంత్రి అన్నారు.

|

ప‌ర్యావ‌ర‌ణ ప్రేమ‌

 

భార‌త‌దేశం శాంతి ని, సామ‌ర‌స్య‌ాన్ని న‌మ్ముకొంది అని నేను చెప్పాను.  మ‌నంద‌రికీ మాతృమూర్తి అయిన ప్ర‌కృతి తో, ప‌ర్యావ‌ర‌ణం తో సామ‌ర‌స్యం గా ఉండ‌డం కూడా ఇందులో భాగ‌మే అని గ్ర‌హించాలి అని ప్రధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఈ స్ఫూర్తి ని చాటేలా త‌మ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌ల‌ ను తీసుకొంది అని ఆయ‌న అన్నారు.  ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన భ‌విష్య‌త్తు ను కోరుకుంటూ సౌర శ‌క్తి ని సంపూర్ణం గా వాడుకోవ‌డానికిగాను అంత‌ర్జాతీయ సౌర కూట‌మి ని ఏర్పాటు చేయ‌డం లో భార‌త‌దేశం కీల‌క‌ పాత్ర ను పోషించి, ఈ కార్య‌క్ర‌మానికి నేతృత్వం వ‌హిస్తోంద‌ని ప్రధాన మంత్రి అన్నారు.

 

గ‌త ఐదు సంవ‌త్స‌రాల లో దేశ వ్యాప్తం గా 36 కోట్ల ఎల్ ఇడి బ‌ల్బుల‌ ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని, ఒక కోటి ఎల్ ఇడి వీధి దీపాల‌ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, త‌ద్వారా 25 వేల కోట్ల రూపాయ‌ల ధ‌నం ఆదా తో పాటు 4 కోట్ల ట‌న్నుల మేరకు కర్బ‌న ఉద్గారాల‌ త‌గ్గింపు జ‌రిగింద‌న్నారు.

 

సింహాల మరియు పులుల సంర‌క్ష‌ణ‌

 

2006వ సంవత్సరం నుండి భార‌త‌దేశం లో పులుల సంఖ్య రెట్టింపు అయ్యింద‌ని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ రోజు న దేశం లో 2970 వ్యాఘ్రాలు ఉన్నాయ‌ని చెప్పారు.  ప్ర‌పంచం లోని పులుల సంఖ్య‌ లో మూడు వంతుల పులులు భార‌త‌దేశం లోనే ఉన్నాయ‌న్నారు.  పులుల‌ కు భార‌త‌దేశం భ‌ద్ర‌మైన ఆవాసం గా  నిలచింద‌ని వివ‌రించారు.  పులుల సంఖ్య‌ ను 2022వ సంవత్సరం కల్లా రెట్టింపు చేస్తామ‌ని 2010వ సంవత్సరం లో లక్ష్యం గా పెట్టుకొన్నామ‌ని, ఆ ప‌ని ని ముందుగానే చేశామ‌ని అన్నారు.

 

అలాగే సింహాల జ‌నాభా కూడా పెరిగింద‌ని, 2010వ సంవత్సరం తో పోల్చుకుంటే 2015వ సంవత్సరం నాటికి 30 శాతం సింహాల సంఖ్య పెరిగింద‌ని ప్రధాన మంత్రి తెలిపారు.

 

అట‌వీ భూముల విస్త‌ర‌ణ‌

 

దేశం లో అట‌వీ ప్రాంతం విస్త‌రించింద‌ని ప్రధాన మంత్రి ప్ర‌త్యేకం గా ప్ర‌స్తావించారు.  2014 వ సంవత్సరం నాటికి అట‌వీ సంర‌క్ష‌ణ ప్రాంతాలు దేశ‌వ్యాప్తం గా 692గా ఉండేవి.  వీటి సంఖ్య‌ ను 2019వ సంవత్సరం నాటికి 860కి పెంచాము. 2014వ సంవత్సరం నాటికి క‌మ్యూనిటీ రిజ‌ర్వ్ లు 43 ఉంటే ఈ సంఖ్య‌ ను 100కు తేవ‌డం జ‌రిగింది.  ఈ చ‌ర్య‌ ల‌ వ‌ల్ల అనేక మంది ప‌ర్యావ‌ర‌ణ‌, ప్ర‌కృతి ప్రేమికులు భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న‌ కు వ‌స్తున్నారు అని ప్రధాన మంత్రి వివ‌రించారు.

