Quoteజి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం అనేది అన్ని వర్గాల ను కలుపుకొనిముందుకు పోయేటటువంటి, మహత్వాకాంక్ష కలిగినటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి మరియు చేత లు ప్రధానం గా ఉన్నటువంటిది గా ఉన్నది
Quoteవరుస లోని చివరి వ్యక్తి కి సహా, ఆదరణ కు నోచుకోకుండామిగిలి పోయినటువంటి వర్గాల కు సేవ చేయాలన్న గాంధీ గారి ఆశయాన్ని నెరవేర్చడం ప్రధానం

న్యూ ఢిల్లీ లో జరిగే జి-20 శిఖర సమ్మేళనం మనుష్య ప్రధానమైన మరియు సమ్మిళితమైన అభివృద్ధి లో ఒక క్రొత్త బాట ను పరచగలదన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించడం అనేది సమాజం లో అన్ని వర్గాల ను కలుపుకొని వెళ్ళేటటువంటి, మహత్వాకాంక్ష కలిగినటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి మరియు చేత లు ప్రధానంగా ఉండేటటువంటిది గా ఉందని, గ్లోబల్ సౌథ్ దేశాల అభివృద్ధి సంబంధి ఆందోళనల ను ఎలుగెత్తి చాటడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

 

సమాజం లో ఆదరణ కు నోచుకోకుండా దూరం గా అట్టిపెట్టినటువంటి వర్గాల వారి కి సేవల ను అందించాలన్న గాంధీ గారి ఆశయాన్ని అనుసరించడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, భారతదేశం ప్రగతి ని ముందుకు తీసుకు పోవడం కోసం మనుష్య ప్రధానమైన మార్గాన్ని అవలంబించడాని కి పెద్ద పీట ను వేస్తోందన్నారు.

 

‘ఒక భూమి’, ‘ఒక కుటుంబం’, మరియు ‘ఒక భవిష్యత్తు’ సంబంధి సదస్సుల కు తాను అధ్యక్షత వహించనున్నట్లు ప్రధాన మంత్రి తెలియ జేశారు. మరింత బలమైనటువంటి, స్థిరమైనటువంటి, అన్ని వర్గాల కు స్థానం ఉండేటటువంటి మరియు సమతుల్యమైనటువంటి వృద్ధి ని ముందుకు తీసుకు పోవడం సహా ప్రపంచ సముదాయం ఎదుర్కొంటున్న అనేక ఆందోళనకర అంశాలు ఈ సదస్సుల లో ప్రస్తావన కు వస్తాయి. మైత్రి మరియు సహకార బందాలను గాఢతరం గా మలచడం కోసం అనేక మంది నాయకుల తోను, ప్రతినిధి వర్గం యొక్క ప్రముఖఉల తోను ద్వైపాక్షిక సమావేశాల ను కూడా జరపనున్న సంగతి ని ఆయన ప్రస్తావించారు.

 

మాన్య రాష్ట్రపతి 2023 సెప్టెంబర్ 9 వ తేదీ నాడు నేతల కు రాత్రి భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారని కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు. నేత లు 2023 సెప్టెంబర్ 10వ తేదీన రాజ్ ఘాట్ కు వెళ్ళి గాంధీ మహాత్ముని కి శ్రద్ధాంజలి ని సమర్పించనున్నారు. అదే రోజు న ముగింపు కార్యక్రమం లో, జి-20 నేత లు ఆరోగ్యకరమైన ‘ఒక భూమి’ , ‘ఒక కుటుంబం’, ఒక స్థిరమైనటువంటి మరియు న్యాయబద్ధమైనటువంటి ‘ఒకే భవిష్యత్తు’ కోసం వంటి తమ తమ సామూహిక దృష్టికోణాన్ని వెల్లడిస్తారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం ద్వారా కొన్ని ట్వీట్ లలో -

‘‘భారతదేశం 2023 సెప్టెంబరు తొమ్మిదో, పదో తేదీల లో న్యూ ఢిల్లీ లోని ప్రతిష్టాత్మకమైన భారత్ మండపమ్ లో జి-20 తాలూకు పద్దెనిమిదో శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరించడాని కి సంతోష పడుతున్నది. ఇది భారతదేశం నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి జి-20 శిఖర సమ్మేళనం. రాబోయే రెండు రోజుల లో ప్రపంచ నేతల తో సార్థక చర్చలు జరపడానికి నేను ఉత్సుకత తో ఉన్నాను.

 

న్యూ ఢిల్లీ లో జరిగే జి-20 శిఖర సమ్మేళనం మనుష్య ప్రధానమైనటువంటి మరియు సమ్మిళితమైనటువంటి అభివృద్ధి లో ఒక క్రొత్త బాట ను పరుస్తుందని నేను గట్టి గా నమ్ముతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
How has the Modi Government’s Atmanirbhar Bharat push powered Operation Sindoor?

Media Coverage

How has the Modi Government’s Atmanirbhar Bharat push powered Operation Sindoor?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం
May 18, 2025
Quote* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి ప్రాణనష్టానికి దారితీసిన ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.


ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి ( పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:


‘‘మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం కలచివేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.


మృతుల కుటుంబికులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం: ప్రధానమంత్రి’’ @narendramodi

 

 

"महाराष्ट्रात सोलापूर इथे आग लागून झालेल्या दुर्घटनेतील जीवितहानीमुळे तीव्र दु:ख झाले. आपले प्रियजन गमावलेल्या कुटुंबांप्रति माझ्या सहवेदना. जखमी झालेले लवकर बरे होवोत ही प्रार्थना. पंतप्रधान राष्ट्रीय मदत निधीमधून (PMNRF) प्रत्येक मृतांच्या वारसाला 2 लाख रुपयांची मदत दिली जाईल. जखमींना 50,000 रुपये दिले जातील : पंतप्रधान" @narendramodi