ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 వ సంవత్సరపు ఏశియన్ పారా గేమ్స్ లో పతకాల ను గెలుచుకొన్న వారి తో నేడు సమావేశమై, వారిని అభినందించారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.34832600_1539692091_para11.jpg)
ప్రధాన మంత్రి ఈ సందర్భం గా మాట్లాడుతూ పతక విజేతల కు ఆహ్వానం పలకడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వారి ప్రదర్శన ను ఆయన మెచ్చుకొని, వారి మానసిక బలం వారి సాఫల్యం లో ఓ కీలకాంశం గా ఉందంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ రంగస్థలం పైన భారతదేశం యొక్క పేరు ను నిలబెట్టడం లో తోడ్పాటు అందించినందుకు వారి ని ప్రధాన మంత్రి అభినందించారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.78932400_1539692064_para1.jpg)
పతకాల విజేతల శిక్షకుల కు కూడా ప్రధాన మంత్రి అభినందనలు తెలియజేశారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.41309900_1539692082_para2.jpg)
క్రీడాకారులు వారి లోపలి ఆశాభావాన్ని పదిలపరచుకోవాలని, అలాగే మరిన్ని శిఖరాలకు చేరుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండాలని ఆయన కోరారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.76782000_1539692107_para4.jpg)