మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త కమాండర్ల సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త కమాండర్ల సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి

April 01st, 08:36 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త సైనిక కమాండర్ల సదస్సుకు హాజరయ్యారు. “సంసిద్ధ-సముద్ధరిత-సముచిత” సాయుధ బలగాలు ఇతివృత్తంగా మూడు రోజులపాటు ఈ సమావేశం నిర్వహించబడింది. జాతీయ భద్రత, భవిష్యత్తు కోసం సంయుక్త సైనిక బలగాల దృక్పథం రూపకల్పనసహా వివిధ రకాల అంశాలపై ఈ సందర్భంగా చర్చలు సాగాయి. అదేవిధంగా ‘స్వయం సమృద్ధి’ సాధనసహా సాయుధ బలగాల సన్నద్ధత, రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షించారు.

గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు స‌మావేశంలో ప్ర‌సంగించిన‌ ప్రధాన‌మంత్రి

గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు స‌మావేశంలో ప్ర‌సంగించిన‌ ప్రధాన‌మంత్రి

March 06th, 08:30 pm

గుజరాత్‌లోని కెవాడియాలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు స‌మావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సదస్సులో జరిగిన చర్చల గురించి ర‌క్ష‌ణ సిబ్బంది చీఫ్ ప్రధాన మంత్రికి వివరించారు. సదస్సు నిర్వ‌హ‌ణ‌, ఎజెండా పట్ల ప్రధాని ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది సదస్సులో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమీషన్డ్ ఆఫీసర్లను చేర్చడాన్ని దేశ ప్ర‌ధాని ప్రత్యేకంగా అభినందించారు.

PM to visit Kerala

PM to visit Kerala

December 14th, 10:38 am