QuoteAfter 500 years, this holy moment has come after countless and continuous sacrifice and penance of Ram devotees: PM

   అయోధ్య‌లో భవ్య, దివ్య దీపోత్సవం నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నగరవాసులతోపాటు యావ‌ద్భారత ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు శ్రీ రామచంద్రుని జన్మస్థలమైన పవిత్ర అయోధ్య నగరంలో దీపోత్సవ శోభపై తన సంతోషాన్ని సగర్వంగా ప్రజలతో పంచుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:
‘‘ఇదెంతో అద్భుతం.. అస‌మానం.. అమోఘం!
ఈ దివ్య, భవ్య దీపోత్సవంపై అయోధ్య నగర ప్రజలకు అనేకానేక అభినందనలు! లక్షలాది దివ్వెలతో భావోద్వేగభరితంగా సాగుతున్న ఈ జ్యోతిపర్వం బాల రాముడు జన్మించిన ఈ పుణ్యక్షేత్రాన్ని తేజోమయం చేసింది. అయోధ్య ధామం నుంచి పుట్టుకొచ్చిన ఈ కాంతి పుంజం దేశవ్యాప్తంగాగల నా కుటుంబ సభ్యులలో నవ్యోత్సాహం, నవోత్తేజం నింపుతోంది. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా ఆ శ్రీ రాముడు వరమివ్వాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీ రామ్!’’ అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది దీపావళికిగల ప్రత్యేకతను వివరిస్తూ-

 

 

‘‘పవిత్ర అయోధ్య!లో
మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు తన మహా మందిరంలో ప్రతిష్ఠితుడైన తర్వాత మనం నిర్వహించుకుంటున్న తొలి దీపావళి ఇది. అయోధ్యలోని బాల రాముడు వెలసిన ఈ ఆలయ అపూర్వ సౌందర్యం అందర్నీ ఆనంద సాగరంలో ఓలలాడిస్తోంది. అర్ధ శతాబ్దం (500 ఏళ్ల) తర్వాత ల‌క్ష‌లాది రామభక్తుల నిరంత‌ర త్యాగాలు, కష్టాల అనంతరం ఆవిష్కృతమైన ప‌విత్ర క్షణమిది. ఈ చారిత్రక సందర్భానికి మనమంతా ప్రత్యక్ష సాక్షులం కావడం నిజంగా మన సుకృతం. ‘వికసిత భారత్’ సంకల్ప సాకారంలో శ్రీ రామచంద్రుని జీవితం, ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం కాగలవన్నది నా ప్రగాఢ విశ్వాసం...
జై సియారాం!’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Chhatrapati Shivaji Maharaj on his Jayanti
February 19, 2025

The Prime Minister, Shri Narendra Modi has paid homage to Chhatrapati Shivaji Maharaj on his Jayanti.

Shri Modi wrote on X;

“I pay homage to Chhatrapati Shivaji Maharaj on his Jayanti.

His valour and visionary leadership laid the foundation for Swarajya, inspiring generations to uphold the values of courage and justice. He inspires us in building a strong, self-reliant and prosperous India.”

“छत्रपती शिवाजी महाराज यांच्या जयंतीनिमित्त मी त्यांना अभिवादन करतो.

त्यांच्या पराक्रमाने आणि दूरदर्शी नेतृत्वाने स्वराज्याची पायाभरणी केली, ज्यामुळे अनेक पिढ्यांना धैर्य आणि न्यायाची मूल्ये जपण्याची प्रेरणा मिळाली. ते आपल्याला एक बलशाली, आत्मनिर्भर आणि समृद्ध भारत घडवण्यासाठी प्रेरणा देत आहेत.”