 

మ‌హిళా సంక్షేమం

 

భార‌త‌దేశాని కి సంబంధించి ముఖ్య‌మైన అంశం.. మ‌హిళ‌ ల గౌర‌వ మ‌ర్యాద‌ల‌ కు మ‌నం అత్యంత ప్రాధాన్య‌ాన్ని ఇస్తాము.  మ‌హిళ‌ల ను దేవ‌త‌ల‌ కు ప్ర‌తిరూపం గా భావిస్తాము అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ దిశ‌ గా ఆలోచించి ప‌ని చేసిన భ‌క్తి సాధువులు, రాజా రాంమోహ‌న్ రాయ్‌, ఈశ్వ‌ర చంద్ర విద్యాసాగ‌ర్‌, మ‌హాత్మ ఫులే, సావిత్రీ బాయి ఫులే మొద‌లైన వారి కృషి ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.

 

భార‌త‌దేశ రాజ్యాంగం అమ‌లైన మొద‌టి రోజు నుండే మ‌హిళ‌ల‌ కు వోటు హ‌క్కు ను క‌ల్పించింద‌ని, కానీ ఈ ప‌ని ని చేయ‌డానికి పాశ్చాత్య దేశాలు శ‌తాబ్దాల త‌ర‌బ‌డి జాప్యం చేశాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఈ రోజు న దేశం లో ముద్ర రుణాల ల‌బ్ధిదారుల లో 70 శాతం మంది మ‌హిళ‌లే అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

అలాగే భార‌త దేశ సాయుధ బ‌ల‌గాల లో మ‌హిళ‌ల పాత్ర పెరుగుతోంద‌ని అన్నారు.  నావికాద‌ళాని కి చెందిన మ‌హిళా అధికారుల బృందం జ‌ల‌మార్గం ద్వారా ప్ర‌పంచ యాత్ర చేసింద‌ని ప్రధాన మంత్రి అన్నారు.  ఇది చరిత్రాత్మ‌క‌మైన విష‌య‌మ‌ని, ఈ రోజు న దేశం లో అత్య‌ధిక సంఖ్య‌ లో మ‌హిళా ఎంపీలు ఉన్నార‌ని ప్రధాన మంత్రి వివ‌రించారు.  అలాగే 2019 ఎన్నిక‌ల లో మ‌హిళా వోట‌ర్లు గ‌ణ‌నీయంగా వోటు వేశార‌ని, ఇప్ప‌టికి ఇదే అత్య‌ధిక‌మ‌ని ఆయ‌న అన్నారు.

 

పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట‌

 

పార‌ద‌ర్శ‌క‌త్వాని కి భార‌త‌దేశం అత్య‌ధిక ప్రాధాన్య‌ాన్ని ఇస్తోంద‌ని ప్రధాన మంత్రి అన్నారు.  మొహ‌మాటం లేకుండా నేరు గా వ్య‌వ‌హ‌రిస్తూ పార‌ద‌ర్శ‌కం గా ఉండి వివిధ అభిప్రాయాల‌ కు విలువ ను ఇస్తే, అక్క‌డ నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లు స‌హ‌జ‌సిద్దంగా ఉంటాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు. భార‌తీయుల లో ఉన్న ఆవిష్క‌రణాత్మ‌క ఉత్సాహాన్ని చూసి ప్ర‌పంచ ప్ర‌జ‌లు ఆక‌ర్షితులు అవుతున్నార‌ని ప్రధాన మంత్రి అన్నారు.  భార‌త‌దేశ ఆలోచ‌న అనేది ప్ర‌పంచ అభివృద్ధి కి గ‌ణ‌నీయంగా కృషి చేసింద‌ని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  అంతే కాదు ప్ర‌పంచం ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న అనేక స‌వాళ్ల‌ ను ప‌రిష్క‌రించే శ‌క్తి  భార‌త‌దేశ ఆలోచ‌న విధానాని కి ఉంద‌ని ప్రధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi To Launch Major Aviation, Power And Road Projects Worth Over Rs 9,900 Crore In Haryana today

Media Coverage

PM Modi To Launch Major Aviation, Power And Road Projects Worth Over Rs 9,900 Crore In Haryana today
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM extends warm wishes on occasion of Odia New Year, Vishu, Puthandu and Bohag Bihu
April 14, 2025

The Prime Minister Shri Narendra Modi today extended warm wishes on occasion of Odia New Year, Vishu, Puthandu and Bohag Bihu.

In separate posts on X, he wrote:

“Best wishes on the Odia New Year!”

“Happy Vishu!”

“Puthandu greetings to everyone!”

“Bohag Bihu wishes to you all!”