బవలియాలీ ధామ్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

బవలియాలీ ధామ్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

March 20th, 04:35 pm

ముందుగా, భర్వాడ్ సమాజ సంప్రదాయాలకు, గౌరవనీయులైన సాధువులు, మహంతులకు, ఈ పవిత్ర సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు తమ జీవితాలను అంకితం చేసిన వారికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈ రోజు మన ఆనందం ఎన్నో రెట్లు పెరిగింది. ఈ సారి నిర్వహించిన మహాకుంభ్ చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా, మనందరికీ గర్వకారణంగా నిలిచింది. ఎందుకంటే ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగానే మహంత్ శ్రీ రామ్ బాపూజీని మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించుకున్నాం. ఇది మనందరికీ అమితానందనాన్ని కలిగిస్తోంది. రామ్ బాపూజీకి, మన సమాజానికి చెందిన అన్ని కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

బవళియాళి ధామ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

బవళియాళి ధామ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 20th, 04:30 pm

గుజరాత్‌లోని భర్వాడ్‌ సమాజ బవలియాళి ధామ్ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా సందేశమిచ్చారు. ముందుగా మహంత్ శ్రీరామ్ బాపూజీ, సమాజ నాయకులు, కార్యక్రమానికి హాజరైన వేలాది భక్తజనానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భర్వాడ్‌ సమాజ సంప్రదాయాలకు, వాటిని కొనసాగించడంలో జీవితం అంకితం చేసిన గౌరవనీయ సాధువులు, మహంతులకు గౌరవ నివాళి అర్పించారు. చారిత్రక మహాకుంభ్‌తో ముడిపడిన అమితానందం, ప్రతిష్టను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా మహంత్ శ్రీరామ్ బాపూజీకి ‘మహామండలేశ్వర్’ బిరుదు ప్రదానాన్ని ఓ కీలక ఘట్టంగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఇదొక చిరస్మరణీయ ఘనత మాత్రమేగాక అందరికీ అమితానందం కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. మహంత్ శ్రీరామ్ బాపూజీతోపాటు భర్వాడ్‌ సమాజంలోని కుటుంబాల సేవను, వారి విజయాలను స్మరించుకుంటున్న నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు.

భారత్‌లో న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్ అధికారిక పర్యటన ఒప్పందాలు

భారత్‌లో న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్ అధికారిక పర్యటన ఒప్పందాలు

March 17th, 02:27 pm

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్, న్యూజిలాండ్ మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి

PM Modi lays wreath at Samadhis of Sir Seewoosagur Ramgoolam and Sir Anerood Jugnauth

March 11th, 03:04 pm

PM Modi, along with Mauritius PM Navinchandra Ramgoolam, laid wreaths at the Samadhis of Sir Seewoosagur Ramgoolam and Sir Anerood Jugnauth at Pamplemousses Botanical Garden. PM Modi honored their legacies in Mauritius' progress and India-Mauritius ties. They later planted a tree under the Ek Ped Maa Ke Naam initiative, symbolizing shared commitment to nature and heritage.

వన్యమృగాల సంరక్షణలో ఎప్పటికీ అగ్రగామిగా భారత్: ప్రధానమంత్రి

March 09th, 12:10 pm

భారత్‌లో వన్యప్రాణి వైవిధ్యం సమృద్ధిగా ఉందని, ఇక్కడి సంస్కృతి వన్యమృగాలను గౌరవిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మనం మన వన్యప్రాణులను పరిరక్షించుకోవడంతోపాటు భూగ్రహం చాలా కాలం పాటు మనుగడలో ఉండేటట్లు మన వంతు తోడ్పాటును అందించడంలో అన్ని దేశాల కన్నా ముందు నిలుద్దాం’’ అని శ్రీ మోదీ అన్నారు.

గత పదేళ్లలో, పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా కూడా పెరిగింది.. ఇది వన్యప్రాణుల సంరక్షణకు మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, వాటికి చాలా కాలం కొనసాగగల నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో సూచిస్తోంది: ప్రధానమంత్రి

March 03rd, 12:36 pm

గత పది సంవత్సరాల్లో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ, వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను వాటికి కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం తెలియజేస్తోందన్నారు.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, వన్యప్రాణుల్ని చూడడానికి ఈ రోజు ఉదయం గిర్‌ వెళ్లాను.. అది రాజసం ఉట్టిపడే ఆసియా సింహాల ఆవాసమని మనకందరికీ తెలుసు; గిర్ చేరుకోవడంతో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కలసి పూర్తి చేసిన పనుల జ్ఞ‌ాపకాలెన్నో మదిలో మెదిలాయి: ప్రధానమంత్రి

March 03rd, 12:03 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వన్యప్రాణులను చూడడానికి గిర్ వెళ్లారు. రాచఠీవి ఉట్టిపడే ఆసియా సింహాల నివాసంగా గిర్ సుపరిచితమే.

నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మన భూమి మీదున్న అపురూప జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తామన్న నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి

March 03rd, 08:37 am

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఈ రోజు. మన భూగ్రహంలో అలరారుతున్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలన్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

బడ్జెట్ అనంతర వెబినార్‌లో వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై ప్రధానమంత్రి ప్రసంగం

March 01st, 01:00 pm

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న ఈ వెబినార్‌లో మీరంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగమైన మీ అందరికీ నా ధన్యవాదాలు. మా ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రవేశపెట్టిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ మా విధానాల కొనసాగింపును మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతలో ముందడుగును కూడా చూపింది. బడ్జెట్‌కు ముందు మీరంతా అందించిన సలహాలు, సూచనలు ఈ బడ్జెట్ రూపకల్పనలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సమర్థంగా ఈ బడ్జెట్‌ను అమలు చేయడం, అత్యుత్తమైన, వేగవంతమైన ఫలితాలను రాబట్టడం, అన్ని నిర్ణయాలు, విధానాలను సమర్థంగా రూపొందించడంలో మీ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 01st, 12:30 pm

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించారు. బడ్జెట్ అనంతర వెబినార్ లో పాల్గొనడం ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్ తమ ప్రభుత్వ మూడో పదవీ కాలంలోని మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ అని, ఇది విధానాలలో స్థిరత్వాన్ని ప్రదర్శించడంతో పాటు వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా కొత్త దృష్టికోణాన్ని విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందు వివిధ వర్గాల నుంచి వచ్చిన విలువైన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను మరింత ప్రభావవంతంగా రూపొందించడంలో సంబంధిత వర్గాల పాత్ర మరింత కీలకమైనదిగా మారిందని ఆయనతెలిపారు.

థాయిలాండ్‌లో సంవాద్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

February 14th, 08:30 am

థాయిలాండ్‌లో జరుగుతున్న ఈ సంవాద్ (SAMVAD) కార్యక్రమంలో మీ అందరితో భేటీ కావడం నాకు దక్కిన గౌరవం. థాయిలాండ్‌తోపాటు భారత్, జపాన్ కు చెందిన అనేక మంది ప్రముఖులు, ప్రధాన సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పాలుపంచుకొంటున్నాయి. వారు చేస్తున్న ప్రయత్నాలకు గాను వారికి నా అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

థాయ్‌లాండ్‌లో జరిగిన సంవాద్ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగ సారాంశం

February 14th, 08:10 am

థాయ్‌లాండ్‌లో జరిగిన సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో సందేశం ద్వారా ఈరోజు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... థాయ్‌లాండ్‌లో జరుగుతున్న సంవాద్‌లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దీన్ని నిర్వహించేందుకు భారత్, జపాన్, థాయ్‌లాండ్‌కు చెందిన సంస్థలు, వ్యక్తులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

February 12th, 03:24 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్ష విమానంలో పారిస్ నుంచి మార్సిలే వరకు మంగళవారం కలిసి ప్రయాణించారు. ఇద్దరు నాయకుల మధ్య సాన్నిహిత్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై వారు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం మార్సిలే చేరుకున్న తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. గత 25 సంవత్సరాలుగా బహుముఖంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల బలమైన నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు.

ప్రధాని... ఫ్రాన్స్ పర్యటన ఫలితాలు

February 12th, 03:20 pm

భారత్, ఫ్రాన్స్ కృత్రిమ మేధ డిక్లరేషన్

పరీక్షా పే చర్చ 2025: పరీక్షలకు అతీతంగా - జీవితం మరియు విజయంపై సంభాషణ

February 10th, 03:09 pm

చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ ఈరోజు ఉదయం 11 గంటలకు భారత కాలమానం ప్రకారం జరిగింది, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో ఆలోచింపజేసే చర్చలో ఒకచోట చేర్చింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని తగ్గించడం మరియు విద్య పట్ల సానుకూల విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా జరిగిన ఈ వార్షిక కార్యక్రమం, మరోసారి అభ్యాసం, జీవిత నైపుణ్యాలు మరియు మానసిక శ్రేయస్సుపై అమూల్యమైన అంతర్దృష్టులను అందించింది.

Be an example; don't demand respect, command respect. Lead by doing, not by demanding: PM Modi on PPC platform

February 10th, 11:30 am

At Pariksha Pe Charcha, PM Modi engaged in a lively chat with students at Sunder Nursery, New Delhi. From tackling exam stress to mastering time, PM Modi shared wisdom on leadership, wellness, and chasing dreams. He praised the youth for their concern about climate change, urging them to take action. Emphasizing resilience, mindfulness, and positivity, he encouraged students to shape a brighter future.

‘పరీక్షా పే చర్చా-2025’ లో భాగంగా విద్యార్థులతో ముచ్చటించిన ప్రధానమంత్రి

February 10th, 11:00 am

సుందర నర్సరీలో ఈరోజు ఏర్పాటైన ‘పరీక్షా పే చర్చా’ (పీపీసీ) ఎనిమిదో సంచిక కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో సంభాషించారు. దేశం నలుమూలల నుంచీ వచ్చిన విద్యార్థులతో ఆహ్లాదకర వాతావరణంలో ముచ్చటించిన ప్రధాని, ఈ సందర్భంగా అనేక అంశాలను స్పృశించారు. శీతాకాలంలో శరీరంలో వేడిని కలిగించే నువ్వుల మిఠాయిని ప్రధాని విద్యార్థులకు పంచారు.

భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవం.. ఐసీజీ విశిష్ట సేవలను అందిస్తోంది: ప్రధానమంత్రి

February 01st, 09:30 am

భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా మన విశాల కోస్తాతీరాన్ని కాపాడడంలో ఈ దళం కనబరుస్తున్న సాహసానికీ, అంకితభావానికీ, నిరంతర నిఘాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ దళాన్ని ప్రశంసించారు. నౌకావాణిజ్యానికి భద్రతను అందించడం మొదలు విపత్తు వేళల్లో రంగంలోకి దిగి అవసరమైన సహాయక చర్యలను చేపట్టడం, దొంగ రవాణాను కార్యకలాపాలను అరికట్టడం, పర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవడం వరకు.. సాగర జలాలకు రక్షణను అందిస్తూ, సాగర జలాల సరిహద్దులకు, మన ప్రజలకు అభయాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు.

The Genome India Project marks a defining moment in the country's biotechnology landscape: PM

January 09th, 06:38 pm

PM Modi delivered his remarks at the start of the Genome India Project. “Genome India Project is an important milestone in the biotechnology revolution”, exclaimed Shri Modi. He noted that this project has successfully created a perse genetic resource by sequencing the genomes of 10,000 inpiduals from various populations.

జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 09th, 05:53 pm

జీనోమ్‌ఇండియా ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి ఇవాళ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. పరిశోధన రంగంలో భారత్‌ నేడు చారిత్రకంగా ముందంజ వేసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 5 సంవత్సరాల కిందటే ఆమోదం లభించిందని ప్రధాని గుర్తుచేశారు. అయితే, కోవిడ్‌ మహమ్మారి ఎన్నో సవాళ్లు విసిరినా, మన శాస్త్రవేత్తలు అత్యంత శ్రద్ధాసక్తులతో దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ‘ఐఐఎస్సీ, ఐఐటీ’, ‘సిఎస్ఐఆర్’, ‘డిబిటి-బ్రిక్’ వంటి 20కిపైగా విశిష్ట పరిశోధనా సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయని శ్రీ మోదీ వివరించారు. దీని ఫలితంగా 10,000 మంది భారతీయుల జన్యు క్రమంతో కూడిన సమాచారం నేడు భారత బయోలాజికల్ డేటా సెంటర్‌లో అందుబాటులో ఉందన్నారు. జీవ సాంకేతిక పరిశోధన రంగంలో ఈ ప్రాజెక్టు ఓ కీలక మలుపుగా నిలవగలదని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తంచేస్తూ, దీనితో ముడిపడిన భాగస్వామ్య సంస్థలన్నిటికీ అభినందనలు తెలిపారు.