
పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద తదుపరి విడత ఆర్థిక సహాయం విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 09th, 12:31 pm
గత అనేక రోజులుగా, నేను ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులతో చర్చిస్తున్నాను. ప్రభుత్వం రూపొందించిన పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయనే విషయం మనం మరింత మెరుగైన పద్ధతిలో తెలుసుకుంటున్నాం.ఇది జనతా జనార్దన్ తో ప్రత్యక్ష సంబంధం వల్ల కలిగే ప్రయోజనం. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్గం లోని నా సహచరులు, గౌరవనీయమైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అనేక రాష్ట్రాల నుండి హాజరైన ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రముఖులు, రైతులు మరియు సోదర సోదరీమణులారా,
పిఎమ్ కిసాన్ తాలూకు తొమ్మిదో కిస్తీ ని విడుదల చేసిన ప్రధాన మంత్రి
August 09th, 12:30 pm
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ (పిఎమ్ -కిసాన్) లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు తరువాతి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అంటే ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీనితో 9.75 కోట్లకు పై చిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల ఎంతో విలువైన సొమ్ము ను బదలాయించడానికి వీలు చిక్కింది. ఇది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనం తాలూకు తొమ్మిదో కిస్తీ. ఈ కార్యక్రమం లో లబ్ధిదారు రైతుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.
రైతులకు స్వల్పకాలిక పంట రుణాలపై వడ్డీకి సంబంధించి ప్రభుత్వ ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
June 14th, 03:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2017-18 సంవత్సరానికి సంబంధించి రైతులకు ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ (ఐఎస్ఎస్)కు ఆమోదం తెలిపింది. ఇది వ్యవసాయదారులు కేవలం 4 శాతం వార్షిక వడ్డీకి రూ. 3 లక్షల వరకు ఒక ఏడాది వ్యవధిలో తిరిగి చెల్లించదగ్గ స్వల్పకాలిక పంట రుణాన్ని పొందేందుకు తోడ్పడనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 20,339 కోట్లను కేటాయించింది.#VikasKaBudget: Know more about Budget 2016
February 29th, 03:21 pm