ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో వివిధ ప్రగతి పనుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో వివిధ ప్రగతి పనుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 30th, 06:12 pm

వేదికను అలంకరించిన ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ శ్రీ రమణ్‌ డేకా, ప్రజాదరణగల చురుకైన ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్‌ సాయి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్‌ లాల్‌, ఈ ప్రాంత ఎంపీ-కేంద్ర మంత్రి శ్రీ తోఖన్ సాహు, ఛత్తీస్‌గఢ్ శాసనసభాపతి-నా ప్రియ మిత్రులు శ్రీ రమణ్ సింగ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, శ్రీ అరుణ్ సాహు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన నా సోదరీసోదరులారా!

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 30th, 03:30 pm

మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిర జీవనోపాధిని పెంపొందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభాలు చేసి, పలు అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. నూతన సంవత్సర శుభారంభం, నవరాత్రి మొదటి రోజు వంటి శుభ సందర్భంలో ఈ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న శ్రీ నరేంద్ర మోదీ, మాతా మహామాయ భూమిగా, మాతా కౌసల్య మాతృభూమిగా ఛత్తీస్‌గఢ్ ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నవరాత్రి మొదటి రోజున ఛత్తీస్‌గఢ్‌లో ఉండటం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్న ఆయన, ఇటీవల భక్త శిరోమణి మాతా కర్మ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ జారీ చేసిన సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. నవరాత్రి పండుగ రామనవమి వేడుకలతో ముగుస్తుందన్న మోదీ, ఛత్తీస్‌గఢ్‌లో రాముడి పట్ల ఉన్న ప్రత్యేక భక్తిని, ముఖ్యంగా తమ మొత్తం ఉనికిని రాముడి నామానికి అంకితం చేసిన రామనామి సమాజ అసాధారణ అంకితభావాన్ని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలను శ్రీరాముని మాతృమూర్తి కుటుంబ సభ్యులుగా అభివర్ణించిన ఆయన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రధానమంత్రి పర్యటన

మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రధానమంత్రి పర్యటన

March 28th, 02:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్‌ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు.

Role of a teacher is to show the light to a person: PM Modi

September 05th, 11:09 pm

On the occasion of Teacher’s day, Prime Minister Narendra Modi interacted with the National Award winning teachers. The Prime Minister highlighted the knowledge and dedication of teachers and pointed out that their biggest quality is a positive outlook that enables them to work with students relentlessly for their improvement.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ

September 05th, 06:25 pm

ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి అర్పించారు. ఉపాధ్యాయురాలు కావడమేగాక ఒడిసా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యాబోధన చేసిన ప్రస్తుత భారత రాష్ట్రపతి చేతులమీదుగా సత్కారం పొందడం ఎంతో విశిష్ట అంశమని ఆయన ఉపాధ్యాయులకు గుర్తుచేశారు. “ఇవాళ దేశం బృహత్తరమైన స్వాతంత్ర్య అమృత మహోత్సవ స్వప్నాన్ని నెరవేర్చుకోవడం ప్రారంభించిన నేపథ్యంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగంలో చేసిన కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సంద‌ర్భంగా జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులంద‌రినీ నేను అభినందిస్తున్నాను” అని ప్ర‌ధానమంత్రి వ్యాఖ్యానించారు.