పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం

January 23rd, 11:30 am

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయనను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. సుభాష్ బాబుకు వినమ్ర పూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన జన్మస్థలంలో ఈ ఏడాది పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశా ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. నేతాజీ జీవిత విశేషాలను వివరించేలా భారీ ప్రదర్శనను కూడా కటక్ లో ఏర్పాటు చేశారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న అనేక వారసత్వ స్మారకాలను భద్రపరిచి ఈ ప్రదర్శనకు ఉంచారు. అనేకమంది చిత్రకారులు బోస్ జీవిత విశేషాలకు కాన్వాస్ పై చిత్రరూపమిచ్చారు. వీటన్నింటితో పాటు సుభాష్ బాబుకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా సేకరించారు. నేతాజీ ఈ ఘనమైన జీవిత ప్రస్థానం నా యువ భారతానికీ, నా భారతదేశానికి కొత్త శక్తిని అందిస్తాయి.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం

January 23rd, 11:25 am

పరాక్రమ దివస్‌గా నిర్వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను యావత్ దేశం సగౌరవంగా స్మరించుకుంటోందని అన్నారు. నేతాజీ సుభాష్ బోస్‌కు నివాళులు అర్పిస్తూ, ఈ ఏడాది పరాక్రమ దివస్ ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన ఒడిశాలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేతాజీ జీవితం ఆధారంగా ఒడిశాలోని కటక్‌లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఎంతో మంది చిత్రకారులు నేతాజీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను కాన్వాస్‌పై చిత్రించారని అన్నారు. అలాగే నేతాజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను సైతం సేకరించినట్లు ఆయన తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఈ పరిణామాలు మేరీ యువ భారత్ లేదా మై భారత్‌కు కొత్త శక్తిని ఇస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

సెంట్రల్ విస్టా లో వారం వారంసాంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించే ఉద్దేశ్యం తో తలపెట్టిన ఒక విశిష్టసాంస్కృతిక ప్రదర్శన ల మాలిక ‘కళాంజలి’ ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

April 21st, 10:20 am

ఇండియా గేట్ కు దగ్గర లో ఉన్నటువంటి సెంటల్ విస్టా లో ప్రతి వారాంతం నాడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించడం కోసం సంస్కృతి మంత్రిత్వ శాఖ తీసుకు వచ్చిన ఒక విశిష్ట సాంస్కృతిక ప్రదర్శన ల మాలిక అయిన ‘కళాంజలి’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

న్యూ ఢిల్లీలో కర్తవ్య పథ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

September 08th, 10:41 pm

నేటి ఈ చారిత్రాత్మక కార్యక్రమంపై దేశం మొత్తం ఒక దృష్టిని కలిగి ఉంది, ఈ సమయంలో దేశప్రజలందరూ ఈ కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూస్తున్న దేశప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ చారిత్రాత్మక సమయంలో, నా క్యాబినెట్ సహచరులు శ్రీ హర్దీప్ పూరీ జీ, శ్రీ జి కిషన్ రెడ్డి జీ, శ్రీ అర్జున్‌రామ్ మేఘవాల్ జీ, శ్రీమతి మీనాక్షి లేఖి జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ కూడా ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్నారు. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు.

PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate

September 08th, 07:00 pm

PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.

‘కర్తవ్య పథ్’ ను సెప్టెంబర్ 8వ తేదీ న ప్రారంభించనున్న ప్రధానమంత్రి; ఇండియా గేట్ ప్రాంతం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు

September 07th, 01:49 pm

‘కర్తవ్య పథ్’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ నాటి రాత్రి 7 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. మునుపటి రాజ్ పథ్ అధికార చిహ్నం గా ఉండగా ‘కర్తవ్య పథ్’ దానికి భిన్నం గా సార్వజనిక యాజమాన్యాని కి మరియు సశక్తీకరణ కు ఒక నిదర్శన గా ఉంటూ మార్పు నకు ప్రతీక కానుంది. ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ఇండియా గేట్ ప్రాంతం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ చర్య లు అమృత కాలం లో న్యూ ఇండియా కోసం ప్రధాన మంత్రి ఉద్భోదించిన ‘పాంచ్ ప్రణ్’ (అయిదు ప్రతిజ్ఞ‌ ల) లోని రెండో ప్రణ్ అయినటువంటి ‘వలసవాద మనస్తత్వం తాలూకు ఏ విధమైన జాడ ను అయినా సరే, తొలగించాలి’ అనే ప్రతిన కు అనుగుణం గా ఉన్నాయి.

జూన్ 23న వాణిజ్య భవన్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; ‘నిర్యాత్’ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు

June 22nd, 03:55 pm

వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నూతన ప్రాంగణం - ‘‘వాణిజ్య భవన్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జూన్ 23వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఒక కొత్త పోర్టల్ ‘‘నిర్యాత్’’ (నేశనల్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ రెకార్డ్ ఫార్ ఇయర్లీ ఎనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ కు సక్షిప్త రూపం ఇది)ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. భారతదేశం యొక్క విదేశీ వ్యాపారానికి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని అంతటినీ సంబంధిత వర్గాల కు అందించడం కోసం ఒక వన్ స్టాప్ ప్లాట్ ఫార్మ్ గా ఈ పోర్టల్ ను అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

భారతీయ సంస్కృతి యొక్క వైభవం ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 30th, 11:30 am

మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతి'ని, సమీపంలోని 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.'నేషనల్ వార్ మెమోరియల్'లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్‌ జవాన్‌ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా 'అమర్ జవాన్ జ్యోతి' లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా 'నేషనల్ వార్ మెమోరియల్'ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

January 24th, 03:11 pm

Prime Minister Modi interacted with Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees. He lauded that the children of India have shown their modern and scientific thinking towards vaccination programme. The PM also appealed to them to be an ambassador for Vocal for Local and lead the campaign of Aatmanirbhar Bharat.

‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ గ్రహీతల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

January 24th, 11:53 am

Prime Minister Modi interacted with Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees. He lauded that the children of India have shown their modern and scientific thinking towards vaccination programme. The PM also appealed to them to be an ambassador for Vocal for Local and lead the campaign of Aatmanirbhar Bharat.

గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్ తాలూకు సకారాత్మక ప్రభావంపై వెబినార్ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

January 23rd, 05:24 pm

Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.

ఇండియా గేట్‌వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి అనంతరం సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారాల ప్రదానం

January 23rd, 05:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా గేట్‌వద్ద నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహం పనులు పూర్తయ్యేదాకా ఈ హోలోగ్రామ్‌ ఇక్కడ దర్శనమిస్తూంటుంది. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి నేపథ్యంలో ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రదేశంలో అసలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, హోలోగ్రామ్‌ విగ్రహావిష్కరణ అనంతరం 2019, 2020, 2021, 2022 సంవ‌త్స‌రాల‌కుగాను ‘సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారా”లను ప్రధాని ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవలందించిన దేశంలోని వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు, గౌరవం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది.

నేతాజీ సుభాష్చంద్ర బోస్ 125వ జయంతి తాలూకు ఏడాది పొడవునా ఉత్సవాన్ని జరుపుకోవడానికి సూచకం గాఇండియా గేట్ వద్ద నేతాజీ తాలూకు ఒక భవ్య విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుంది

January 21st, 07:46 pm

గొప్ప స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి ని స్మరించుకోవడం తో పాటు ఏడాది పొడవునా జరుపుకొనే ఉత్సవాల లో భాగం గా, ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క భవ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రానైట్ తో తయారు చేసే ఈ విగ్రహం మన స్వాతంత్ర్య పోరాటానికి నేతాజీ అందించినటువంటి అపారమైన తోడ్పాటు కు ఒక సముచితమైన శ్రద్ధాంజలి కావడమే కాకుండా, ఆయన కు దేశం రుణపడి ఉందనే భావన కు ఒక ప్రతీక గా కూడా ఉండగలదు. విగ్రహం తాలూకు పనులు పూర్తి అయ్యేటంతవరకు, నేతాజీ యొక్క హోలోగ్రామ్ ప్రతిమ ను సరిగ్గా అదే ప్రదేశం లో ఏర్పాటు చేయనున్నారు. ఇండియా గేట్ లో నేతాజీ కి చెందిన హోలోగ్రామ్ ప్రతిమ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 23వ తేదీ న సాయంత్రం పూట ఇంచుమించు 6 గంటల వేళ కు ఆవిష్కరిస్తారు.

ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఘనమైనవిగ్రహాన్ని స్థాపించడం జరుగుతుందన్న ప్రధాన మంత్రి

January 21st, 03:00 pm

ఇండియా గేట్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు చెందిన ఒక భవ్యమైనటువంటి విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ విగ్రహం పనులు పూర్తి అయ్యేటంతవరకు ఆయన యొక్క హోలోగ్రామ్ స్టాట్యూ ను నేతాజీ జయంతి అయినటువంటి జనవరి 23వ తేదీ నాడు ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.