
డిసెంబర్ 25న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా కెన్-బెత్వా నదుల జాతీయ అనుసంధాన పథకానికి ప్రధాని శంకుస్థాపన
December 24th, 11:46 am
మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధానమ్రంతి శ్రీ నరేంద్రమోదీ మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గం.లకు ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు.