ఎండు కొబ్బరికి 2024 సీజన్‌లో చెల్లించే కనీస మద్దతు ధరకు   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల  కమిటీ ఆమోదం తెలిపింది. సాగుదారులకు లాభదాయకమైన ధరలను అందిస్తామని కేంద్ర  ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ప్రకటించింది.పంట ఉత్పత్తికి  జాతీయ స్థాయిలో నిర్ణయించిన  వెయిటెడ్ ఉత్పత్తి వ్యయంకి మించి కనీసం 1.5 రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొబ్బరి నూనె తయారు చేయడానికి ఉపయోగించే ఎండు  కొబ్బరికి 2024 సీజన్‌లో క్వింటాల్‌కు రూ.11,160 కనీస ధరగా నిర్ణయించారు. కురిడి కొబ్బరి కాయకు చెల్లించే కనీస మద్దతు ధర  క్వింటాల్‌కు రూ.12,000/-గా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు  నూనె తీయడానికి ఉపయోగించే కొబ్బరిపై   51.84 శాతం, కురిడి పై  63.26 శాతం మార్జిన్‌ లభిస్తుంది.  జాతీయ స్థాయిలో నిర్ణయించిన  వెయిటెడ్ ఉత్పత్తి వ్యయం తో పోల్చి చూస్తే ఇది1.5 రెట్లు ఎక్కువ. ఎండు కొబ్బరిని  నూనెను తీయడానికి ఉపయోగిస్తారు. బంతి ఆకారంలో ఉండే కురిడి కొబ్బరికాయను  డ్రై ఫ్రూట్‌గా , మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి ఉత్పత్తి లో  కేరళ, తమిళనాడు అగ్రస్థానంలో ఉన్నాయి. కురిడి కొబ్బరి  ప్రధానంగా కర్ణాటకలో ఉత్పత్తి అవుతోంది. 

 గత సీజన్తో పోల్చే చూస్తే ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర 2024 సీజన్‌లో  క్వింటాల్‌కు రూ.300/- పెరిగింది. కురిడి కొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.250/- పెరిగింది. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస ధరను పెంచుతూ వస్తోంది. 2014-15 లో ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 5,250 రూపాయలుగా ఉంది ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర 113 శాతం పెరిగి 11,160 రూపాయలకు చేరింది. అదేవిధంగా కురిడి కొబ్బరి కనీస మధాతు ధర 118 శాతం  పెరిగింది. 2014-15 లో .    , ప్రభుత్వం మిల్లింగ్ కొప్రా మరియు బాల్ కొప్రాకు ఎంఎస్‌పిని క్వింటాల్‌కు రూ.5,250 నుండి మరియు 2014-15లో క్వింటాల్‌కు రూ.5,500 నుండి క్వింటాల్‌కు రూ.11,160కి మరియు 2024-25లో క్వింటాల్‌కు రూ.12,000కి పెంచింది. వరుసగా 113 శాతం మరియు 118 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అధిక MSP కొబ్బరి పెంపకందారులకు మెరుగైన ప్రతిఫలాన్ని అందించడమే కాకుండా దేశీయంగా మరియు అంతర్జాతీయంగా కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కొప్రా ఉత్పత్తిని విస్తరించడానికి రైతులను ప్రోత్సహిస్తుంది.

ప్రస్తుత సీజన్ 2023లో, ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1.33 లక్షల మెట్రిక్ టన్నుల కొప్రాను రూ.1,493 కోట్లతో సేకరించి, దాదాపు 90,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ప్రస్తుత సీజన్ 2023లో సేకరణ మునుపటి సీజన్ (2022) కంటే 227 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) ధర మద్దతు పథకం (PSS) కింద కొప్రా మరియు పొట్టు తీసిన కొబ్బరి సేకరణ కోసం సెంట్రల్ నోడల్ /ఏజెన్సీలు (CNAs)గా కొనసాగుతాయి.

 

  • krishangopal sharma Bjp June 03, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏
  • krishangopal sharma Bjp June 03, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏
  • krishangopal sharma Bjp June 03, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏
  • DEVENDRA SHAH February 25, 2024

    'Today women are succeeding in all phases of life,' Modi in Mann ki Baat ahead of Women's day
  • Kiran jain February 25, 2024

    vande bharat
  • Kiran jain February 25, 2024

    vande bharat
  • Dhajendra Khari February 20, 2024

    ओहदे और बड़प्पन का अभिमान कभी भी नहीं करना चाहिये, क्योंकि मोर के पंखों का बोझ ही उसे उड़ने नहीं देता है।
  • Dhajendra Khari February 19, 2024

    विश्व के सबसे लोकप्रिय राजनेता, राष्ट्र उत्थान के लिए दिन-रात परिश्रम कर रहे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी का हार्दिक स्वागत, वंदन एवं अभिनंदन।
  • Dhajendra Khari February 13, 2024

    यह भारत के विकास का अमृत काल है। आज भारत युवा शक्ति की पूंजी से भरा हुआ है।
  • Dhajendra Khari February 10, 2024

    Modi sarkar fir ek baar
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
From chips to training models: Tracking progress of India's AI Mission

Media Coverage

From chips to training models: Tracking progress of India's AI Mission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi commemorates Navratri with a message of peace, happiness, and renewed energy
March 31, 2025

The Prime Minister Shri Narendra Modi greeted the nation, emphasizing the divine blessings of Goddess Durga. He highlighted how the grace of the Goddess brings peace, happiness, and renewed energy to devotees. He also shared a prayer by Smt Rajlakshmee Sanjay.

He wrote in a post on X:

“नवरात्रि पर देवी मां का आशीर्वाद भक्तों में सुख-शांति और नई ऊर्जा का संचार करता है। सुनिए, शक्ति की आराधना को समर्पित राजलक्ष्मी संजय जी की यह स्तुति...”