


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రూ. 18,658 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి 3 రాష్ట్రాల్లోని 15 జిల్లాలను కవర్ చేసే ఈ నాలుగు ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్వర్క్ను దాదాపు 1247 కిలోమీటర్ల మేర విస్తరించనున్నాయి.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా చేపట్టనున్న పనులు:
i. సంబల్పూర్ - జరప్డా 3వ, 4వ లైన్
ii. ఝర్సుగూడ - సాసన్ 3వ, 4వ లైన్
iii. ఖర్సియా - నయా రాయ్పూర్ - పర్మల్కాసా 5వ, 6వ లైన్
iv. గోండియా - బల్లార్షా డబ్లింగ్
పెరగనున్న లైన్ సామర్థ్యం రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే భారతీయ రైల్వేలకు సమర్థమైన, విశ్వసనీయమైన సేవలను అందించే శక్తిని ఇస్తుంది. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదనలు రైల్వే కార్యకలాపాలను సులభతరం చేయడంతో పాటు, రద్దీని తగ్గిస్తూ, భారతీయ రైల్వేల్లో అత్యంత రద్దీగా ఉండే విభాగాల్లో అత్యంత అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధిని చేయనున్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన భారత్ దార్శనికతకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి ఊతమివ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి/స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ వారిని "ఆత్మనిర్భర్"గా మార్చనున్నాయి.