మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 30th, 11:53 am

గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత గౌరవనీయ సర్‌ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర గౌరవ ప్రముఖులు, ఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారా! ఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద ఎంతో ప్రత్యేకమైన రోజు. పవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వా, ఉగాది, నవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు ఝులేలాల్ జీ, గురు అంగద్ దేవ్ జీ జయంతి కూడా. ఇవే కాకుండా, ఈ రోజు మన స్ఫూర్తి ప్రదాత, అత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడా. అలాగే, ఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోంది. ఈ సందర్భంలో, ఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించి, గౌరవనీయ డాక్టర్ సాహెబ్, గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.

మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంట‌ర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి దేశంలోని పౌరులందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యత: ప్రధాని

March 30th, 11:52 am

మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి పండుగలు జరుగుతున్నాయన్న ఆయన.. భగవాన్ ఝులేలాల్, గురు అంగద్ దేవ్ జయంతి అయిన ఈ రోజు ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన డాక్టర్ కేబీ హెడ్గేవార్ జయంతి ఇవాళ అని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మహోన్నత ప్రయాణం శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన రోజున డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గోల్వాల్కర్ గురూజీలకు నివాళులు అర్పించటానికి స్మృతి మందిరాన్ని సందర్శించడం ఎంతో గౌరవంతో కూడుకున్న విషయమని అన్నారు.

మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం

March 12th, 06:07 am

పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్‌ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్‌ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్‌ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.

మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 11th, 07:30 pm

మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం

January 23rd, 11:30 am

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయనను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. సుభాష్ బాబుకు వినమ్ర పూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన జన్మస్థలంలో ఈ ఏడాది పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశా ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. నేతాజీ జీవిత విశేషాలను వివరించేలా భారీ ప్రదర్శనను కూడా కటక్ లో ఏర్పాటు చేశారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న అనేక వారసత్వ స్మారకాలను భద్రపరిచి ఈ ప్రదర్శనకు ఉంచారు. అనేకమంది చిత్రకారులు బోస్ జీవిత విశేషాలకు కాన్వాస్ పై చిత్రరూపమిచ్చారు. వీటన్నింటితో పాటు సుభాష్ బాబుకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా సేకరించారు. నేతాజీ ఈ ఘనమైన జీవిత ప్రస్థానం నా యువ భారతానికీ, నా భారతదేశానికి కొత్త శక్తిని అందిస్తాయి.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం

January 23rd, 11:25 am

పరాక్రమ దివస్‌గా నిర్వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను యావత్ దేశం సగౌరవంగా స్మరించుకుంటోందని అన్నారు. నేతాజీ సుభాష్ బోస్‌కు నివాళులు అర్పిస్తూ, ఈ ఏడాది పరాక్రమ దివస్ ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన ఒడిశాలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేతాజీ జీవితం ఆధారంగా ఒడిశాలోని కటక్‌లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఎంతో మంది చిత్రకారులు నేతాజీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను కాన్వాస్‌పై చిత్రించారని అన్నారు. అలాగే నేతాజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను సైతం సేకరించినట్లు ఆయన తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఈ పరిణామాలు మేరీ యువ భారత్ లేదా మై భారత్‌కు కొత్త శక్తిని ఇస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

People are regarding BJP's ‘Sankalp Patra’ as Modi Ki Guarantee card: PM Modi in Tirunelveli

April 15th, 04:33 pm

Prime Minister Narendra Modi graced a public meeting ahead of the Lok Sabha Elections, 2024 in Tirunelveli, Tamil Nadu. The audience welcomed the PM with love and adoration. Manifesting a third term, PM Modi exemplified his vision for Tamil Nadu and the entire nation as a whole.

PM Modi holds a public meeting in Tirunelveli, Tamil Nadu

April 15th, 04:23 pm

Prime Minister Narendra Modi graced a public meeting ahead of the Lok Sabha Elections, 2024 in Tirunelveli, Tamil Nadu. The audience welcomed the PM with love and adoration. Manifesting a third term, PM Modi exemplified his vision for Tamil Nadu and the entire nation as a whole.

No room for division in India's mantra of unity in diversity: PM Modi

February 08th, 01:00 pm

Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 08th, 12:30 pm

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.

ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం

January 23rd, 06:31 pm

కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు కిషన్ రెడ్డి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, మీనాక్షి లేఖి గారు, అజయ్ భట్ గారు, బ్రిగేడియర్ ఆర్ ఎస్ చికారా గారు, ఐఎన్ఎ వెటరన్ లెఫ్టినెంట్ ఆర్ మాధవన్ గారు, ప్రియమైన నా దేశప్రజలారా!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.

January 23rd, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు , ఢల్లీిలోని ఎర్రకోటవద్ద జరిగిన పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భారత్‌ పర్వ్‌ ను ప్రారంభించారు. ఇందులో దేశ సుసంపన్న వైవిధ్యతను రిపబ్లిక్‌ దినోత్సవ శకటాలను, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. నేషనల్‌ ఆర్కైవ్స్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పై ఫోటోలు, పెయింటింగ్స్‌, పుస్తకాలు, శిల్పాలతో కూడిన సాంకేతికత ఆధారిత ఇంటరాక్టివ్‌ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి తిలకించారు. నేతాజీ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వారు నేతాజీ జీవితంపై ప్రదర్శించిన డ్రామాను ప్రధానమంత్రి తిలకించారు. ఐఎన్‌ఎ కి సంబంధించి జీవించి ఉన్న ఏకైక ప్రముఖుడు లెఫ్టినెంట్‌ ఆర్‌.మాధవన్‌ ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. పరాక్రమ్‌దివస్‌ను 2021 నుంచి నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి రోజు జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులను గౌరవించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరాక్రమ్‌ దివస్‌ను పాటిస్తున్నారు.

అయోధ్యలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అంకితం , శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 30th, 02:15 pm

మోడీ హామీకి అంత బలం ఉంది ఎందుకంటే మోడీ ఏదైనా చెప్పినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తారు. మోడీ హామీపై నేడు దేశంలో నమ్మకం ఉంది, ఎందుకంటే మోడీ హామీ ఇచ్చినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడతారు. అయోధ్య నగరం కూడా దీనికి సాక్ష్యం. ఈ పవిత్రమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో మేము ఏ మాత్రం వెనకడుగు వేయబోమని ఈ రోజు నేను అయోధ్య ప్రజలకు భరోసా ఇస్తున్నాను. శ్రీరాముడు మనందరినీ ఆశీర్వదించాలి, ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. నాతో కలిసి ఇలా చెప్పండి:

ప్రధానమంత్రి చేతులమీదుగా రూ.15,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలు ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన

December 30th, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అయోధ్య క్షేత్రంలో రూ.15,700 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లోని సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన కార్యక్రమాలున్నాయి. దీనికిముందు పునర్నవీకృత అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ఆయన, కొత్త అమృత భారత్, వందే భారత్ రైళ్లను జెండా ఊపి సాగనంపారు. వీటితోపాటు అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి, దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు.

ఎన్ పిడిఆర్ ఆర్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ –2023 తృతీయ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

March 10th, 09:43 pm

విపత్తులనుంచి కోలుకునేలా చేయడంలో, విపత్తుల నిర్వహణ పనులలో నిమగ్నమైన వారందరికీ ముందుగా నా అభినందనలు. చాల సందర్భాలలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి మీరు అద్భుతమైన కృషి చేస్తుంటారు. ఇటీవవవల, టర్కీ, సిరియాలలో భారత బృందం కృషిని మొత్తం ప్రపంచం అభినందించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం.

విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక 3వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

March 10th, 04:40 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో “విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక” (ఎన్‌పిడిఆర్ఆర్) 3వ సమావేశాన్ని ప్రారంభించారు. “మారుతున్న వాతావరణంలో స్థానిక ప్రతిరోధకత రూపకల్పన” ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ‘సుభాష్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారం-2023’ గ్రహీతలను ఆయన సత్కరించారు. ఈ గౌరవం పొందిన సంస్థలలో ‘ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ (ఒఎస్‌డిఎంఎ), మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ ఉన్నాయి. విపత్తు ముప్పు తగ్గింపు రంగంలో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలు, ఉపకరణాలు, సాంకేతికత పరిజ్ఞానాల సంబంధిత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యాన్ని వ్యక్తీకరించడానికి ‘మన్ కీ బాత్’ అద్భుతమైన మాధ్యమంగా మారింది: ప్రధాని మోదీ

February 26th, 11:00 am

మిత్రులారా!సర్దార్ పటేల్ జయంతి – అంటే 'ఐక్యతా దినోత్సవం' సందర్భంగా మనం'మన్ కీ బాత్'లో మూడు పోటీల గురించి మాట్లాడుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. దేశభక్తి గీతాలు, లాలి పాటలు, ముగ్గులకు సంబంధించిన పోటీలవి. దేశవ్యాప్తంగా 700లకు పైగా జిల్లాల నుంచి 5 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పిల్లలు, పెద్దలు, వృద్ధులు- అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని 20కి పైగా భాషల్లో తమ ఎంట్రీలను పంపారు.ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఒక ఛాంపియన్, కళా సాధకులు. మన దేశంలోని వైవిధ్యం, సంస్కృతి పట్ల ప్రేమను మీరందరూ నిరూపించారు.

న్యూ ఢిల్లీలో కర్తవ్య పథ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

September 08th, 10:41 pm

నేటి ఈ చారిత్రాత్మక కార్యక్రమంపై దేశం మొత్తం ఒక దృష్టిని కలిగి ఉంది, ఈ సమయంలో దేశప్రజలందరూ ఈ కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూస్తున్న దేశప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ చారిత్రాత్మక సమయంలో, నా క్యాబినెట్ సహచరులు శ్రీ హర్దీప్ పూరీ జీ, శ్రీ జి కిషన్ రెడ్డి జీ, శ్రీ అర్జున్‌రామ్ మేఘవాల్ జీ, శ్రీమతి మీనాక్షి లేఖి జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ కూడా ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్నారు. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు.

PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate

September 08th, 07:00 pm

PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రతిమ ను స్వీకరించిన ప్రధాన మంత్రి

April 05th, 02:40 pm

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి ప్రతిమ ను ఒకదానిని కళాకారుడు శ్రీ అరుణ్ యోగిరాజ్ వద్ద నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అందుకొన్నారు.